అన్వేషించండి

Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం

Andhra Pradesh Latest News:వైజాగ్‌లో టిసిఎస్‌కు 21.16 ఎకరాల భూమిని అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎకరా 99 పైసలకు కేటాయించడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

TCS In Vizag: వైజాగ్‌లో సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ టిసిఎస్‌కు (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ) 21.16 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని ఏపీలో ఐటీ అభివృద్ధిలో కీలక ముందడుగుగా ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

మంగళవారం ఏపీ సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ 21.16 ఎకరాలను టిసిఎస్‌కు కోసం కేటాయించడానికి ఆమోదం తెలిపింది. మంత్రి నారా లోకేష్ గత ఏడాది అక్టోబర్‌లో టాటా హౌస్‌ను సందర్శించి, టిసిఎస్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అడిగారు. దీనికోసం ఆయన చేసిన ఫాలోఅప్ వర్క్ ఔట్ కావడంతో TCS ముందుకు వచ్చింది. ఏపీలో పెట్టె యూనిట్ ద్వారా 12,000 ఉద్యోగాలను సృష్టించడానికీ రూ.1370 కోట్లు పెట్టుబడి కేటాయించనుంది ఆ సంస్థ.

రాష్ట్ర ప్రభుత్వం, టిసిఎస్‌ల మధ్య నిరంతర ఫాలోఅప్‌లు,  చర్చల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. టిసిఎస్‌కు భూ కేటాయింపులో ఏపీ ప్రభుత్వం చివరికి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వరుసలో ఉందని IT పరిశ్రమకు సూచించడానికి ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం అని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఎకరా 99 పైసలకు ఆ సంస్థకు కేటాయించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

గతంలో ప్రధాని మోదీ చేసిందే.. ఇప్పుడు మేమూ చేసాం : ఏపీ ప్రభుత్వం
గతంలో, ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ, టాటా మోటార్స్‌ను గుజరాత్‌లోని సనంద్‌కు 99 పైసలకు భూమిని కేటాయించడం ద్వారా తీసుకెళ్లారు. తర్వాత ఆ చర్య గుజరాత్‌లోని ఆటో పరిశ్రమ అభివృద్ధికి ఒక మైలురాయిగా మారింది. అలాగే ఇప్పుడు టిసిఎస్‌కు తక్కువ ధరకు భూమిని కేటాయించడం ద్వారా వారితో ఇక్కడ పెట్టుబడి పెట్టించడం.. ఉద్యోగాలను సృష్టించడం ఏపీలో ఐటీ పరిశ్రమ డెవలప్మెంట్‌లో ఒక గేమ్ చేంజర్‌గా మారుతుందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఏపీ ప్రభుత్వం - సీఐఐ ఎపి జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం తొలి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిఏడాదిలోనే రాష్ట్రప్రజలు, పరిశ్రమదారులు, అధికార యంత్రాంగం అందరి సహకారంతో ఆర్థిక వృద్ధి రేటు (జిఎస్ డిపి)లో దేశంలో 2వస్థానాన్ని సాధించగలిగామన్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేస్తూ..."దేశంలోనే ఎపిలో అతితక్కువ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేలా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమలస్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చాను. విశాఖపట్నాన్ని ఐటి హబ్‌గా తయారుచేసేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని, ఐటి రంగంలో రాబోయే అయిదేళ్లలో 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాను. తయారీ రంగంలో 30లక్షల కోట్ల పెట్టుబడులు, 5లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాం. అమరావతి రాజధాని ఆర్థికవృద్ధి కేంద్రంగా అవతరించనుంది. అమరావతిని శక్తివంతంగా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని సీఐఐ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశాను." అని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Embed widget