అన్వేషించండి

YS Jagan: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !

YSRCP: వైఎస్ జగన్ అక్రమాస్తులను జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ED issues orders seizure YS Jagan  illegal assets: జగన్ అక్రమాస్తుల కేసులో చాలా కాలం తర్వాత ఈడీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్  కు చెందిన మొత్తంగా రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాలోని సున్నపురాయి గనుల తవ్వకాల్లో  అక్రమాలు జరిగాయని గతంలో CBI చార్జిషీటు దాఖలుచేసింది. దీనిపై 2013 లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఈడీ కేసులు పెట్టింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ. 150 కోట్ల మేర జగన్ లబ్ధి పొందారని CBI తేల్చింది. CBI చార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ తేల్చి ఇప్పుడు ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  

CBI చార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ తేల్చి ఇప్పుడు ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్‌ రూ.150 కోట్ల లబ్ధిని షేర్లు, హవాలా రూపంలో నగదు పొందినట్లు ఈడీ గుర్తించింది. రూ.95కోట్లు రఘురాం సిమెంట్స్‌లో షేర్లు  పొందారు. ఇది తర్వాత భారతి సిమెంట్స్ గా మారింది. రూ.55కోట్లు హవాలా రూపంలో డబ్బు ఇచ్చినట్లు గుర్తించారు.  కడప జిల్లాలోని సుమారు 417 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సున్నపురాయి  గనులను దాల్మియా సిమెంట్స్ సంస్థకు అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ కాలంలో లీజుగా మంజూరు చేశారు. 

జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో దాల్మియా సిమెంట్స్‌ కేసు కీలకమైనది.   కడప జిల్లాలో దాల్మియా సిమెంట్స్‌కు 417 హెక్టార్ల భూమి కేటాయించారు. ఇందులో సున్నపు రాయి ఉంటుంది. ఈ భూములు కేటాయించినందుకు  జగన్‌కు సంబంధించిన సాక్షి మీడియా గ్రూప్ ,  ఇతర సంస్థలలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ కేసు పెట్టింది. దాల్మియా సిమెంట్స్ నుండి వచ్చిన పెట్టుబడులు అక్రమ ఆదాయంగా ఈడీ నిర్ణయించింది.  గతంలో  దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియా తమపై ఉన్న కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 ఎప్పుడూ విచారణకు హాజరు కాలేదు. 2021లో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా  వాయిదా కోరినందుకు హైకోర్టు రోజుకు రూ. 50,000 ఖర్చులు చెల్లించాలని పునీత్ దాల్మియాను ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులన్నీ   ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ,  సీబీఐ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.  సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినప్పటికీ చురుకుగా ముందుకు సాగడం లేదు.  

అయితే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిన పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈడీ ఆస్తులు జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో కేసుల దర్యాప్తులు ఆగిపోయాయి. విదేశాల నుంచి సమాచారం కోసం దర్యాప్తు సంస్థలు ప్రయత్నించాయని చెబుతారు. ఇటీవలి కాలంలో కోర్టుల్లో ట్రయల్ కూడా జరగడం లేదు. అనూహ్యంగా ఈడీ నిర్మయం తీసుకోవడంతో.. ఇక నుంచి కేసుల విచారణ ఊపందుకుంటుందని భావిస్తున్నారు.                       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
Hyderabad News: బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
Smartphone Exposure in Kids : చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
Embed widget