అన్వేషించండి

AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

Andhra Pradesh DSC Notification | ఏపీలో త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు.

Nara Lokesh On AP DSC Notification | అమరావతి: ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. మరో 5 రోజుల్లో DSC నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు 16,347 పోస్టుల DSC నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. సాధ్యమైనంత త్వరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. SC వర్గీకరణ ప్రక్రియ పూర్తైన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్, టీచర్ పోస్టుల భర్తీపై ముందుకెళ్లామని ఆగడంతోనే ఆలస్యమైందని నారా లోకేష్ చెప్పారు. ఎస్సీ కమిషన్ రిపోర్టుపై ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, 2 రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. 

2,260 కొత్త టీచర్ పోస్టులకు ప్రభుత్వం అనుమతి

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 2,260  పోస్టులను క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 1,136 స్పెషల్ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు, 1,124 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ఖాళీలను డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ (AP DSC) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి దోహదం చేయనుంది. ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు టీచింగ్ చేయనున్నారు. విద్యను బోధించడానికి వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణ సైతం ఇస్తుంది.

 

జిల్లాలు ఎస్‌జీటీ పోస్టులు స్కూల్ అసిస్టెంట్  పోస్టులు
అనంత‌పురం  101 100
చిత్తూరు 117 82
తూర్పుగోదావ‌రి 127 151
గుంటూరు 151 98
వైఎస్ఆర్ క‌డ‌ప 57 49
కృష్ణా 71 89
క‌ర్నూలు 110 130
శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు 63 44
ప్రకాశం 74 50
శ్రీకాకుళం 71 109
విశాఖ‌ప‌ట్నం 59 52
విజ‌య‌న‌గరం 45 66
ప‌శ్చిమ గోదావ‌రి 90 105

వైసీపీ హయాంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్న లోకేష్

గత వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ వేయలేదని, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని మంత్రి నారా లోకేష్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో పేర్కొన్నారు. గత 30 ఏళ్లలో టిడిపి హయాంలో 13 డిఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి, వాటి ద్వారా ఏకంగా 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేసినట్లు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ లో సైతం 2014-19 కాలంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంలో సైతం మూడు డిఎస్సీలు నిర్వహించి 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసినట్లు పేర్కొన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Embed widget