అన్వేషించండి

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!

Telangana RTC Protest:ఆర్టీసీ ఈవీ బస్‌ల నిర్వహణపై జేఏసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రిక్‌ బస్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ఆర్టీసీ ద్వారానే నడపాలని, సంస్థ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సమ్మెకు సిద్ధం.
  • 31 డిమాండ్లతో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నోటీసు ఇచ్చింది.
  • ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగుల హోదా కోరుతున్నారు.
  • బకాయిలు చెల్లించాలి, ఈవీ బస్సులను ఆర్టీసీనే నడపాలి.

Telangana RTC Protest : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది ఆందోళన బాట పట్టనున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. మార్చి 13న డెడ్‌లైన్ విధించినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో శుక్రవారం ఆర్టీసీ యాజమాన్యానికి జాయింట్ యాక్షన్ కమిటీ అధికారికంగా సమ్మె నోటీసును అందజేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 

సమ్మెకు దారి తీసిన పరిస్థితులు

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గత నెలలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మార్చి 13లోగా పరిష్కారం లభించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని, ఆపై సమ్మెకు దిగుతామని స్పష్టం చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో కదలిక లేకపోవడంతో ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు, అలాగే కార్మిక శాఖ కమిషనర్‌కు నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. చట్టప్రకారం 14 రోజుల నోటీసు పిరియడ్‌ తర్వాత అంటే మార్చి 26 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్‌లు నిలిపివేసి సమ్మె ప్రారంభించనున్నట్టు జేఏసీ స్పష్టం చేసింది. 

ప్రధానంగా వినిపిస్తున్న 31 డిమాండ్లు 

ఆర్టీసీ జేఏసీ  నేతృత్వంలో మొత్తం 31 డిమాండ్లతో కూడిన నివేదికను యాజమాన్యానికి సమర్పించారు. ఇందులో ఆర్థికపరమైన అంశాలతోపాటు సంస్థ మనుగడకు సంబంధించిన కీలక డిమాండ్లు ఉన్నాయి. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి, పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నాటి వేతన సవరణను అమలు  చేసినప్పటికీ , దానికి సంబంధించిన ఎరియర్స్‌ను ఇంకా చెల్లించలేదు. సుమారు 2,150 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కార్మికులు కోరుతున్నారు. 2021 నాటి వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో తక్షణమే ప్రకటించి, అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. నెలకు 350 కోట్ల చొప్పున ఎటువంటి మినహాయింపులు లేకుండా ఆర్టీసీకి చెల్లించాలని వారు కోరుతున్నారు. గత ప్రభుత్వం నుంచి రావాల్సిన 2500 కోట్ల పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంస్థను కాపాడుకోవడంలో భాగంగా ఈవీ బస్‌ల నిర్వహణపై జేఏసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రిక్‌ బస్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ఆర్టీసీ ద్వారానే నడపాలని, తద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించింది. 

పనిభారం తగ్గించాలని డిమాండ్ 

మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీని వల్ల కండక్టర్లు, డ్రైవర్లపై పని భారం అధికమైందని, దీనిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల కార్మికులకు తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్రజాస్వామ్య వేదిక లభిస్తుందని వారు భావిస్తున్నారు.                     
 

Frequently Asked Questions

ఆర్టీసీ సిబ్బంది ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు.

సమ్మె ఎప్పుడు ప్రారంభమవుతుంది?

చట్టప్రకారం 14 రోజుల నోటీసు పిరియడ్​ తర్వాత, అంటే మార్చి 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిపివేసి సమ్మె ప్రారంభించనున్నారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏమిటి?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించడం, బకాయిలు చెల్లించడం, 2021 వేతన సవరణ అమలు చేయడం వారి ప్రధాన డిమాండ్లు.

మహాలక్ష్మి పథకం ఆర్టీసీపై ఎలాంటి ప్రభావం చూపుతోంది?

మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగి, కండక్టర్లు, డ్రైవర్లపై పని భారం పెరిగింది. అలాగే, పథకం కింద రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
LPG Tanker Explosion: టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
Embed widget