అన్వేషించండి

Cm Jagan Review: ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో పేమెంట్స్ చెల్లింపు... ప్రత్యామ్నాయ పంటలకు బోనస్... పంటల కొనుగోలుపై సీఎం జగన్ సమీక్ష

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో పేమెంట్స్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలుకు ఐదుగురు సిబ్బందిని నియమించాలన్నారు.

ధ్యానం, ఇతర పంటల కొనుగోళ్లపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. పంటల కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) క్రియాశీలంగా వ్యవహరించాలని సీఎం జగన్ అన్నారు. రైతులకు కచ్చితంగా కనీస మద్దతు ధర లభించాలన్నారు. రైతులకు ఆర్బీకేల ద్వారా సేవలందించడంలో అధికారులు ఎలాంటి అలసత్వం వహించకూడదన్నారు. రైతులతో తరచుగా సమావేశమవుతూ అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తు్న్నామని సీఎం జగన్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదన్నారు. ధాన్యం నాణ్యత పరిశీలనలో మోసాలు జరగకుండా చూడాలన్నారు. ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Cm Jagan Review: ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో పేమెంట్స్ చెల్లింపు... ప్రత్యామ్నాయ పంటలకు బోనస్... పంటల కొనుగోలుపై సీఎం జగన్ సమీక్ష

Also Read: వైఎస్ఆర్‌సీపీ నేతల క్షమాపణలు మాకు అక్కర్లేదు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని నారా భువనేశ్వరి సలహా !

21 రోజుల్లో పేమెంట్స్ చెల్లింపు

ధాన్యం కొనుగోలు కోసం రైతు భరోసా కేంద్రాల్లో ఐదుగురు సిబ్బంది ఉండాలని సీఎం జగన్ అన్నారు. టెక్నికల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు ఉండాలని సూచించారు. ఈ సిబ్బంది రైతుల దగ్గరకు వెళ్లి కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలన్నారు. గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలన్నారు. వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో నగదు చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చూసించారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారో, లేదో పరిశీలించాలని, ప్రతీ కొనుగోలు కేంద్రంలో తగిన సిబ్బంది ఉన్నారో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. 

Also Read:  కోడి పందాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ముద్రగడ లేఖ.. 5 రోజులు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్

ప్రత్యామ్నాయ పంటలకు బోనస్..!

ధ్యానం, ఇతర పంటల కొనుగోలుకు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్‌ను ఏర్పాటుచేయాలని సీఎం జగన్ అన్నారు. ఆర్బీకేకి వచ్చే ఫిర్యాదులను విచారణ జరిపి పరిష్కరించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ల నుంచి కూడా పంటల కొనుగోలుపై నిరంతర ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్నారు. సీసీఆర్సీ కార్డ్స్‌ లపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రోజుకు సగటున 42,237 మెట్రిక్‌ టన్నుల ధ్యానం కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో కొనుగోళ్లు మరింత పెరుగుతాయని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు పండించే వారికి బోనస్‌ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. 

Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Idupu Kayitham: ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget