అన్వేషించండి

India to Cancel Ceasefire: పహల్గాం ఉగ్రదాడితో కాల్పుల విరమణపై త్వరలో భారత్ సంచలన నిర్ణయం: నివేదిక

India to Cancel Ceasefire పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో భారత్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.

Pahalgam Terrorist Attack | న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచుతోంది. మరోవైపు ఉగ్రవాదులను కట్టడి చేయడానికి బదులుగా మొన్న ఉగ్రదాడికి భారత్ లోని శక్తులే కారణమంటూ పాక్ పిచ్చి పిచ్చి కూతలు కూయడం భారత ప్రభుత్వాన్ని సవాల్ చేస్తోంది. దాంతో పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోందని పలు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాక్ చర్యలకు అడ్డుకట్ట వేయాలంటే ఇదే సరైన నిర్ణయమని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని నివేదికలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం త్వరలోనే కాల్పుల విరమణపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాలు సైతం ఈ విషయాన్ని పరోక్షంగా చెబుతున్నాయిని నివేదికలలో పేర్కొన్నాయి.

సింధు జలాల ఒప్పందంపై నిషేధం..

ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు చేపట్టింది భారత్. ఇదివరకే సింధు నది జలాల ఒప్పందం (Indus Water Treaty)పై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కాల్పుల విరమణ ఉల్లంఘన, తరచుగా జమ్మూకాశ్మీర్ లో కాల్పులు జరపడం, తాజాగా అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడులతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అటారి-వాఘా సరిహద్దును మూసివేయడం, భారతదేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు దేశం వదిలి వెళ్లడానికి ఇచ్చిన 48 గంటల గడువు ముగిసింది. పాకిస్థాన్ పౌరులకు వీసాలు జారీ చేయడంపై కేంద్రం నిషేధం విధించింది. ఇరుదేశాల హైకమిషన్లలో నియమించిన అధికారులను తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

పదే పదే ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్

నియంత్రణ రేఖ వద్ద, అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందంలో తన నిబద్ధతలను నిలబెట్టుకోవడంలో పాకిస్తాన్ విఫలమైనందున కేంద్రం కాల్పుల విరమణ ఒప్పందానికి మొగ్గు చూపుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ భారత్ కనుక ఆ వ్యూహాత్మక చర్యకు దిగితే పాకిస్తాన్ దిగిరావాల్సిందే. అప్పుడు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు దేశాన్ని మరింత ఒంటరిని చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. అందుకు ఉన్న అవకాశాలపై కేంద్ర మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, విదేశాంగ మంత్రి, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంటి వారు దీనిపై యోచిస్తున్నారని తెలుస్తోంది. 

ఫిబ్రవరి 2021 కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ పాక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైష్-ఏ-మహమ్మద్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లాంటి ఉగ్రమూకలు జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడి కాల్పులు జరుపుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ గత ఐదేళ్లలోనూ పలుమార్లు కాశ్మీర్ లో కాల్పులు జరుపుతూ చిన్న చిన్న ఉగ్రదాడులకు పాల్పడింది. ముఖ్యంగా 2023, 2024లలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. వాటికి భారత బలగాలు దీటుగా బదులిస్తూ ఉగ్రమూకలను హతం చేస్తూనే ఉన్నా.. పాక్ వక్రబుద్ధి మారడం లేదు.

జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం ఉదయం పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ సైతం పాక్ తన బుద్ధి చూపింది. పాక్ కాల్పులకు ధీటుగా భారత బలగాలు బదులిస్తున్నాయి. ఎదురు కాల్పులతో పాక్ కాల్పులను తిప్పికొడుతున్నాయని అధికారులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

PM Modi On NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌పై మోదీ సంచలన నిర్ణయం, దోషులకు వెంటనే శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశం!
నీట్ పేపర్ లీక్‌పై మోదీ సంచలన నిర్ణయం, దోషులకు వెంటనే శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశం!
Breaking News: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!

వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Embed widget