అన్వేషించండి

Nara Bhuvaneswari : వైఎస్ఆర్‌సీపీ నేతల క్షమాపణలు మాకు అక్కర్లేదు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని నారా భువనేశ్వరి సలహా !

అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి స్పందించారు. వారి క్షమాపణలు తమకు అక్కర్లేదని మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు.

వైఎస్ఆర్‌సీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు చెబుతున్న క్షమాపణలు తమకు అవసరం లేదని.. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. తిరుపతిలో వరద బాధితులకు సాయం చేసే కార్యక్రమంలో  పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు బాధపడ్డామని .. చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారన్నారు.  ఆ బాధ నుంచి బయటకు రావడానికి పది రోజుల సమయం పట్టిందన్నారు. అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదని ... అక్కడ ప్రజా సమస్యల గురించే మాట్లాడాలన్నారు. ఇషఅటం వచ్చినట్లుగా మాట్లాడకూడదని..   వ్యాఖ్యానించారు.  ఆ వ్యాఖ్యల గురించి అదే పనిగా బాధపడే సమయం తమకు లేదన్నారు. 

Also Read: కోడి పందాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ముద్రగడ లేఖ.. 5 రోజులు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్

తనను ఎవరో ఏదో అన్నారని అదేపనిగా బాధపడతూ.. టైం వేస్ట్ చేసుకోమని.. సమాజ సేవకు అంకితమవుతామని స్పష్టం చేశారు. పనిలేక విమర్శలు చేస్తున్నారని.. మహిళలను కించపరిచేలా ఎవరూ మాట్లాడకూడదన్నారు. అందరూ మహిళల్ని గౌరవించాలని సూచించారు.  అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చంద్రబాబు కన్నీరు పెట్టుకుని.., మళ్లీ సీఎంగానే సభకు వస్తానని సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు. ఆ తర్వాత భువనేశ్వరి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. 

Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?

వైఎస్ఆర్‌సీపీ నేతలు తర్వాత వరుసగా క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బహిరంగంగా తప్పు జరిగిందని.. మరోసారి అలాంటి మాటలు మాట్లాడబోనని క్షమాపణలు చెప్పారు. పలువురు వైసీపీ నేతలు కూడా భువనేశ్వరిపై అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే.. కన్నీళ్లతో కాళ్లు కడుగుతామని ప్రకటన చేశారు. మహిళలను కించ పరుస్తున్న వైసీపీ నేతల తీరును.. టీడీపీ గౌరవ సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో భువనేశ్వరి వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 

Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !

రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోవచ్చిన వరద కారణంగా పెద్ద ఎత్తున జనం బాధితులయ్యారు. వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సాయం అందించారు.  కడప  జిల్లాలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 48 మంది చనిపోయినట్లుగా తేల్చారు. చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ. లక్ష చొప్పున సాయం ప్రకటించారు.   చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం.. ఎన్టీఆర్ ట్రస్ట్ బాధితుల కుటుంబసభ్యులకు చెక్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తిరుపతిలో జరగనున్న కార్యక్రమంలో రూ. 48 లక్షలను... మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి పంపిణీ చేశారు.  

Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Latest News: తిరుపతి గోశాలపై రగులుతున్న రాజకీయం- రేపు పవన్ టూర్- మేమే వచ్చి లెక్కలు చూపిస్తామన్న భూమన
తిరుపతి గోశాలపై రగులుతున్న రాజకీయం- రేపు పవన్ టూర్- మేమే వచ్చి లెక్కలు చూపిస్తామన్న భూమన
IPL 2025 DC VS RR Result Update: ఢిల్లీ సూపర్ విజయం.. టాప్ ప్లేసుకు చేరిక.. రాణించిన పోరెల్.. సూపర్ ఓవర్లో గెలిపించిన రాహుల్, స్టబ్స్
ఢిల్లీ సూపర్ విజయం.. టాప్ ప్లేసుకు చేరిక.. రాణించిన పోరెల్.. సూపర్ ఓవర్లో గెలిపించిన రాహుల్, స్టబ్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై సూపర్ ఓవర్ లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamPreity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Latest News: తిరుపతి గోశాలపై రగులుతున్న రాజకీయం- రేపు పవన్ టూర్- మేమే వచ్చి లెక్కలు చూపిస్తామన్న భూమన
తిరుపతి గోశాలపై రగులుతున్న రాజకీయం- రేపు పవన్ టూర్- మేమే వచ్చి లెక్కలు చూపిస్తామన్న భూమన
IPL 2025 DC VS RR Result Update: ఢిల్లీ సూపర్ విజయం.. టాప్ ప్లేసుకు చేరిక.. రాణించిన పోరెల్.. సూపర్ ఓవర్లో గెలిపించిన రాహుల్, స్టబ్స్
ఢిల్లీ సూపర్ విజయం.. టాప్ ప్లేసుకు చేరిక.. రాణించిన పోరెల్.. సూపర్ ఓవర్లో గెలిపించిన రాహుల్, స్టబ్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
DC vs RR Super Over: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Varsha Bollamma: ప్యాంట్, పంత్, లక్నో... వర్షా బొల్లమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెట్టింది మావా
ప్యాంట్, పంత్, లక్నో... వర్షా బొల్లమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెట్టింది మావా
Embed widget