అన్వేషించండి

Simhachalam: ఏప్రిల్ 30 సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం, ప్రత్యేక ఏర్పాట్లు ఇవే!

Chandanotsavam 2025: సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం ఏప్రిల్ 30న వైభవంగా జరగనుంది. ఈ మేరకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం

Simhachalam Chandanotsavam 2025: ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో ఉండే సింహాద్రి అప్పన్న కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం ఇస్తాడు. దీనినే చందనోత్సవం, చందనయాత్రగా పిలుస్తారు భక్తులు. పురూరవ చక్రవర్తుల కాలం నుంచి క్రమం తప్పకుండా సింహగిరిపై ఈ ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చందనోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలమేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈ ఏడాది జరగకుండా ఉండేలా జాగ్రత్తపడాలని సూచించారు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ మేరకు ఏప్రిల్ 16 బుధవారం సమీక్ష నిర్వహించారు. 

ఏప్రిల్ 30 తెల్లవారుజామున 3.00 గంటల నుంచే సామాన్య భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు మంత్రి ఆనం  రామనారాయణ రెడ్డి  

ఏప్రిల్ 29 అర్థరాత్రి తెల్లవారు జామున 1.00 గంటకు సుప్రభాత సేవతో చందనోత్సవ క్రతువు మొదలవుతుంది.

తెల్లవారుజామున 3.30 నుంచి 4.00 గంటల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పిస్తారు...అనంతరం TTD నుంటి పట్టివస్త్రాలు సమర్పిస్తారు

ఉదయం 4.15 నుంచి 4.30 గంటల లోపు మొదటి స్లాట్ VIP దర్శనాలు మొదలవుతాయి, ఈ ఏడాది VIP టికెట్లు కేవలం 2500 మాత్రమే జారీచేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి. ఈ రోజు అంతరాలయ దర్శనాలు ఉండబోవు అని స్పష్టం చేశారు.

వెయ్యి రూపాయల  టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులను తెల్లవారుజామున 4.00 గంటల నుంచి  దర్శనాలకు అనుమతిస్తారు

ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు సాధారణ దర్శనాలు నిలిపేస్తారు..ఎందుకంటే చందనోత్సవం రోజు తెల్లవారు జాము 1.00 గంట నుంచి ప్రత్యేక పూజా ప్రక్రియలు ప్రారంభమవుతాయి

30వ తేదీ ఉదయం 3.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు దర్శనాలుంటాయి...7 గంటల కన్నా ముందుగా క్యూలైన్లలో ఉండేవారికి ఎంత ఆలస్యం అయినా దర్శనాలుంటాయి
 
భక్తులకు ఉచిత అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు అందించనున్నారు, చిన్నారులకు పాలు కూడా సమకూర్చనున్నారు

భక్తులు ప్రశాంత వాతావరణంలో సంతృప్తికర స్థాయిలో దర్శనం చేసుకునేలా  దేవాదాయ, రెవెన్యూ, హోం శాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేవాలయాల పరిధిలో జరిగే అన్ని వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి ఆనం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింహాచలేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.  

సింహాచలంలో చందనోత్సవం ఏర్పాట్లు, అప్పన్న ఆలయ అభివృద్ధి, పంచ గ్రామాల సమస్య పరిష్కారంపై దేవస్థానం కల్యాణమండపంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, డీబీవీ స్వామి, అనగాని సత్యప్రసాద్‌ సహా ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్రమాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, MLA లు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేశ్‌బాబు, పీవీజీఆర్‌ గణబాబు సమావేశంలో పాల్గొన్నారు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget