అన్వేషించండి

Nara Bhuvaneswari : వైఎస్ఆర్‌సీపీ నేతల క్షమాపణలు మాకు అక్కర్లేదు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని నారా భువనేశ్వరి సలహా !

అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి స్పందించారు. వారి క్షమాపణలు తమకు అక్కర్లేదని మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు.

వైఎస్ఆర్‌సీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు చెబుతున్న క్షమాపణలు తమకు అవసరం లేదని.. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. తిరుపతిలో వరద బాధితులకు సాయం చేసే కార్యక్రమంలో  పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు బాధపడ్డామని .. చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారన్నారు.  ఆ బాధ నుంచి బయటకు రావడానికి పది రోజుల సమయం పట్టిందన్నారు. అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదని ... అక్కడ ప్రజా సమస్యల గురించే మాట్లాడాలన్నారు. ఇషఅటం వచ్చినట్లుగా మాట్లాడకూడదని..   వ్యాఖ్యానించారు.  ఆ వ్యాఖ్యల గురించి అదే పనిగా బాధపడే సమయం తమకు లేదన్నారు. 

Also Read: కోడి పందాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ముద్రగడ లేఖ.. 5 రోజులు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్

తనను ఎవరో ఏదో అన్నారని అదేపనిగా బాధపడతూ.. టైం వేస్ట్ చేసుకోమని.. సమాజ సేవకు అంకితమవుతామని స్పష్టం చేశారు. పనిలేక విమర్శలు చేస్తున్నారని.. మహిళలను కించపరిచేలా ఎవరూ మాట్లాడకూడదన్నారు. అందరూ మహిళల్ని గౌరవించాలని సూచించారు.  అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చంద్రబాబు కన్నీరు పెట్టుకుని.., మళ్లీ సీఎంగానే సభకు వస్తానని సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు. ఆ తర్వాత భువనేశ్వరి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. 

Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?

వైఎస్ఆర్‌సీపీ నేతలు తర్వాత వరుసగా క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బహిరంగంగా తప్పు జరిగిందని.. మరోసారి అలాంటి మాటలు మాట్లాడబోనని క్షమాపణలు చెప్పారు. పలువురు వైసీపీ నేతలు కూడా భువనేశ్వరిపై అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే.. కన్నీళ్లతో కాళ్లు కడుగుతామని ప్రకటన చేశారు. మహిళలను కించ పరుస్తున్న వైసీపీ నేతల తీరును.. టీడీపీ గౌరవ సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో భువనేశ్వరి వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 

Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !

రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోవచ్చిన వరద కారణంగా పెద్ద ఎత్తున జనం బాధితులయ్యారు. వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సాయం అందించారు.  కడప  జిల్లాలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 48 మంది చనిపోయినట్లుగా తేల్చారు. చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ. లక్ష చొప్పున సాయం ప్రకటించారు.   చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం.. ఎన్టీఆర్ ట్రస్ట్ బాధితుల కుటుంబసభ్యులకు చెక్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తిరుపతిలో జరగనున్న కార్యక్రమంలో రూ. 48 లక్షలను... మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి పంపిణీ చేశారు.  

Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget