అన్వేషించండి

Telangana Vimochana Day: నేడే తెలంగాణ విమోచన దినం, ఏటా వివాదం ఎందుకు? ఆ పార్టీలు ఎందుకు గుర్తించట్లేదు?

Telangana News: కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవానికి మరో పేరు పెట్టి, ఆ రోజున ప్రజా పాలన దినోత్సవం జరుపుతామంటూ ప్రకటించింది. దీనిపై బీజేపీ తప్పుబడుతోంది.

Why Telangana Vimochana Day is Celebrated: ఏటా తెలంగాణలో సెప్టెంబరు 17 వచ్చిందంటే చాలు.. ఆ రోజు విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఉన్న వైరుద్ధ్యాలు బయటికి వస్తూ ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ సెప్టెంబరు 17ను గుర్తించకుండా వేడుకలకు దూరంగా ఉందని మరొక పార్టీ ఆరోపిస్తుంటుంది. ఆ ఇంకో పార్టీ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి మరీ తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతుంటుంది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవానికి మరో పేరు పెట్టి, ఆ రోజున ప్రజా పాలన దినోత్సవం జరుపుతామంటూ ప్రకటించింది. ఇలా సెప్టెంబరు 17ను వివిధ రాజకీయ పార్టీలు వారి రాజకీయాలకు అనుగుణంగా మార్చేసుకుంటున్నాయి. ఇంతకీ సెప్టెంబరు 17కి చరిత్రలో ఉన్న ప్రాధాన్యం ఏంటి? 

సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినం. అంటే 1948కి ముందు ఉన్న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసిన రోజును తెలంగాణ విమోచన దినంగా పిలుస్తారు. నిజానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశానికి ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటికే ఉన్న ఎన్నో సంస్థానాలు, రాజ్యాలు భారత యూనియన్ లో కలిసిపోయాయి. ఒక్క హైదరాబాద్ తో పాటు, కశ్మీర్ రాజ్యాలు మాత్రమే భారత్‌లో కలిసేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నిజాం రాజు నుంచి స్వాతంత్ర్యం రాలేదు. దేశమంతా ఆంగ్లేయులు, వివిధ పాలకుల నుంచి విముక్తి కలిగి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుండగా.. హైదరాబాద్‌లో మాత్రం ప్రజలు నిజాం ఏలుబడిలో ఇంకా పీడితులుగానే ఉండిపోయారు. హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ఏడో నిజాం ప్రయత్నించేవారు. లేదంటే హైదరాబాద్ ను పాకిస్థాన్ లో అయినా విలీనం చేయాలని భావించేవారు. భౌతికంగా అది సాధ్యం కాకపోయినప్పటికీ ఆయన ఆ దిశగా ప్రయత్నించారు.

సైనిక చర్యతో నిజాం మెడలు వంచి..
దీంతో భారత ప్రభుత్వంలో అప్పటి హోం మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ హైదరాబాద్ పై సైనిక చర్య చేపట్టింది. అలా 1948 సెప్టెంబర్ 13న భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలోకి ప్రవేశించింది. అలా భారత సేనల చొరబాటును నిజాం సైన్యం సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. చివరికి 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగుబాటు కాక తప్పలేదు. 1948 సెప్టెంబర్ 18 నిజాం సంస్థానం అధికారికంగా భారత యూనియన్‌లో విలీనం అయింది. అందుకని సెప్టెంబరు 17న నిజాం లొంగుబాటుకు కారణంగా ఆ రోజును తెలంగాణ విమోచన దినంగా పరిగణిస్తూ వస్తున్నారు.

ప్రజా పాలన దినంగా గుర్తించిన కాంగ్రెస్
సెప్టెంబరు 17ను రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన దినంగా గుర్తించి, వేడుక తరహాలో నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మిగిలిన జిల్లాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే బాధ్యతలను వివిధ నేతలకు అప్పగించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థల్లోనూ మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు.

అయితే, బీజేపీ మాత్రం కాంగ్రెస్ తీరును తప్పుబడుతోంది. సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ జంకుతున్నాయని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినం అనేవారని.. ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం అంటోందని అన్నారు. విమోచన దినం అనడానికి వారికి ఉన్న అభ్యంతరాలు ఏంటని లక్ష్మణ్ నిలదీశారు. హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం, ఆ పార్టీ అధినేతలు ఒవైసీలకు అంతలా ఎందుకు భయపడుతున్నారని లక్ష్మణ్ నిలదీశారు. 

ఎన్నో తరాలుగా నిజాం ప్రభుత్వంలో ప్రజలు అల్లాడిపోయారని.. అలాంటిది సెప్టెంబరు 17న ఇక్కడి ప్రజలకు నిజాం నుంచి విముక్తి కలిగితే దాన్ని విమోచన దినం అనేందుకు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ నిలదీశారు. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలు ఇప్పటి తరానికి, భవిష్యత్ తరానికి తెలవాలని కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
BCCI Awards: సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP DesamUnion Budget 2025 Income Tax Nirmala Sitharaman 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP DesamPM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
BCCI Awards: సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
Capital Expenditure : రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
Hyderabad News: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు యత్నం, పోలీసులపైనే కాల్పులు
గచ్చిబౌలిలో కాల్పుల కలకలం - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు యత్నం, పోలీసులపైనే కాల్పులు
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
Embed widget