అన్వేషించండి

TOEFL iBT: 'టోఫెల్‌' పరీక్షలో కీలక మార్పులు, జులై నుంచి అమల్లోకి!

ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56 నిమిషాల్లో) పూర్తయ్యేలా కుదించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.

విదేశాల్లో ఉన్నతవిద్య కోసం వెళ్లాలనుకునే వారిలో 'ఇంగ్లిష్' నైపుణ్యాలను పరీక్షించేందుకు నిర్వహించే టోఫెల్(టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56 నిమిషాల్లో) పూర్తయ్యేలా కుదించారు. అంతేకాకుండా ఈ పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ అధికారిక స్కోర్ విడుదలయ్యే తేదీని సైతం తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ వెల్లడించింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్‌కు సంబంధించిన టోఫెల్, గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్స్ రాసేవారికి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసినట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ వెల్లడించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.

విద్యార్థుల్లో ఇంగ్లిష్ సామర్థ్యాన్ని అంచనా వేసే ఈ టోఫెల్ స్కోరును ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు పైగా దాదాపు 11,500 యూనివర్సిటీలు అనుమతిస్తున్నాయి. విదేశీ విద్యలో భాగంగా ప్రపంచంలోనే ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు యూకేలోని 98 శాతానికి పైగా విశ్వవిద్యాలయాలు ఈ స్కోరును ప్రామాణికంగా తీసుకొని డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షలో రీడింగ్ సెక్షన్‌ను కుదించడంతోపాటు స్వతంత్రంగా రాసే టాస్క్ స్థానాన్ని అకడమిక్ డిస్కషన్ కోసం రాసే విధానం‌తో భర్తీ చేసినట్టు ఈటీఎస్ తెలిపింది. స్కోరు చేయని ప్రశ్నలను పరీక్ష నుంచి తొలగించనున్నారు.

గతంతో పోలిస్తే వేగంగా, మరింత సులభంగా టోఫెల్ ఐబీటీ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని.. అలాగే, ఈ పరీక్ష ఫీజును తొలిసారి రూపాయిల్లోనే చెల్లించే సౌలభ్యం కల్పిస్తున్నట్లు అమిత్ తెలిపారు. వీటితో పాటు చెల్లింపులను సులభతరం చేసేందుకు మరిన్ని ఆప్షన్లను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకొనే లక్షలాది భారతీయ విద్యార్థులకు ఈ మార్పులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని భారత్‌లోని ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ ప్రతినిధుల సంఘం అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి బొర్రా అభిప్రాయపడ్డారు.

Also Read:

ఏపీలో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 'షాక్'! బీటెక్‌లో ప్రవేశాలకు 'బ్రేక్'?
ఏపీలోని పాలిటెక్నిక్ విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. పాలిటెక్నిక్ తర్వాత ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాలనే కొత్త నిబంధన తీసుకురానుండటమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సాంకేతిక విద్యాశాఖ  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కొత్త విధానం ప్రకారం మూడేళ్ల పాలిటెక్నిక్ విద్య పూర్తిచేసుకున్న తర్వాత, నాలుగో ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాల్సి వస్తుంది. దీంతో పాలిటెక్నిక్ ఇక నాలుగేళ్ల కోర్సుగా మారిపోతుంది. ఏటా పాలిటెక్నిక్ నుంచి 35 వేల మంది ఉత్తీర్ణత సాధిస్తుంటే వీరిలో 85 శాతం మంది ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈసెట్) ద్వారా బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందుతున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2022/ జూన్‌-2023 దరఖాస్తు గడువు వారం రోజులు పొడిగించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ-నెట్‌ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కార‌ణాల వల్ల చాలా మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించలేకపోయారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్‌ 17 వ‌ర‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
Pushpa 2 Thanks Meet: 'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
Caribbean Earthquake: కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
Tirumala News: ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త,  ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AAP Loss Yamuna Pollution Key Role | Delhi Election Results 2025లో కేజ్రీకి కలిసి రాని యమున | ABP DesamArvind Kejriwal on AAP Election Loss | ఆమ్ ఆద్మీ ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్ | ABP DesamDelhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP DesamDelhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
Pushpa 2 Thanks Meet: 'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
Caribbean Earthquake: కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
Tirumala News: ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త,  ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
Ration Card Online Apply Telangana: మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
Delhi Election Result 2025: ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
Kiran Royal: వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
Andhra Pradesh: కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు -  పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు - పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
Embed widget