అన్వేషించండి

Nara Bhuvaneswari : వైఎస్ఆర్‌సీపీ నేతల క్షమాపణలు మాకు అక్కర్లేదు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని నారా భువనేశ్వరి సలహా !

అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి స్పందించారు. వారి క్షమాపణలు తమకు అక్కర్లేదని మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు.

వైఎస్ఆర్‌సీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు చెబుతున్న క్షమాపణలు తమకు అవసరం లేదని.. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. తిరుపతిలో వరద బాధితులకు సాయం చేసే కార్యక్రమంలో  పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు బాధపడ్డామని .. చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారన్నారు.  ఆ బాధ నుంచి బయటకు రావడానికి పది రోజుల సమయం పట్టిందన్నారు. అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదని ... అక్కడ ప్రజా సమస్యల గురించే మాట్లాడాలన్నారు. ఇషఅటం వచ్చినట్లుగా మాట్లాడకూడదని..   వ్యాఖ్యానించారు.  ఆ వ్యాఖ్యల గురించి అదే పనిగా బాధపడే సమయం తమకు లేదన్నారు. 

Also Read: కోడి పందాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ముద్రగడ లేఖ.. 5 రోజులు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్

తనను ఎవరో ఏదో అన్నారని అదేపనిగా బాధపడతూ.. టైం వేస్ట్ చేసుకోమని.. సమాజ సేవకు అంకితమవుతామని స్పష్టం చేశారు. పనిలేక విమర్శలు చేస్తున్నారని.. మహిళలను కించపరిచేలా ఎవరూ మాట్లాడకూడదన్నారు. అందరూ మహిళల్ని గౌరవించాలని సూచించారు.  అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చంద్రబాబు కన్నీరు పెట్టుకుని.., మళ్లీ సీఎంగానే సభకు వస్తానని సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు. ఆ తర్వాత భువనేశ్వరి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. 

Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?

వైఎస్ఆర్‌సీపీ నేతలు తర్వాత వరుసగా క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బహిరంగంగా తప్పు జరిగిందని.. మరోసారి అలాంటి మాటలు మాట్లాడబోనని క్షమాపణలు చెప్పారు. పలువురు వైసీపీ నేతలు కూడా భువనేశ్వరిపై అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే.. కన్నీళ్లతో కాళ్లు కడుగుతామని ప్రకటన చేశారు. మహిళలను కించ పరుస్తున్న వైసీపీ నేతల తీరును.. టీడీపీ గౌరవ సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో భువనేశ్వరి వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 

Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !

రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోవచ్చిన వరద కారణంగా పెద్ద ఎత్తున జనం బాధితులయ్యారు. వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సాయం అందించారు.  కడప  జిల్లాలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 48 మంది చనిపోయినట్లుగా తేల్చారు. చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ. లక్ష చొప్పున సాయం ప్రకటించారు.   చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం.. ఎన్టీఆర్ ట్రస్ట్ బాధితుల కుటుంబసభ్యులకు చెక్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తిరుపతిలో జరగనున్న కార్యక్రమంలో రూ. 48 లక్షలను... మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి పంపిణీ చేశారు.  

Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget