అన్వేషించండి

Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

Telangana Jagrthi: తెలంగాణ జాగృతిని రాజకీయ శక్తిగా మారుస్తానని కవిత ప్రకటించారు. అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం తర్వాత గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు.

Kavitha will turn Telangana Jagruti into a political force:  బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత  తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. తన సామాజిక సంస్థ 'తెలంగాణ జాగృతి'ని రాజకీయ పార్టీగా మారుస్తానని సంచలన ప్రకటన చేశారు. శాసనమండలి వేదికగా కన్నీటి పర్యంతమైన ఆమె, అనంతరం గన్‌పార్కు వద్ద మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.  

కల్వకుంట్ల కవిత తన సొంత సంస్థ అయిన 'తెలంగాణ జాగృతి'ని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శాసనమండలికి రాజీనామా చేసిన అనంతరం, అమరవీరుల స్తూపం సాక్షిగా ఆమె ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, ప్రజల గొంతుకగా నిలిచేందుకు ఒక కొత్త రాజకీయ శక్తి అవసరం ఉందని, ఆ బాధ్యతను తెలంగాణ జాగృతి తీసుకుంటుంది అని ఆమె స్పష్టం చేశారు.       

బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కవిత, ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కక్షగట్టే ధోరణి పెరిగిపోయిందని, తనను ఘోరంగా అవమానించి బయటకు పంపారని ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసుల సమయంలో పార్టీ తనకు అండగా నిలవలేదని, తన సొంత పుట్టిన ఇల్లే తనను చిన్నచూపు చూసిందని వాపోయారు. అందుకే ఆత్మగౌరవం కోసం, ప్రజల పక్షాన నిలబడటం కోసం బంధాలన్నీ తెంచుకుని బయటకు వచ్చినట్లు వివరించారు.   

కొత్త పార్టీ విధివిధానాల గురించి మాట్లాడుతూ.. సెక్యులర్లు, మావోయిస్టు సానుభూతిపరులు, యువత, నిరుద్యోగులు తనతో కలిసి నడవాలని కవిత పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణే తన లక్ష్యమని, 2029 ఎన్నికల్లో తమ పార్టీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న  జాగృతి జనం బాట యాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, త్వరలోనే పార్టీ పేరు, జెండా మరియు అజెండాను అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ మహిళలను, నిరుద్యోగులను మోసం చేశాయని కవిత విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించేందుకే తాను ఈ అడుగు వేస్తున్నట్లు తెలిపారు.  ప్రజలు, దేవుడి దయతో గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాం. చట్టసభల్లో తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడుతాం అని  ధీమా వ్యక్తం చేశారు.   

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Jayalalithaa Residence: హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్.. అసలు కారణం ఇదే..!
హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్.. అసలు కారణం ఇదే..!
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
India Census 2027: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
Advertisement

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Embed widget