అన్వేషించండి

Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!

Telangana Tenth Class Exams: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5, 17, 727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం ప్రభుత్వం మొత్తం 2, 676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు.
  • లక్షలాది విద్యార్థులకు సీఎం, గవర్నర్ నుండి ప్రోత్సాహకర సందేశాలు.
  • రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాలలో 5 లక్షల మందికి పైగా హాజరు.
  • పరీక్షా పారదర్శకతకు కఠిన నిబంధనలు, సెల్ ఫోన్ నిషేధం.

Telangana Tenth Class Exams: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయిగా భావంచే పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షల మంది విద్యార్థులు భవిష్యత్‌ను నిర్ణయించే ఈ పరీక్షాపర్వం ఏప్రిల్ 16 వరకు కొనసాగనుంది. అటు ప్రభుత్వం, ఇటు విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. 

ముఖ్యమంత్రి, గవర్నర్ శుభాకాంక్షలు

పరీక్షలకు హాజరవుతున్న లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. పదో తరగతి పరీక్షలు భవిష్యత్‌కు తొలి మెట్టు అని, విద్యార్థులు ఎవరూ భయం, ఆందోళన లేకుండా ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. ఆత్మ విశ్వాసంతో, ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాసి ప్రతిభను చాటుకోవాలని సీఎం ఆకాంక్షించారు. 

తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా కూడా విద్యార్థులకు తన సందేశాన్ని పంపారు. పరీక్షలు ఒక భారంలా కాకుండా, తమ జ్ఞానాన్ని ప్రదర్శించే అద్భుతమైన అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. సానుకూల దృక్పథం క్రమశిక్షణతో కూడిన సమయపాలన విజయానికి మార్గాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల వెనుక ఉండి వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, గురువుల కృషిని కూడా గవర్నర్‌ ఈ సందర్భంగా అభినందించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5, 17, 727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం ప్రభుత్వం మొత్తం 2, 676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 1582 కేంద్రాలు, ప్రైవేటు పాఠశాలల్లో 1,094 కేంద్రాలను కేటాయించారు. 

మార్చీ 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు జరగనున్నాయి. ఉదయం పరీక్ష ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. అంటే ఉదయం 9.35 గంటల తర్వాత వచ్చే విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

పరీక్షల పారదర్శకత కోసం విద్యాశాఖ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. పరీక్ష కేంద్రాలకు పూర్తి స్థాయిలో నో సెల్‌ ఫోన్‌ జోన్లుగా ప్రకటించారు. విద్యార్థులే కాదు, పరీక్ష సిబ్బంది, ఇన్విజిలేటర్లు, చివరకు చెక్ చేయడానికి వచ్చే స్క్వాడ్ అధికారులు కూడా సెల్‌ఫోన్లను లోపలికి తీసుకెళ్లకూడు. ఒక వేళ ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారిని సస్పెండ్ చేస్తారు. పరీక్షా పత్రాల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏ ఉద్యోగి అయినా పేప్ లీకేజీలు పాల్పడిదే వారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. విద్యార్థుల సౌకర్యార్థం మోడల్ OMR షీట్లు, జవాబు పత్రాల ఫార్మట్‌ను బోర్డు అధికారికంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు వెళ్లే ముందే వీటిని పరిశీలించడం ద్వారా విద్యార్థులు పరీక్షా సమయంలో తడబాటు లేకుండా ఉంటారు.  

Frequently Asked Questions

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి?

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరు కానున్నారు?

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5,17,727 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.

పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు ప్రవేశం ఉంటుందా?

పరీక్ష ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. అంటే, ఉదయం 9:35 గంటల తర్వాత వచ్చే వారికి ప్రవేశం ఉండదు.

పరీక్ష కేంద్రాలలో సెల్ ఫోన్ వాడకంపై నిబంధనలు ఏమిటి?

పరీక్ష కేంద్రాలు పూర్తి స్థాయిలో నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. విద్యార్థులు, సిబ్బంది, ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ అధికారులు కూడా సెల్ ఫోన్లను లోపలికి తీసుకెళ్లకూడదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
Embed widget