అన్వేషించండి

AP DSC 2025: ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?

AP DSC 2025: వారం రోజుల్లో డీఎస్సీ 2025 వేయనున్న ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. ఈసారి అప్లికేషన్ దశలోనే సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేయనుంది.

AP DSC 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి డీఎస్సీని పక్కా ప్రణాళికతో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి దరఖాస్తులను రెండు విభాగాలుగా స్వీకరించబోతున్నారని తెలుస్తోంది. డీఎస్సీకి అప్లై చేయాలనుకునే వాళ్లు కచ్చితంగా కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. లేకుంటే తప్పులో కాలు వేస్తారు. అంతే కాకుండా అన్ని సర్టిఫికెట్లు కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. దరఖాస్తు టైంలోనే వాటిని అప్‌లోడ్ చేయాలి. 

సాధారణంగా డీఎస్సీలో విజయం సాధించిన తర్వాత పోస్టింగ్ తీసుకునే టైంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్, పాఠశాల ఎంపికను పూర్తి చేస్తారు. కానీ ఈసారి ముందుగానే పాఠశాల ఎంపికను ఇస్తున్నారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే టైంలోనే మీరు ప్రభుత్వం, పురపాలక, పంచాయతీరాజ్‌, ఆదర్శపాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమ శాఖ నిర్వహించే పాఠశాల్లో దేనిలో ఆసక్తి  చూపిస్తారో చెప్పాల్సి ఉంటుంది. దీనికి ప్రయార్టీ ఇస్తారు. దీని ఆధారంగా మీరు డీఎస్సీలో ఎంపికైన తర్వాత పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మార్చుకోవడానికి వీలు ఉండదు. దీన్ని డీఎస్సీ అప్లికేషన్ పార్ట్‌ ఏలో పెడుతున్నారు. 

ఇక పార్ట్ బీలో మీ వివరాలు నమోదు చేసి సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏడో తరగతి నుంచి బీఈడీ వరకు అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. దీంతోపాటు కుల, పీహెచ్‌, ధ్రువీకరించే సర్టిఫికెట్లను కూడా సిద్ధం చేసుకోవాలి. అందుకే ముందుగానే వీటిని సిద్ధం చేసుకోవడం ఉత్తమం అని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ ఆఫీసులు కిక్కిరిసిపోతాయని అంటున్నారు. ముందుగానే అప్లై చేసుకొని సద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.  

మొదటి నుంచి చెబుతున్నట్టుగానే 16,347 ఉద్యోగాలతో నార్మల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ మధ్య ప్రకటించిన 2,260 ప్రత్యేక విద్య టీచర్ పోస్టులను తర్వాత భర్తీ చేస్తారు. ఈ రెండింటిని కలపడం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రిపేర్ అయ్యేందుకు స్పెషల్ బీఈడీ విద్యార్థులకు సమయం ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయనుంది. 

టెట్ పెట్టి చాలా కాలం అవుతున్నందున రెండూ కలిపి నిర్వహించాలని డిమాండ్ అభ్యర్థుల నుంచి వస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం డీఎస్సీ మాత్రమే నిర్వహించాలని చూస్తోంది. ఇప్పటికే ఆలస్యమైనందున రెండింటినీ కలిపే ఆలోచన లేనట్టుగానే చెబుతోంది.  

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Embed widget