అన్వేషించండి

India to Cancel Ceasefire: పహల్గాం ఉగ్రదాడితో కాల్పుల విరమణపై త్వరలో భారత్ సంచలన నిర్ణయం: నివేదిక

India to Cancel Ceasefire పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో భారత్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.

Pahalgam Terrorist Attack | న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచుతోంది. మరోవైపు ఉగ్రవాదులను కట్టడి చేయడానికి బదులుగా మొన్న ఉగ్రదాడికి భారత్ లోని శక్తులే కారణమంటూ పాక్ పిచ్చి పిచ్చి కూతలు కూయడం భారత ప్రభుత్వాన్ని సవాల్ చేస్తోంది. దాంతో పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోందని పలు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాక్ చర్యలకు అడ్డుకట్ట వేయాలంటే ఇదే సరైన నిర్ణయమని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని నివేదికలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం త్వరలోనే కాల్పుల విరమణపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాలు సైతం ఈ విషయాన్ని పరోక్షంగా చెబుతున్నాయిని నివేదికలలో పేర్కొన్నాయి.

సింధు జలాల ఒప్పందంపై నిషేధం..

ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు చేపట్టింది భారత్. ఇదివరకే సింధు నది జలాల ఒప్పందం (Indus Water Treaty)పై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కాల్పుల విరమణ ఉల్లంఘన, తరచుగా జమ్మూకాశ్మీర్ లో కాల్పులు జరపడం, తాజాగా అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడులతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అటారి-వాఘా సరిహద్దును మూసివేయడం, భారతదేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు దేశం వదిలి వెళ్లడానికి ఇచ్చిన 48 గంటల గడువు ముగిసింది. పాకిస్థాన్ పౌరులకు వీసాలు జారీ చేయడంపై కేంద్రం నిషేధం విధించింది. ఇరుదేశాల హైకమిషన్లలో నియమించిన అధికారులను తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

పదే పదే ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్

నియంత్రణ రేఖ వద్ద, అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందంలో తన నిబద్ధతలను నిలబెట్టుకోవడంలో పాకిస్తాన్ విఫలమైనందున కేంద్రం కాల్పుల విరమణ ఒప్పందానికి మొగ్గు చూపుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ భారత్ కనుక ఆ వ్యూహాత్మక చర్యకు దిగితే పాకిస్తాన్ దిగిరావాల్సిందే. అప్పుడు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు దేశాన్ని మరింత ఒంటరిని చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. అందుకు ఉన్న అవకాశాలపై కేంద్ర మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, విదేశాంగ మంత్రి, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంటి వారు దీనిపై యోచిస్తున్నారని తెలుస్తోంది. 

ఫిబ్రవరి 2021 కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ పాక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైష్-ఏ-మహమ్మద్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లాంటి ఉగ్రమూకలు జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడి కాల్పులు జరుపుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ గత ఐదేళ్లలోనూ పలుమార్లు కాశ్మీర్ లో కాల్పులు జరుపుతూ చిన్న చిన్న ఉగ్రదాడులకు పాల్పడింది. ముఖ్యంగా 2023, 2024లలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. వాటికి భారత బలగాలు దీటుగా బదులిస్తూ ఉగ్రమూకలను హతం చేస్తూనే ఉన్నా.. పాక్ వక్రబుద్ధి మారడం లేదు.

జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం ఉదయం పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ సైతం పాక్ తన బుద్ధి చూపింది. పాక్ కాల్పులకు ధీటుగా భారత బలగాలు బదులిస్తున్నాయి. ఎదురు కాల్పులతో పాక్ కాల్పులను తిప్పికొడుతున్నాయని అధికారులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget