అన్వేషించండి

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!

Telangana RTC Protest:ఆర్టీసీ ఈవీ బస్‌ల నిర్వహణపై జేఏసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రిక్‌ బస్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ఆర్టీసీ ద్వారానే నడపాలని, సంస్థ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సమ్మెకు సిద్ధం.
  • 31 డిమాండ్లతో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నోటీసు ఇచ్చింది.
  • ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగుల హోదా కోరుతున్నారు.
  • బకాయిలు చెల్లించాలి, ఈవీ బస్సులను ఆర్టీసీనే నడపాలి.

Telangana RTC Protest : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది ఆందోళన బాట పట్టనున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. మార్చి 13న డెడ్‌లైన్ విధించినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో శుక్రవారం ఆర్టీసీ యాజమాన్యానికి జాయింట్ యాక్షన్ కమిటీ అధికారికంగా సమ్మె నోటీసును అందజేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 

సమ్మెకు దారి తీసిన పరిస్థితులు

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గత నెలలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మార్చి 13లోగా పరిష్కారం లభించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని, ఆపై సమ్మెకు దిగుతామని స్పష్టం చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో కదలిక లేకపోవడంతో ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు, అలాగే కార్మిక శాఖ కమిషనర్‌కు నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. చట్టప్రకారం 14 రోజుల నోటీసు పిరియడ్‌ తర్వాత అంటే మార్చి 26 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్‌లు నిలిపివేసి సమ్మె ప్రారంభించనున్నట్టు జేఏసీ స్పష్టం చేసింది. 

ప్రధానంగా వినిపిస్తున్న 31 డిమాండ్లు 

ఆర్టీసీ జేఏసీ  నేతృత్వంలో మొత్తం 31 డిమాండ్లతో కూడిన నివేదికను యాజమాన్యానికి సమర్పించారు. ఇందులో ఆర్థికపరమైన అంశాలతోపాటు సంస్థ మనుగడకు సంబంధించిన కీలక డిమాండ్లు ఉన్నాయి. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి, పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నాటి వేతన సవరణను అమలు  చేసినప్పటికీ , దానికి సంబంధించిన ఎరియర్స్‌ను ఇంకా చెల్లించలేదు. సుమారు 2,150 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కార్మికులు కోరుతున్నారు. 2021 నాటి వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో తక్షణమే ప్రకటించి, అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. నెలకు 350 కోట్ల చొప్పున ఎటువంటి మినహాయింపులు లేకుండా ఆర్టీసీకి చెల్లించాలని వారు కోరుతున్నారు. గత ప్రభుత్వం నుంచి రావాల్సిన 2500 కోట్ల పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంస్థను కాపాడుకోవడంలో భాగంగా ఈవీ బస్‌ల నిర్వహణపై జేఏసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రిక్‌ బస్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ఆర్టీసీ ద్వారానే నడపాలని, తద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించింది. 

పనిభారం తగ్గించాలని డిమాండ్ 

మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీని వల్ల కండక్టర్లు, డ్రైవర్లపై పని భారం అధికమైందని, దీనిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల కార్మికులకు తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్రజాస్వామ్య వేదిక లభిస్తుందని వారు భావిస్తున్నారు.                     
 

Frequently Asked Questions

ఆర్టీసీ సిబ్బంది ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు.

సమ్మె ఎప్పుడు ప్రారంభమవుతుంది?

చట్టప్రకారం 14 రోజుల నోటీసు పిరియడ్​ తర్వాత, అంటే మార్చి 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిపివేసి సమ్మె ప్రారంభించనున్నారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏమిటి?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించడం, బకాయిలు చెల్లించడం, 2021 వేతన సవరణ అమలు చేయడం వారి ప్రధాన డిమాండ్లు.

మహాలక్ష్మి పథకం ఆర్టీసీపై ఎలాంటి ప్రభావం చూపుతోంది?

మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగి, కండక్టర్లు, డ్రైవర్లపై పని భారం పెరిగింది. అలాగే, పథకం కింద రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో మహిమాన్విత నారసింహ క్షేత్రాలివే!
తెలంగాణలో మహిమాన్విత నారసింహ క్షేత్రాలివే!
Free MMTS Travel In Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం
Zolgensma injection cost:  పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
 పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
Hyderabad Bus Fire: ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
Meta Layoffs 2026: మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
Chittoor Leopard: చిత్తూరు నడిబొడ్డున చిరుత పులుల సంచారం.. స్పృహతప్పి గాయాలతో జనావాసాల మధ్య
చిత్తూరు నడిబొడ్డున చిరుత పులుల సంచారం.. స్పృహతప్పి గాయాలతో జనావాసాల మధ్య
Embed widget