అన్వేషించండి

Net Run Rate: ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత కీలకమైన నెట్‌రన్‌రేట్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?

యూఏఈలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో నెట్‌రన్‌రేట్‌ చాలా కీలకం అయింది. అసలు ఈ నెట్‌రన్‌రేట్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?

ఈ టీ20 వరల్డ్ కప్‌లో నెట్ రన్ రేట్(ఎన్ఆర్ఆర్) చాలా కీలకం అయింది. ఇందులోనే కాకుండా ఐపీఎల్, ఐసీసీ టోర్నమెంట్లలో ఈ నెట్ రన్‌రేట్ గురించి మనం వినే ఉంటాం. అసలు ఈ నెట్ రన్‌రేట్ అంటే ఏంటి? దీన్ని లెక్కించడం అంత కష్టమా?

నిజానికి నెట్ రన్‌రేట్‌ను లెక్కించడం అంత కష్టమేమీ కాదు. మ్యాచ్‌లో ఓవర్‌కు తాము చేసిన యావరేజ్ స్కోరు నుంచి ప్రత్యర్థి జట్టు ఓవర్‌కు చేసిన యావరేజ్ పరుగులను తీసేస్తే అదే నెట్ రన్‌రేట్. టోర్నీ మొత్తానికి నెట్ రన్‌రేట్‌ను కూడా ఇలాగే లెక్కిస్తారు.

ఒకవేళ పూర్తి కోటా ఓవర్లలోపే ఆలౌట్ అయితే కేవలం పదో వికెట్‌ను కోల్పోయినప్పుడు ఓవర్లను కాకుండా పూర్తి ఓవర్లను ఆడినట్లు లెక్కలోకి తీసుకుంటారు. కేవలం ఫలితాలు వచ్చిన మ్యాచ్‌ల్లో మాత్రమే నెట్ రన్ రేట్ లెక్కిస్తారు.

కొన్ని పరిస్థితుల వల్ల మ్యాచ్ ఆగిపోయి, డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను నిర్ణయించాల్సి వచ్చినప్పుడు.. రెండో సారి బ్యాటింగ్ చేసే జట్టు మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఎంత పరుగులు చేయాలో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) ఆ స్కోరును మొదట బ్యాటింగ్ చేసిన జట్టు స్కోరుగా పరిగణిస్తారు.

ఒకవేళ మ్యాచ్ ఆగిపోయి.. కాసేపటికి తిరిగి ప్రారంభమై, అప్పుడు డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యాన్ని సవరిస్తే.. రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టు లక్ష్యానికి ఒక్క పరుగు తగ్గించి.. దాన్ని మొదట బ్యాటింగ్ చేసిన జట్టు స్కోరుగా పరిగణిస్తారు.

ఈ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ నెట్‌రన్‌రేట్‌ను ఉదాహరణగా తీసుకుందాం. భారత్ సూపర్-12 రెండో గ్రూప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించింది.

ఈ మ్యాచ్‌ల్లో భారత్ సాధించిన స్కోర్లు ఇలా ఉన్నాయి.

1. పాకిస్తాన్‌పై - 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
2. న్యూజిలాండ్‌పై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.
3. ఆఫ్ఘనిస్తాన్‌పై 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.
4. స్కాట్లాండ్‌పై 6.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది.

ఈ నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ 66.3(లెక్కించేటప్పుడు 66.5) ఓవర్లలో 560 పరుగులు చేసింది. అంటే 560/66.5 వేస్తే ఓవర్‌కు 8.421 పరుగులు చేసినట్లు అన్నమాట.

ఇక ప్రత్యర్థి జట్లకు ఇచ్చిన స్కోర్లు చూస్తే..
1. పాకిస్తాన్‌కు 17.5 ఓవర్లలో 152 పరుగులు ఇచ్చింది.
2. న్యూజిలాండ్‌కు 14.3 ఓవర్లలో 111 పరుగులు ఇచ్చింది.
3. ఆఫ్ఘనిస్తాన్‌కు 20 ఓవర్లలో 144 పరుగులు ఇచ్చింది.
4. స్కాట్లాండ్‌ను 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ చేసింది.(ఆలౌట్ చేశారు కాబట్టి స్కాట్లాండ్ 20 ఓవర్లు ఆడినట్లే లెక్కించాలి)

ఈ నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ 72.2(లెక్కించేటప్పుడు 72.333) ఓవర్లలో 492 పరుగులు చేసింది. అంటే 492/72.333 వేస్తే ఓవర్‌కు 6.802 పరుగులు ఇచ్చినట్లు అన్నమాట.

ఇప్పుడు భారత్ చేసిన రన్‌రేట్‌లో నుంచి, ఇచ్చిన రన్‌రేట్‌ను తీసేయాలి. అంటే 8.421లో నుంచి 6.802ను తీసేయాలన్న మాట. అలా తీసేస్తే +1.619 వస్తుంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్‌రేట్ ఇదే. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఉంటే.. అప్పుడు ఈ నెట్‌రన్‌రేట్ అత్యంత కీలకం అయ్యేది. అసలు ఇలాంటి సమీకరణాలతో బుర్ర పాడు చేసుకోకుండా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలిచి నాకౌట్ దశకు చేరడంపైనే ఇకపై భారత్ దృష్టి పెట్టాలి.

Also Read: ENG vs SA, Match Highlights: ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్.. విజయం ప్రొటీస్‌కి.. సెమీస్ బెర్త్ ఆసీస్‌కి!

Also Read: WI vs AUS Match highlights: కేక పెట్టించిన వార్నర్‌ భయ్యా..! 16.2 ఓవర్లకే 158 టార్గెట్‌ కొట్టేసిన ఆసీస్‌

Also Read: Athiya Shetty and KL Rahul: కేఎల్‌ రాహుల్‌ ప్రేయసి ఆమే..! టీమ్‌ఇండియాలో మరో ప్రేమకథ..! బాలీవుడ్‌ నటితో రాహుల్‌ ప్రేమాయణం!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Virat Kohli:విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Embed widget