IPL 2025: దిల్లీ క్యాపిటల్స్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ - బౌలింగ్ కోచ్కు ఫైన్
IPL 2025: IPL 32వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ని సూపర్ ఓవర్లో దిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. ఈ మ్యాచ్లో బౌలింగ్ కోచ్ అంపైర్తో వాగ్వాదం చేశారని బీసీసీఐ భారీ జరిమానా విధించారు.

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ బుధవారం సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత బీసీసీఐ ఢిల్లీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్పై భారీ జరిమానా విధించింది. మ్యాచ్ జరుగుతున్న టైంలో అంపైర్తో ఆయన వాదించారు, ఆ వీడియో కూడా వైరల్ అయింది. దీంతో చర్యలు తీసుకున్న బీసీసీఐ మునాఫ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరినామా విధించింది.
ఐపీఎల్ విడుదల చేసిన ప్రకటనలో," బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ సమయంలో ఐపీఎల్ నియమాలను ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్పై మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అతనికి ఒక డిమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. ఆట స్ఫూర్తికి వ్యతిరేకంగా మునాఫ్ పటేల్ ఆర్టికల్ 2.20 కింద లెవెల్ 1 నేరం చేసినట్లు అంగీకరించాడు. మ్యాచ్ రెఫరీ శిక్షను అతను అంగీకరించాడు. నియమాల లెవెల్ 1 ఉల్లంఘనకు, మ్యాచ్ రెఫరీ తీర్పే ఫైనల్."
Munaf Patel had a heated exchange with the 4th umpire during the #DCvRR match at the Arun Jaitley Stadium, Delhi after the umpire denied sending a player to enter the ground to convey his message.#DCvsRR #IPL2025 pic.twitter.com/hHv0tNAUvd
— Gaurav Chaudhary (@gkctweets) April 16, 2025
అంపైర్తో మునాఫ్ పటేల్ వాదన
వీడియోలో మునాఫ్ పటేల్ నాలుగో అంపైర్తో ఏదో విషయం గురించి అసంతృప్తిగా ఉన్నట్లు, బిగ్గరగా వాదించినట్లు కనిపిస్తోంది. మునాఫ్ బౌండరీ లైన్లో కూర్చొని ఉన్నాడు, ఢిల్లీ ఆటగాళ్ళు కొందరు డ్రింక్ బాటిల్స్తో నిలబడి ఉన్నారు. డ్రింక్స్తో ఆటగాళ్లను గ్రౌండ్లోకి అనుమతి ఇవ్వకపోవడంపై మునాఫ్ అంపైర్తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. వాళ్ల ద్వారా కీలకమైన సందేశాన్ని మైదానంలో ఉన్న కెప్టెన్కు చేరవేయాలనుకున్నాడు కానీ అది వీలుపడలేదు.
అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తమ అద్భుతమైన బౌలింగ్ ద్వారా ఈ మ్యాచ్ను గెలుచుకుంది. రాజస్థాన్ చివరి ఓవర్లో గెలవడానికి 9 పరుగులు అవసరం, కానీ స్టార్క్ భయంకరమైన బౌలింగ్తో జట్టు విజయాన్ని అడ్డుకున్నాడు. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్లో స్టార్క్ కేవలం 11 పరుగులు ఇచ్చాడు, దాన్ని ఢిల్లీ 4 బంతుల్లో ఛేదించి అద్భుతమైన విజయం సాధించింది.
సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, ఢిల్లీ మొదట ఆడి 188 పరుగులు చేసింది, దానికి ప్రతిస్పందనగా యశస్వి జైస్వాల్, నితీష్ రాణా రాజస్థాన్ జట్టు తరపున అర్ధ సెంచరీలు సాధించారు. కానీ తర్వాత బ్యాటర్లు సరిగా ఆడకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. అటువంటి పరిస్థితిలో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. దీనిలో రాజస్థాన్ను ఢిల్లీ 2 పరుగుల తేడాతో ఓడించింది.
మ్యాచ్ విజయం క్రెడిట్ స్టార్క్దే
మ్యాచ్ తర్వాత మాట్లాడిన సంజూ సామ్సన్ మాట్లాడుతూ.. ఈ ఓటమిపై ప్రభావం ఎలా ఉంటుందో రేపు చూద్దామన్నాడు. నిజంగా బాగా బౌలింగ్ చేసామని. అయితే ఢిల్లీ కొన్ని సార్లు ఆధిపత్యం చూపిందని తెలిపాడు. మ్యాచ్ ఇలా సూపర్ ఓవర్ రావడానికి బౌలర్లు, ఫీల్డర్లదే క్రెడిట్ అన్నారు. కచ్చితంగా గెలుస్తామని అనుకున్న టైంలో స్టార్క్ వేసిన ఓవర్ మ్యాచ్ను మార్చేసిందని అభిప్రాయపడ్డాడు. సూపర్ ఓవర్కు మ్యాచ్ వచ్చేసరికి గట్టిగానే కొట్టాలని నిర్ణయించాం. కానీ అంతకంటే కఠినమైన ప్లాన్ వాళ్ల వద్ద ఉంది. మా నుంచి మ్యాచ్ను స్టార్క్ లాక్కున్నాడని అన్నాడు.




















