అన్వేషించండి

Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!

Telangana Tenth Class Exams: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5, 17, 727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం ప్రభుత్వం మొత్తం 2, 676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు.
  • లక్షలాది విద్యార్థులకు సీఎం, గవర్నర్ నుండి ప్రోత్సాహకర సందేశాలు.
  • రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాలలో 5 లక్షల మందికి పైగా హాజరు.
  • పరీక్షా పారదర్శకతకు కఠిన నిబంధనలు, సెల్ ఫోన్ నిషేధం.

Telangana Tenth Class Exams: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయిగా భావంచే పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షల మంది విద్యార్థులు భవిష్యత్‌ను నిర్ణయించే ఈ పరీక్షాపర్వం ఏప్రిల్ 16 వరకు కొనసాగనుంది. అటు ప్రభుత్వం, ఇటు విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. 

ముఖ్యమంత్రి, గవర్నర్ శుభాకాంక్షలు

పరీక్షలకు హాజరవుతున్న లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. పదో తరగతి పరీక్షలు భవిష్యత్‌కు తొలి మెట్టు అని, విద్యార్థులు ఎవరూ భయం, ఆందోళన లేకుండా ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. ఆత్మ విశ్వాసంతో, ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాసి ప్రతిభను చాటుకోవాలని సీఎం ఆకాంక్షించారు. 

తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా కూడా విద్యార్థులకు తన సందేశాన్ని పంపారు. పరీక్షలు ఒక భారంలా కాకుండా, తమ జ్ఞానాన్ని ప్రదర్శించే అద్భుతమైన అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. సానుకూల దృక్పథం క్రమశిక్షణతో కూడిన సమయపాలన విజయానికి మార్గాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల వెనుక ఉండి వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, గురువుల కృషిని కూడా గవర్నర్‌ ఈ సందర్భంగా అభినందించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5, 17, 727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం ప్రభుత్వం మొత్తం 2, 676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 1582 కేంద్రాలు, ప్రైవేటు పాఠశాలల్లో 1,094 కేంద్రాలను కేటాయించారు. 

మార్చీ 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు జరగనున్నాయి. ఉదయం పరీక్ష ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. అంటే ఉదయం 9.35 గంటల తర్వాత వచ్చే విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

పరీక్షల పారదర్శకత కోసం విద్యాశాఖ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. పరీక్ష కేంద్రాలకు పూర్తి స్థాయిలో నో సెల్‌ ఫోన్‌ జోన్లుగా ప్రకటించారు. విద్యార్థులే కాదు, పరీక్ష సిబ్బంది, ఇన్విజిలేటర్లు, చివరకు చెక్ చేయడానికి వచ్చే స్క్వాడ్ అధికారులు కూడా సెల్‌ఫోన్లను లోపలికి తీసుకెళ్లకూడు. ఒక వేళ ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారిని సస్పెండ్ చేస్తారు. పరీక్షా పత్రాల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏ ఉద్యోగి అయినా పేప్ లీకేజీలు పాల్పడిదే వారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. విద్యార్థుల సౌకర్యార్థం మోడల్ OMR షీట్లు, జవాబు పత్రాల ఫార్మట్‌ను బోర్డు అధికారికంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు వెళ్లే ముందే వీటిని పరిశీలించడం ద్వారా విద్యార్థులు పరీక్షా సమయంలో తడబాటు లేకుండా ఉంటారు.  

Frequently Asked Questions

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి?

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరు కానున్నారు?

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5,17,727 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.

పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు ప్రవేశం ఉంటుందా?

పరీక్ష ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. అంటే, ఉదయం 9:35 గంటల తర్వాత వచ్చే వారికి ప్రవేశం ఉండదు.

పరీక్ష కేంద్రాలలో సెల్ ఫోన్ వాడకంపై నిబంధనలు ఏమిటి?

పరీక్ష కేంద్రాలు పూర్తి స్థాయిలో నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. విద్యార్థులు, సిబ్బంది, ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ అధికారులు కూడా సెల్ ఫోన్లను లోపలికి తీసుకెళ్లకూడదు.

టాప్ హెడ్ లైన్స్

Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget