అన్వేషించండి

ASHA Workers Good News: ఏపీలో ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త, త్వరలోనే ఉత్తర్వులు జారీ

ASHA workers in Andhra Pradesh | ఏపీలోని ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వారి గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచడంతో పాటు గ్రాట్యుటీకి నిర్ణయం తీసుకున్నారు.

Upper age limit for ASHA workers in Andhra Pradesh | అమరావతి: ఏపీ బడ్జెట్‌లో అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీపై శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురు అందించింది. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మొదటి రెండు ప్రసవాలకు ఇక నుంచి 180 రోజులు (6 నెలలు) వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గ్రాట్యుటీ చెల్లించి, వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో ఉత్వర్వులు జారీ కానున్నాయి. 

ఏపీ వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో పట్టణాల్లో 5,735 మంది, గ్రామాల్లో 37,017 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. ఆశా కార్యకర్తలు నెలకు రూ.10వేల వేతనం అందుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు సర్వీస్‌ ముగింపులో వారికి గ్రాట్యుటీ కింద రూ.1.5 లక్షల వరకు అందే అవకాశం ఉందని తెలుస్తోంది.

అత్యధిక జీతం ఇస్తున్న ఏకైక రాష్ట్రం

2019కి ముందు కూడా ఆశా వర్కర్‌లను చంద్రబాబు ప్రభుత్వం ఆదుకుంది. 2018లో పని కోసం వారికి అవసరమైన స్మార్ట్ ఫోన్లు అందించడం, ఏఎన్‌మ్‌ (ANM)ల నియామకంలో అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారు. వారికి రేషన్ కార్డుల జారీతో పాటు ఎన్టీఆర్ వైద్యసేవ, ఉద్యోగ విరమణ వయసు పరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ ప్రయోజనాలు కల్పించారు. వారికి వృద్ధాప్య పెన్షన్‌కు కూడా అర్హత కల్పించారు. ఈ సేవలు అందిస్తున్న వారికి తెలంగాణలో రూ.7,500, సిక్కింలో రూ.6,000, కేరళలో రూ.5,000, హర్యానా, కర్ణాటకలో రూ.4,000, ఢిల్లీలో రూ.3,000, రాజస్థాన్‌లోరూ.2,700, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.2,000, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లో రూ.750,  చొప్పున నెలవారీ వేతనం అందిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆశాలకు నెలకు రూ.10,000 చొప్పున జీతం చెల్లిస్తోంది. దేశంలో అత్యధికంగా వేతనాలు ఇస్తున్నది ఏపీ ప్రభుత్వం అని అన్నారు.  

అంగన్వాడీలకు గ్రాట్యుటీ.. బడ్జెట్‌లో పయ్యావుల ప్రకటన

అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ ఇస్తామని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.  మహిళలు, వృద్ధుల సంక్షేమానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని బడ్జెట్‌లో మంత్రి పయ్యావుల ప్రకటించారు. 
వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సాధికారత సాధిస్తున్నారు. ఏపీలో పనిచేస్తున్న 10 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో కీలకపాత్ర పోషిస్తున్నాని మంత్రి ప్రశంసించారు. రాష్ట్ర రాజకీయాలను, సంక్షేమ విధానాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందింది అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో రూ. 750 కోట్లు పక్కదారి పట్టించిందని ఆరోపించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు వైసీపీ హయాంలో విఘాతం కలిగిందని విమర్శించారు. 

నమగ్ర శిశు అభివృద్ధి పథకం (ICDS), మిషన్-శక్తి వంటి పథకాలతో మహిళలు, పిల్లలు, కౌమారదశలో తగిన పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్థిక సంవత్సరం 2025-26కి గానూ మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ. 4,332 కోట్లు కేటాయించామన్నారు మంత్రి పయ్యావుల. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు గ్రాట్యుటీ మంజూరు చేశారు.  

Also Read: GV Reddy Shocking Comments: రాజీనామా తర్వాత సీఎం చంద్రబాబుపై జీవీ రెడ్డి సంచలన పోస్ట్, సోషల్ మీడియాలో ట్రెండింగ్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget