అన్వేషించండి

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!

Andhra Pradesh News: సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వే లంచం డిమాండ్ చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Chandrababu Naidu House Land Issue : రాష్ట్రంలో కొంతమంది అధికారులు అవినీతి పతాక స్థాయికి చేరిపోయింది. అవతల వ్యక్తులు ఎవరన్న దానితో సంబంధం లేకుండా చేయి తడిపితే గాని పని చేయని స్థితికి అధికారులు దిగజారిపోయారు. రోజువారీ కలెక్షన్లు లక్ష్యంగా పెట్టుకుని చాలామంది అధికారులు పని చేస్తున్నారు. ఆ లక్ష్యాలను చేరితే గాని ఇంటికి వెళ్ళని అధికారులు రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంతోమంది ఉన్నారు. అటువంటి అధికారులకు సంబంధించిన వ్యవహారమే తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం డిమాండ్ చేసి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొంత స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లో గృహ నిర్మాణం చేసేందుకు తెలుగుదేశం నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేశారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరారు. ఇందుకోసం డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.1.85 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇస్తేనే గాని ప్రక్రియ చేపట్టనని తేల్చి చెప్పడంతో.. స్థానిక నాయకులు అందుకు అవసరమైన మొత్తాన్ని చెల్లించారు. ఆ తరువాత ఫైల్ ముందుకు కదిలింది. ఈ విషయాన్ని అప్పట్లో టీడీపీ నాయకులు కూడా బయట పెట్టలేదు.

చంద్రబాబు దృష్టికి విషయం.. డిప్యూటీ సర్వేయర్ పై చర్యలు 

డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్న విషయాన్ని తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి స్థానిక నాయకులు తీసుకువెళ్లారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు నాయుడు కప్పం పర్యటనకు వచ్చారు. అప్పుడు ఆయనను ఆర్ అండ్ బి అతిథి గృహంలో పలువురు నాయకులు కలిశారు.  డిప్యూటీ సర్వేయర్ పాల్పడిన అవినీతి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఆ నాయకులు తీసుకువెళ్లారు. దీనిపై షాక్ కు గురైన సీఎం చంద్రబాబు నాయుడు.. అక్కడే ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు.

సర్వే శాఖ ఏడి గౌస్ భాషాతో శాఖ పరమైన విచారణ చేయించగా డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. అలాగే, భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ లక్ష డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ జరిపిన అధికారులు అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని జెసి శ్రీనివాసులు సర్వే ఏడిని సోమవారం ఆదేశించారు. దీనికి సంబంధించిన నివేదికను సోమవారం సాయంత్రం జెసి శ్రీనివాసులకు సర్వే శాఖ అధికారులు అందించగా.. లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ ను సోమవారం రాత్రి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థలానికి సంబంధించి పని చేసేందుకు కూడా డబ్బులు వసూలు చేసే స్థాయికి అధికారులు వెళ్లిపోవడాన్ని చూస్తుంటే.. క్షేత్రస్థాయిలో అవినీతి వ్యవహారాలు ఏస్థాయికి వెళ్ళిపోయాయో అర్థం అవుతోందని పలువురు  పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ తరహా అధికారులపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా రైతులు, సాధారణ ప్రజలను కొంతమంది అధికారులు అవినీతికి అలవాటు పడి తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LK Advani: అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
Pawan Kalyan: పవన్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్, ఓజీ అప్‌డేట్ ఇచ్చిన పవర్‌స్టార్‌
పవన్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్, ఓజీ అప్‌డేట్ ఇచ్చిన పవర్‌స్టార్‌!
Telugu Actress Tiffin Center: రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటున్న గేమ్‌ ఛేంజర్‌ నటి- బాలయ్య, మహేష్‌ బాబు సినిమాలు  చేసినా తప్పని సీరియల్ కష్టాలు
రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటున్న గేమ్‌ ఛేంజర్‌ నటి- బాలయ్య, మహేష్‌ బాబు సినిమాలు చేసినా తప్పని సీరియల్ కష్టాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LK Advani: అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
Pawan Kalyan: పవన్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్, ఓజీ అప్‌డేట్ ఇచ్చిన పవర్‌స్టార్‌
పవన్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్, ఓజీ అప్‌డేట్ ఇచ్చిన పవర్‌స్టార్‌!
Telugu Actress Tiffin Center: రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటున్న గేమ్‌ ఛేంజర్‌ నటి- బాలయ్య, మహేష్‌ బాబు సినిమాలు  చేసినా తప్పని సీరియల్ కష్టాలు
రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటున్న గేమ్‌ ఛేంజర్‌ నటి- బాలయ్య, మహేష్‌ బాబు సినిమాలు చేసినా తప్పని సీరియల్ కష్టాలు
Ajith Kumar And Shalini: ఆసుపత్రి బెడ్‌పై షాలిని, పక్కనే భర్త - లవ్‌యూ ఫరెవర్ అంటూ పోస్టుతో ఫ్యాన్స్‌లో కంగారు
ఆసుపత్రి బెడ్‌పై షాలిని, పక్కనే భర్త - లవ్‌యూ ఫరెవర్ అంటూ పోస్టు
Best Action Movies On OTT: అమెరికా ప్రెసిడెంట్‌పై దాడి, ఇంటర్వ్యూ కోసం ప్రాణాలకు తెగించే జర్నలిస్టులు - ఓటీటీలో దుమ్ములేపుతున్న ‘సివిల్ వార్’ స్టోరీ ఇదే
అమెరికా ప్రెసిడెంట్‌పై దాడి, ఇంటర్వ్యూ కోసం ప్రాణాలకు తెగించే జర్నలిస్టులు - ఓటీటీలో దుమ్ములేపుతున్న ‘సివిల్ వార్’ స్టోరీ ఇదే
Prabhas: ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
35 Chinna Katha Kaadu: ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
Embed widget