అన్వేషించండి

ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?

Kashmir Terrorist Attack | ఈ దేశానికి ఇంటర్నల్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోదీనే అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అధిష్టానం తీరు ఒకలా, షర్మిల తీరులా మరొలా ఉందని విమర్శలు వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొత్త వివాదానికి తెర తీశారు. ఈ దేశానికి అంతర్గత శత్రువు ప్రధాని మోదీ అంటూ  ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన  విశాఖవాసి  చంద్రమౌళి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన YS షర్మిల అనంతరం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

 కాశ్మీర్ లో  దాడులకు మోదీనే బాధ్యత వహించాలి : YS షర్మిల 

కాశ్మీర్లో ప్రభుత్వం, భద్రతా లోపాల వల్లనే ఇంత పెద్ద మారణకాండ జరిగిందని YS షర్మిల రెడ్డి అన్నారు. ఉగ్రవాదులు వచ్చి ఇంత మంది టూరిస్ట్ లను చంపుతూ ఉంటే  కనీసం అడ్డుకునేవాళ్ళు లేకుండా పోయారని, మోడీ చెప్పుకునే చౌకీదార్ (కాపలా ) తనం ఇదేనా అంటూ ఆమె  మండిపడ్డారు. కాశ్మీర్లో టెర్రరిజం లేదంటూ టూరిజం ని పెద్దగా ప్రమోట్ చేశారని దాన్ని నమ్మి భారీగా వెళ్లిన పర్యాటకులు ఇలా తీవ్రవాదుల చేతుల్లో మృత్యువాత పడ్డారని దీనికి పూర్తి బాధ్యత మోడీ, అమిత్ షా వహించాలి అని షర్మిలన్నారు. ఇది  పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యమన్న షర్మిల బిజెపి ప్రభుత్వం  తనను విమర్శించిన వాళ్లపైన ఇంటెలిజెన్స్  వ్యవస్థ ను ఉపయోగిస్తుందని.. ప్రజల భద్రత ను మాత్రం గాలికి వదిలేస్తుందని అన్నారు. ముస్లిం మైనారిటీల మీద మతం పేరుతో యుద్ధం చేస్తూ  మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.


 షర్మిల టీం సరైన ఇన్ పుట్స్ ఇవ్వడం లేదా

 పైన చేసిన విమర్శల వరకు బానే ఉంది కానీ  " ఈ దేశానికి అంతర్గత టెర్రరిస్ట్ ప్రధాని మోదీ " అంటూ షర్మిల చేసిన వ్యాఖ్య మాత్రం  తీవ్రంగా వివాదాస్పదమవుతోంది. ఒక పక్కన కాంగ్రెస్ అధినాయకత్వం సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు  ఉగ్రవాద దాడికి బదులు చెప్పే దిశగా  మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని తెలిపిన సంగతి షర్మిల టీం ఆమెకు తెలియపరచలేదా.. లేదా రాంగ్ ఇన్పుట్ ఇచ్చారా అనేది ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ.

ఇటీవల తనకంటూ వైయస్ షర్మిల ఒక టీంని  ఢిల్లీలో నియమించుకున్నారన్న ప్రచారం ఉంది. మరి వాళ్ళ నుంచి రాంగ్ మెసేజ్ వెళ్ళిందా.. లేక షర్మిల కావాలనే ఇలా మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు తమ నాయకుడు ప్రధాని మోదీ పై తీవ్ర విమర్శలు చేసిన షర్మిలపై రాష్ట్ర బిజెపి నాయకులు భగ్గుమంటున్నారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
Pemmasani warning to Jagan: ఒక్క మాటతో చంపేయగలం - జగన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్
ఒక్క మాటతో చంపేయగలం - జగన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్
Markapuram Road Accident: పడుకున్న చోటే మాంసం ముద్దలుగా మారిన ప్రయాణికులు! మార్కాపురం జిల్లా ప్రమాదంపై విస్తుపోయే వాస్తవాలు!
పడుకున్న చోటే మాంసం ముద్దలుగా మారిన ప్రయాణికులు! మార్కాపురం జిల్లా ప్రమాదంపై విస్తుపోయే వాస్తవాలు!
Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
TVS Bikes 2026: టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Ranveer Singh : చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
Embed widget