అన్వేషించండి

Delhi Election Result 2025: ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు

Delhi Election Result 2025: ఢిల్లీలో విజయం సాధించిన తర్వాత బిజెపి ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఢిల్లీని అభివృద్ధి చెందిన రాజధానిగా మార్చడానికి ప్రజలు అవకాశం ఇచ్చారని అన్నారు.

Delhi Election Result 2025: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. శనివారం ఫలితాలు విడుదలైన తర్వాత ప్రధానమంత్రి మోదీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీని వికసిత్ రాజధానిగా మారుస్తామని ఈ సందర్భంగా ప్రజలకు మాట ఇచ్చారు. అదే సందర్భంలో ఈ విజయంలో భాగమైన నేతలకు మోదీ కృతజ్ఞత తెలిపారు. ఏపీలో చంద్రబాబు నాయుడు, బిహార్‌లో నితీశ్‌పై ప్రజలు విశ్వాసం ఉంచారని అన్నారు.

ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని భారత్ మాతా కీ జై, యమునా మాతకు కీ జై అనే నినాదంతో ప్రారంభించారు. "ఈరోజు ఢిల్లీ ప్రజల్లో ఉత్సాహం, ప్రశాంతత కనిపిస్తోంది. ఢిల్లీ ఆప్-డా రహితంగా మారింది. ఢిల్లీకి సేవ చేయడానికి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించాను. మోదీ హామీని విశ్వసించినందుకు ఢిల్లీలోని ప్రతి కుటుంబానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఢిల్లీ బహిరంగంగా ప్రేమను అందించింది. వేగవంతమైన అభివృద్ధిని తీసుకురావడం ద్వారా ఢిల్లీవాసుల రుణం తీర్చుకుంటాం" అని ప్రధాని మోదీ అన్నారు.

"నేను ప్రతి ఢిల్లీ నివాసికి ఒక లేఖ పంపాను. మీరందరూ ఆ లేఖను ప్రతి కుటుంబానికి అందించారు. 21వ శతాబ్దంలో బిజెపికి సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని, ఢిల్లీని అభివృద్ధి చెందిన భారతదేశానికి అభివృద్ధి చెందిన రాజధానిగా మార్చడానికి బిజెపికి అవకాశం ఇవ్వాలని నేను రిక్వస్ట్ చేశాను. మోడీ హామీని విశ్వసించినందుకు ఢిల్లీలోని ప్రతి కుటుంబానికి నేను తల వంచి నమస్కరిస్తున్నాను" అని ప్రధాని మోదీ అన్నారు.

ఢిల్లీ ఒక మినీ ఇండియా: ప్రధాని మోదీ

కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ఢిల్లీ కేవలం ఒక నగరం కాదు, ఒక మినీ హిందూస్థాన్. భారతదేశం ఆలోచనను హృదయపూర్వకంగా ఢిల్లీ  తెలియజేస్తుంది. ఒక విధంగా ఢిల్లీ వైవిధ్యంతో నిండిన భారతదేశం సూక్ష్మ చిత్రం. నేడు ఈ వైవిధ్యభరితమైన ఢిల్లీ బిజెపిని ఆశీర్వదించింది. ప్రతి భాషా ప్రజలు, ప్రతి రాష్ట్ర ప్రజలు కమలం గుర్తుపై ఉన్న బటన్‌ నొక్కారు" అని అన్నారు.

ప్రధాని మోదీ తన ప్రసంగంలో పూర్వాంచల్ గురించి కూడా ప్రస్తావించారు. "ఎన్నికల ప్రచారంలో నేను ఎక్కడికి వెళ్ళినా, నేను పూర్వాంచల్ ఎంపీని అని గర్వంగా చెప్పుకునేవాడిని. పూర్వాంచల్ ప్రజలు కొత్త శక్తిని, బలాన్ని ఇచ్చారు. అందువల్ల, పూర్వాంచల్ ప్రజలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఢిల్లీని ఆధునిక నగరంగా మారుస్తాము. రోడ్ల విషయంలో చేసిన పనిని ప్రజలు చూశారు. అన్నా హజారే జీ కూడా చాలా కాలంగా బాధను అనుభవిస్తున్నారు. ఈరోజు ఆయన కూడా ఈ బాధ నుంచి ఉపశమనం పొంది ఉంటారు. " అని ఆయన అన్నారు.

Also Read: ఢిల్లీ సీఎం రేసులో జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మ - ఆయన అస్తులెన్నో తెలిస్తే షాకే !

కాంగ్రెస్‌ను పరాన్నజీవి పార్టీ అని అన్నారు
"కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ సున్నా సాధించింది. కాంగ్రెస్ వరుసగా మూడోసారి దేశ రాజధానిలో తన ఖాతాను తెరవలేకపోయింది. కాంగ్రెస్‌ను అస్సలు నమ్మడానికి దేశం సిద్ధంగా లేదు. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి పార్టీ. కాంగ్రెస్ తన మిత్రపార్టీల ఓటు బ్యాంకులోకి చొరబడుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు.

మిల్కిపూర్‌లో బిజెపి విజయంపై మోదీ రియాక్షన్

"అయోధ్యలోని మిల్కిపూర్‌లో కూడా బిజెపి గొప్ప విజయం సాధించింది. ప్రతి వర్గం పెద్ద సంఖ్యలో బిజెపికి ఓటు వేసింది. మిత్రులారా, నేడు దేశం బిజెపి సంతృప్తి రాజకీయాలను ఎంచుకుంటోంది, బుజ్జగింపు కాదు. ఢిల్లీ పక్కన ఉత్తరప్రదేశ్ ఉంది, ఒకప్పుడు యుపిలో శాంతిభద్రతల పరిస్థితి ఒక పెద్ద సవాలుగా ఉండేది. యుపిలో మెదడువాపు వ్యాధి వినాశనం సృష్టిస్తోంది, కానీ దానిని అంతం చేయడానికి మేము దృఢ సంకల్పంతో పనిచేశాము" అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read: అధికారం కోసం రాజకీయాలు చేయలేదు, బీజేపీకి కంగ్రాట్స్: ఓటమిపై కేజ్రీవాల్ వీడియో విడుదల

టాప్ హెడ్ లైన్స్

Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget