By: ABP Desam | Updated at : 18 Dec 2021 01:07 PM (IST)
అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. యూపీలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీకు చెందిన ముఖ్య నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు శనివారం ఉదయం వారణాసి నుంచి మావు చేరుకుని... సహదత్ పురలోని సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ నివాసంలో సోదాలు చేశారు. ఆయన పన్ను ఎగవేసినట్లు అనుమానంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
మెయిన్పురిలోని ఆర్సీఎల్ గ్రూప్ యజమాని మనోజ్ యాదవ్ నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. అదేవిధంగా లక్నోలోని జైనేంద్ర యాదవ్ నివాసంలో కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. వీరంతా అఖిలేష్ యాదవ్కు అత్యంత సన్నిహితులే. ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి వీరంతా ఆర్థికంగా అండదండలు అందించే అవకాశం ఉందన్న కారణంగానే దాడులు చేశారని సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి.... హర్షం వ్యక్తం చేసిన అదర్ పునావాలా
బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రతిపక్షాలను బెదిరించేందుకు కేంద్ర సంస్థలను బీజేపీ ఉపయోగించుకుంటోందన్నారు. కాంగ్రెస్ మాదిరిగా బీజేపీ కూడా అదే దారిలో వెళ్తోందని.. కాంగ్రెస్ గత చరిత్రను చూడండి, ఎవరినైనా బెదిరించాలనుకుంటే, కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటూ ఉండేది. నేడు బీజేపీ కూడా అదే చేస్తోందని విమర్శించారు. రామ రాజ్యాన్ని తెస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో బీజేపీ విఫలమైందని అఖిలేష్ విమర్శించారు.
Also Read: ఒమిక్రాన్పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!
ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ .. బీజేపీకి గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలపై ఆదాయపు పన్ను దాడులు జరగడం చర్చనీయాంశం అవుతోంది. అయితే ఈ ఐటీ దాడులకు.. రాజకీయాలకు సంబంధం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. యూపీలో ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించాయి.
Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Tiger Footprint: కాకినాడలో టైగర్ ఈజ్ బ్యాక్, మళ్లీ కనిపించిన బెంగాల్ టైగర్ పాదముద్రలు - అధికారులు అలర్ట్
Kollapur Updates: వచ్చే ధైర్యం లేకే అరెస్టు నాటకం - జూపల్లి ధ్వజం, తిప్పికొట్టిన ఎమ్మెల్యే హర్షవర్థన్
Chandigarh news:ఆ ఐఏఎస్ కొడుకుని అధికారులు టార్చర్ చేసి చంపారా, కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు
East Godavari News : విహారయాత్రలో విషాదం, గోదావరిలో పడి అక్కాచెల్లెళ్లు మృతి
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు శుభవార్త, రేపు భారీగా ఆర్జిత సేవా టికెట్లు విడుదల
India vs England 5th Test: రోహిత్కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్ ఎవరు?
AP Elections 2024: టీడీపీ సింగిల్గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?
PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్కీ బాత్లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన