అన్వేషించండి

EXCLUSIVE: పహల్గాం ఉగ్రదాడితో పాక్ ఆర్మీకి లింకులు, మాస్టర్ మైండ్ సైఫుల్లానే, ఉగ్రవాదులకు ట్రైనింగ్.. సంచలన విషయాలు

Pahalgam terrorist attack | పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసురి ఐదుగురు ఉగ్రవాదులను సిద్ధం చేశాడని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Pahalgam Terror Attack: అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం దాడిని భారత్ సీరియస్‌గా తీసుకుంది. భారత బలగాలు ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సంబంధించి గూఢచర్య నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పహల్గాం దాడిని లష్కర్-ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసురి ప్లాన్ చేశాడు. ఈ దాడికి సంబంధించి ఫిబ్రవరిలో సమావేశమయ్యారు. సైఫుల్లా ఐదుగురు ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడికి సిద్ధం చేశాడు. ఆ తరువాత మార్చిలో ఆ ఉగ్రవాదులు మమరోసారి సమావేశమయ్యారు. జమ్ముా కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ కు లింక్ ఉందని తేలింది. 

పహల్గాం దాడికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ప్లానింగ్ ప్రారంభమైంది. లష్కర్ ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఆదేశాలతో ఉగ్రదాడి ప్లాన్ ప్రారంభమైంది. ఉగ్రవాదులు మొదటి సమావేశం ఫిబ్రవరిలో జరిగింది. ఆ తరువాత మార్చిలో మీర్ పూర్‌లో మరోసారి సమావేశమై దాడుల గురించి మరింతగా చర్చించారు. ఈ సమావేశంలో పహల్గాంలో దాడి గురించి ప్లాన్ చేశారని నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్నా.. ఆ ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం కూడా సహాయం చేసింది. ఏబీపీ న్యూస్ ప్రత్యేక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.  

పహల్గాం దాడికి ఎలా ప్లాన్ చేశారు ? 

లష్కర్ ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ కమాండర్ సైఫుల్లా ఐదుగురుఉగ్రవాదులతో ఫిబ్రవరి, మార్చి నెలలో సమావేశం అయ్యాడు. ఫిబ్రవరి మీటింగ్ తరువాత మీర్ పూర్ లో పహల్గాం దాడికి ప్లాన్ తయారుచేశారు. సైఫుల్లా తో సమావేశంలో అబూ మూసా, ఇద్రీస్ షాహీన్, మొహమ్మద్ నవాజ్, అబ్దుల్ రఫా రసూల్, అబ్దుల్లా ఖాలిద్ అనే ఉగ్రవాడులు పాల్గొన్నారు. మరోవైపు సైఫుల్లాకు ISI నుండి ఆదేశాలు వచ్చాయి.  

పహల్గాం దాడికి పాక్ ప్రభుత్వానికి లింకులు

లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా పాకిస్తాన్ సైన్యంతో సంప్రదింపులు జరిపేవాడు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ శిబిరానికి వెళ్లాడు. బహావల్ పూర్ లోని ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్ సైన్యం కెర్నల్ ఉగ్రవాది సైఫుల్లాకు ఆహ్వానించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో దీనికి సంబంధించి ఒక కార్యక్రమం జరిగింది.  ఏప్రిల్ 18 న రావల్కోట్ లో ఉగ్రవాదుల సమావేశం జరిగింది. దీని వీడియో బయటకు రాగా, అందులో సైఫుల్లాతో పాటు ఐదుగురు ఉగ్రవాదులు కనిపించారు. 

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల అనుమానిత నివాసం ధ్వంసం 

 పహల్గాం దాడితో సంబంధం ఉందని అనుమానిత స్థానిక ఉగ్రవాది అదిల్ గురి ఇల్లును భద్రతా దళాలు బాంబు పేల్చి ధ్వంసం చేశాయి. బిజ్బెహెరా ప్రాంతంలో ఉగ్రవాది అదిల్ గురి ఇల్లు ఉందని సమాచారం తెలుసుకుని బలగాలు ధ్వంసం చేశాయి. త్రాల్ లోని ఆసిఫ్ షేక్ ఇంటిని భారత బలగాలు కూల్చివేశాయి. మరోవైపు బండిపొరలో జరిగిన ఎన్ కౌంటర్ లో అల్తాఫ్ లల్లీ అనే లష్కే తోయిబా టాప్ కమాండర్ హతమయ్యాడు. ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి.

నీరజ్ రాజ్ పూత్ మరియు శివాంక్ మిశ్రా నివేదిక...

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Noida Mamura Village Fire: చార్జింగ్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ - ఐదు అంతస్తుల భవనం బుగ్గి - భారీ ప్రాణనష్టం
చార్జింగ్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ - ఐదు అంతస్తుల భవనం బుగ్గి - భారీ ప్రాణనష్టం
E20 Petrol Problems: E20 పెట్రోల్ విధానంపై దేశవ్యాప్త వ్యతిరేకత - కేంద్రం తొందరపడిందా?
E20 పెట్రోల్ విధానంపై దేశవ్యాప్త వ్యతిరేకత - కేంద్రం తొందరపడిందా?
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Embed widget