Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Ustaad Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బెనిఫిట్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఫస్ట్ 10 రోజులకు టికెట్ ధరలు సైతం పెరిగాయి.

Pawan Kalyan's Ustaad Bhagat Singh Ticket Rates Hike In AP : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ బెనిఫిట్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, టికెట్ ధరలు సైతం పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
టికెట్ ధరలు ఎంతంటే?
ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... అదే రోజు తెల్లవారుజామున ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీని టికెట్ ధర రూ.500 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. అలాగే, 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 వరకూ పెంచుకోవచ్చు. ఫస్ట్ 10 రోజుల తర్వాత సాధారణ టికెట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి. రీసెంట్గా స్టార్ హీరోల మూవీస్ ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోస్ ప్రదర్శిస్తారు. అయితే, అదే రోజున ధురంధర్ 2 మూవీ కూడా రిలీజ్ ఉంది. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ ముందు రోజు రాత్రి షో ఉందా లేదా? అనే దానిపై క్లారిటీ లేదు.
Also Read : రాకాస ఓటీటీ డీల్ ఫిక్స్ - హారర్ ఫాంటసీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ టికెట్ ధరలు పెంచే ఛాన్స్ ఉంది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. టికెట్ ధరలు పెంచాలనుకుంటే 90 రోజుల ముందే జీవో జారీ చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో రిలీజ్కు ముందు టికెట్ ధరలు, బెనిఫిట్ షోలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్సే సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసి స్టే తెచ్చుకుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఏర్పాట్లు
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మేకర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 15న ఆదివారం యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ సహా ఇతర నటీనటులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీం భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేయగా... రన్ టైం 2 గంటల 34 నిమిషాలు ఫిక్స్ చేశారు. ఎలాంటి కట్స్ లేకుండానే సర్టిఫికెట్ జారీ చేసినట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. ఇక ట్రైలర్ ఈ నెల 14న రిలీజ్ కానుండగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్, లుక్స్, ట్రైలర్ టీజ్ గూస్ బంప్స్ తెప్పించాయి. దీంతో ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా... పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమిళ హీరో పార్తిబన్ విలన్ రోల్ చేశారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా... థమన్ బీజీఎం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. పవన్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుండడంతో అంచనాలు మామూలుగా లేవు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















