అన్వేషించండి

AP Power Bills : ఏపీలో " కరెంట్ బిల్ ట్రూ అప్" చార్జీల రగడ ! ప్రజలపై ఎందుకీ భారం ? ఎవరు కారణం ?

కరెంట్ బిల్లులు అందుకున్న ఏపీ ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. ట్రూ అప్ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తూండటమే దీనికి కారణం. గత ప్రభుత్వం వల్లనే వసూలు చేయాల్సి వస్తోందని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది.


" కరెంట్ చార్జీలను పూర్తిగా తగ్గించేస్తా " అని ప్రమాణస్వీకార వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు చేతులెత్తి ఇప్పటి వరకూ భారం మోశారని ఇక తాను భారం దించేస్తానన్న హావభావాలతో చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చార్జీలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ రెండేళ్లు దాటిపోయినా చార్జీలు తగ్గకపోగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా బిల్లులో "ట్రూ అప్" పేరుతో  కొత్త సెక్షన్ తీసుకు వచ్చి ఒక్కో యూనిట్‌కూ రూ. 1.23 పైసలు వసూలు ప్రారంభించడంతో విద్యుత్ వినియోగదారులకు షాక్ తగిలినట్లయింది. అసలు ఈ ట్రూ అప్ చార్జీలు అంటే ఏమిటి ? తగ్గిస్తామన్న చార్జీలను ప్రభుత్వం ఎందుకు పెంచుతోంది ? కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై ప్రభుత్వం భారం వేయడం దేనికి..? 

వంద యూనిట్లకు రూ.123 చొప్పున ట్రూ అప్ చార్జీల వడ్డింపు..! 

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల విద్యుత్ బిల్లులు అందుకున్న ప్రజలు పెరిగిన చార్జీలతో షాక్‌కు గురవుతున్నారు. గత నెలకు, ఈ నెలకు ఒకే మాదిరిగా కరెంట‌ వాడుకున్నప్పటికీ బిల్లు మాత్రం 40శాతం అధికంగా వచ్చింది. బిల్లులో ట్రూ అప్ సెక్షన్‌ను చేర్చి కొత్తగా యూనిట్‌కు రూ.1.23 పైసలు బిల్లులో చూపిస్తున్నారు. అంటే వంద యూనిట్లు వాడితే రూ. 123 అదనంగా వస్తుందన్నమాట. ఆగస్టులో వినియోగించిన విద్యుత్‌ యూనిట్‌కు రూ.1.23 ట్రూ అప్‌ చార్జీలను కూడా కలిపి బిల్లులు వస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి వరకూ ఈ ట్రూ అప్ చార్జీలను ఇదే విధంగా వసూలు చేస్తారు. గత నెల బిల్లు, ఈ నెల బిల్లు మధ్య తేడా చూపిస్తూ వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్‌ సంస్థ పరిధిలోని ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల వినియోగదారులపై మాత్రం ఈ చార్జి  యూనిట్‌కు 45 పైసల భారమే పడుతోంది.
AP Power Bills :   ఏపీలో

Also Read : వేల్ఫేవర్ .. మరో అగ్రిగోల్డ్ తరహా మోసమా?


ట్రూ అప్ చార్జీలు ఎందుకంటే..? 

విద్యుత్‌ సంస్థలు చేసే ఖర్చు అంటే సిబ్బంది జీతాలు, పంపిణీ నష్టాలు, బొగ్గు కొనుగోలు  ఇతర అవసరాలకు చేసే ఖర్చును ఏపీఈఆర్‌సీ ఆమోదిస్తుంది. ఈ ఖర్చును అనుసరించి విద్యుత్ చార్జీలు నిర్ణయిస్తారు. ఏపీఈఆర్‌సీ ఆమోదించిన అంచనాలకు మించి విద్యుత్ సంస్థకు ఖర్చు చేయాల్సి వస్తే .. ఆ అదనపు వ్యయాన్ని ఏటా ట్రూ అప్‌ చార్జీల పేరిట వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవచ్చు. ఎంతో ఎక్కువ ఖర్చయ్యాయని చెబుతున్న విద్యుత్ సంస్థలు ట్రూ అప్‌  చార్జీల కింద 8 నెలల్లో రూ.3,660 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నెల నుంచే వసూలు ప్రారంభించారు.
AP Power Bills :   ఏపీలో

Also Read : ఏపీ గెజిట్ వెబ్‌సైట్‌లో జీవోలు


గత ప్రభుత్వాలు ఈ ట్రూ అప్ చార్జీలను ఎందుకు వేయలేదు ? 

విద్యుత్ సంస్థలు అదనపు ఖర్చులపై ప్రతి ఏడాది విద్యుత్ నియంత్రణ సంస్థకు నివేదిక సమర్పించి ట్రూ అప్ చార్జీల వసూలుకు అనుమతి కోరుతాయి. గత ప్రభుత్వం ఈ ట్రూ అప్‌ నివేదికలను ఈఆర్‌సీ వద్ద దాఖలు చేయవద్దని ప్రజలపై భారం వద్దని... విద్యుత్‌ సంస్థలకు ఏవైనా అదనపు ఖర్చులు వస్తే ప్రభుత్వపరంగా భరించాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది.  ఈ కారణంగా విద్యుత్‌ సంస్థలు అప్పట్లో ఈ నివేదికలు దాఖలు చేయలేదు. అందుకే గత ప్రభుత్వాల హయాంలో ఈ చార్జీలు వేయలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉంది. అదనంగా విద్యుత్ సంస్థలకు సాయం చేసే పరిస్థితిలో లేకపోవడంతో ఆ ట్రూ అప్ చార్జీలను ప్రజల నుంచే వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
AP Power Bills :   ఏపీలో

Also Read : ఏపీలో వినాయకచవితి ఆంక్షలపై రగడ


గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లే పెంచాల్సి వచ్చిందన్న ప్రభుత్వం..! 

 2014 నుంచి 2019 వరకూ ట్రూ అప్‌ నివేదికలు దాఖలు చేయవద్దని  నిర్ణయం తీసుకున్న అప్పటి ప్రభుత్వం  ట్రూ అప్‌ సర్దుబాటు కోసం నిధులేవీ ఇవ్వలేదని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. అందుకే  విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయని అది రాష్ట్రానికి, వినియోగదారులకు మంచిది కాదన్న ఉద్దేశంతో సర్దుబాటు చార్జీల వసూలుకు నిర్ణయించామని తెలిపింది.  టీడీపీ హయాంలో ఐదేళ్లలో విద్యుత్ సంస్థల బకాయిలు  రూ.32 వేల కోట్లకు చేరాయని ప్రభుత్వం ప్రకటించింది.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Gold and Silver Prices: బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PBKS vs KKR Match Highlights | కేకేఆర్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ | ABP DesamMS Dhoni Player of the Match vs LSG | ఆరేళ్ల తర్వాత తొలిసారి IPL 2025 లో ధోని కి అవార్డ్PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతాRishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Gold and Silver Prices: బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
Tamannaah Bhatia: తమన్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇలాంటి వింత కాంబో ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరేమో
తమన్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇలాంటి వింత కాంబో ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరేమో
Earthquake: అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
CM Chandrababu: కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం, ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ
కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం, ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ
IPL 2025 KKR VS PBKS Result Update:  చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
Embed widget