అన్వేషించండి

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!

Telangana RTC Protest:ఆర్టీసీ ఈవీ బస్‌ల నిర్వహణపై జేఏసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రిక్‌ బస్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ఆర్టీసీ ద్వారానే నడపాలని, సంస్థ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Telangana RTC Protest : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది ఆందోళన బాట పట్టనున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. మార్చి 13న డెడ్‌లైన్ విధించినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో శుక్రవారం ఆర్టీసీ యాజమాన్యానికి జాయింట్ యాక్షన్ కమిటీ అధికారికంగా సమ్మె నోటీసును అందజేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 

సమ్మెకు దారి తీసిన పరిస్థితులు

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గత నెలలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మార్చి 13లోగా పరిష్కారం లభించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని, ఆపై సమ్మెకు దిగుతామని స్పష్టం చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో కదలిక లేకపోవడంతో ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు, అలాగే కార్మిక శాఖ కమిషనర్‌కు నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. చట్టప్రకారం 14 రోజుల నోటీసు పిరియడ్‌ తర్వాత అంటే మార్చి 26 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్‌లు నిలిపివేసి సమ్మె ప్రారంభించనున్నట్టు జేఏసీ స్పష్టం చేసింది. 

ప్రధానంగా వినిపిస్తున్న 31 డిమాండ్లు 

ఆర్టీసీ జేఏసీ  నేతృత్వంలో మొత్తం 31 డిమాండ్లతో కూడిన నివేదికను యాజమాన్యానికి సమర్పించారు. ఇందులో ఆర్థికపరమైన అంశాలతోపాటు సంస్థ మనుగడకు సంబంధించిన కీలక డిమాండ్లు ఉన్నాయి. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి, పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నాటి వేతన సవరణను అమలు  చేసినప్పటికీ , దానికి సంబంధించిన ఎరియర్స్‌ను ఇంకా చెల్లించలేదు. సుమారు 2,150 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కార్మికులు కోరుతున్నారు. 2021 నాటి వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో తక్షణమే ప్రకటించి, అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. నెలకు 350 కోట్ల చొప్పున ఎటువంటి మినహాయింపులు లేకుండా ఆర్టీసీకి చెల్లించాలని వారు కోరుతున్నారు. గత ప్రభుత్వం నుంచి రావాల్సిన 2500 కోట్ల పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంస్థను కాపాడుకోవడంలో భాగంగా ఈవీ బస్‌ల నిర్వహణపై జేఏసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రిక్‌ బస్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ఆర్టీసీ ద్వారానే నడపాలని, తద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించింది. 

పనిభారం తగ్గించాలని డిమాండ్ 

మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీని వల్ల కండక్టర్లు, డ్రైవర్లపై పని భారం అధికమైందని, దీనిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల కార్మికులకు తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్రజాస్వామ్య వేదిక లభిస్తుందని వారు భావిస్తున్నారు.                     
 

Frequently Asked Questions

ఆర్టీసీ సిబ్బంది ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు.

సమ్మె ఎప్పుడు ప్రారంభమవుతుంది?

చట్టప్రకారం 14 రోజుల నోటీసు పిరియడ్​ తర్వాత, అంటే మార్చి 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిపివేసి సమ్మె ప్రారంభించనున్నారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏమిటి?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించడం, బకాయిలు చెల్లించడం, 2021 వేతన సవరణ అమలు చేయడం వారి ప్రధాన డిమాండ్లు.

మహాలక్ష్మి పథకం ఆర్టీసీపై ఎలాంటి ప్రభావం చూపుతోంది?

మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగి, కండక్టర్లు, డ్రైవర్లపై పని భారం పెరిగింది. అలాగే, పథకం కింద రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Allu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?
అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?
Advertisement

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Embed widget