అన్వేషించండి

YS Jagan: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !

YSRCP: వైఎస్ జగన్ అక్రమాస్తులను జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ED issues orders seizure YS Jagan  illegal assets: జగన్ అక్రమాస్తుల కేసులో చాలా కాలం తర్వాత ఈడీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్  కు చెందిన మొత్తంగా రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాలోని సున్నపురాయి గనుల తవ్వకాల్లో  అక్రమాలు జరిగాయని గతంలో CBI చార్జిషీటు దాఖలుచేసింది. దీనిపై 2013 లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఈడీ కేసులు పెట్టింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ. 150 కోట్ల మేర జగన్ లబ్ధి పొందారని CBI తేల్చింది. CBI చార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ తేల్చి ఇప్పుడు ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  

CBI చార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ తేల్చి ఇప్పుడు ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్‌ రూ.150 కోట్ల లబ్ధిని షేర్లు, హవాలా రూపంలో నగదు పొందినట్లు ఈడీ గుర్తించింది. రూ.95కోట్లు రఘురాం సిమెంట్స్‌లో షేర్లు  పొందారు. ఇది తర్వాత భారతి సిమెంట్స్ గా మారింది. రూ.55కోట్లు హవాలా రూపంలో డబ్బు ఇచ్చినట్లు గుర్తించారు.  కడప జిల్లాలోని సుమారు 417 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సున్నపురాయి  గనులను దాల్మియా సిమెంట్స్ సంస్థకు అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ కాలంలో లీజుగా మంజూరు చేశారు. 

జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో దాల్మియా సిమెంట్స్‌ కేసు కీలకమైనది.   కడప జిల్లాలో దాల్మియా సిమెంట్స్‌కు 417 హెక్టార్ల భూమి కేటాయించారు. ఇందులో సున్నపు రాయి ఉంటుంది. ఈ భూములు కేటాయించినందుకు  జగన్‌కు సంబంధించిన సాక్షి మీడియా గ్రూప్ ,  ఇతర సంస్థలలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ కేసు పెట్టింది. దాల్మియా సిమెంట్స్ నుండి వచ్చిన పెట్టుబడులు అక్రమ ఆదాయంగా ఈడీ నిర్ణయించింది.  గతంలో  దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియా తమపై ఉన్న కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 ఎప్పుడూ విచారణకు హాజరు కాలేదు. 2021లో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా  వాయిదా కోరినందుకు హైకోర్టు రోజుకు రూ. 50,000 ఖర్చులు చెల్లించాలని పునీత్ దాల్మియాను ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులన్నీ   ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ,  సీబీఐ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.  సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినప్పటికీ చురుకుగా ముందుకు సాగడం లేదు.  

అయితే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిన పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈడీ ఆస్తులు జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో కేసుల దర్యాప్తులు ఆగిపోయాయి. విదేశాల నుంచి సమాచారం కోసం దర్యాప్తు సంస్థలు ప్రయత్నించాయని చెబుతారు. ఇటీవలి కాలంలో కోర్టుల్లో ట్రయల్ కూడా జరగడం లేదు. అనూహ్యంగా ఈడీ నిర్మయం తీసుకోవడంతో.. ఇక నుంచి కేసుల విచారణ ఊపందుకుంటుందని భావిస్తున్నారు.                       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fire Accident: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
TG EAPCET 2026 Toppers List: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Horror Thriller OTT : ఊరిలో చేతబడులతో వరుస హత్యలు - ఎవరూ ఊహించని క్లైమాక్స్... ఓటీటీలో వీకెండ్ హారర్ థ్రిల్లర్
ఊరిలో చేతబడులతో వరుస హత్యలు - ఎవరూ ఊహించని క్లైమాక్స్... ఓటీటీలో వీకెండ్ హారర్ థ్రిల్లర్
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Mouni Roy: విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
Embed widget