అన్వేషించండి

Telangana Vimochana Day: నేడే తెలంగాణ విమోచన దినం, ఏటా వివాదం ఎందుకు? ఆ పార్టీలు ఎందుకు గుర్తించట్లేదు?

Telangana News: కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవానికి మరో పేరు పెట్టి, ఆ రోజున ప్రజా పాలన దినోత్సవం జరుపుతామంటూ ప్రకటించింది. దీనిపై బీజేపీ తప్పుబడుతోంది.

Why Telangana Vimochana Day is Celebrated: ఏటా తెలంగాణలో సెప్టెంబరు 17 వచ్చిందంటే చాలు.. ఆ రోజు విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఉన్న వైరుద్ధ్యాలు బయటికి వస్తూ ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ సెప్టెంబరు 17ను గుర్తించకుండా వేడుకలకు దూరంగా ఉందని మరొక పార్టీ ఆరోపిస్తుంటుంది. ఆ ఇంకో పార్టీ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి మరీ తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతుంటుంది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవానికి మరో పేరు పెట్టి, ఆ రోజున ప్రజా పాలన దినోత్సవం జరుపుతామంటూ ప్రకటించింది. ఇలా సెప్టెంబరు 17ను వివిధ రాజకీయ పార్టీలు వారి రాజకీయాలకు అనుగుణంగా మార్చేసుకుంటున్నాయి. ఇంతకీ సెప్టెంబరు 17కి చరిత్రలో ఉన్న ప్రాధాన్యం ఏంటి? 

సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినం. అంటే 1948కి ముందు ఉన్న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసిన రోజును తెలంగాణ విమోచన దినంగా పిలుస్తారు. నిజానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశానికి ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటికే ఉన్న ఎన్నో సంస్థానాలు, రాజ్యాలు భారత యూనియన్ లో కలిసిపోయాయి. ఒక్క హైదరాబాద్ తో పాటు, కశ్మీర్ రాజ్యాలు మాత్రమే భారత్‌లో కలిసేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నిజాం రాజు నుంచి స్వాతంత్ర్యం రాలేదు. దేశమంతా ఆంగ్లేయులు, వివిధ పాలకుల నుంచి విముక్తి కలిగి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుండగా.. హైదరాబాద్‌లో మాత్రం ప్రజలు నిజాం ఏలుబడిలో ఇంకా పీడితులుగానే ఉండిపోయారు. హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ఏడో నిజాం ప్రయత్నించేవారు. లేదంటే హైదరాబాద్ ను పాకిస్థాన్ లో అయినా విలీనం చేయాలని భావించేవారు. భౌతికంగా అది సాధ్యం కాకపోయినప్పటికీ ఆయన ఆ దిశగా ప్రయత్నించారు.

సైనిక చర్యతో నిజాం మెడలు వంచి..
దీంతో భారత ప్రభుత్వంలో అప్పటి హోం మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ హైదరాబాద్ పై సైనిక చర్య చేపట్టింది. అలా 1948 సెప్టెంబర్ 13న భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలోకి ప్రవేశించింది. అలా భారత సేనల చొరబాటును నిజాం సైన్యం సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. చివరికి 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగుబాటు కాక తప్పలేదు. 1948 సెప్టెంబర్ 18 నిజాం సంస్థానం అధికారికంగా భారత యూనియన్‌లో విలీనం అయింది. అందుకని సెప్టెంబరు 17న నిజాం లొంగుబాటుకు కారణంగా ఆ రోజును తెలంగాణ విమోచన దినంగా పరిగణిస్తూ వస్తున్నారు.

ప్రజా పాలన దినంగా గుర్తించిన కాంగ్రెస్
సెప్టెంబరు 17ను రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన దినంగా గుర్తించి, వేడుక తరహాలో నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మిగిలిన జిల్లాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే బాధ్యతలను వివిధ నేతలకు అప్పగించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థల్లోనూ మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు.

అయితే, బీజేపీ మాత్రం కాంగ్రెస్ తీరును తప్పుబడుతోంది. సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ జంకుతున్నాయని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినం అనేవారని.. ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం అంటోందని అన్నారు. విమోచన దినం అనడానికి వారికి ఉన్న అభ్యంతరాలు ఏంటని లక్ష్మణ్ నిలదీశారు. హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం, ఆ పార్టీ అధినేతలు ఒవైసీలకు అంతలా ఎందుకు భయపడుతున్నారని లక్ష్మణ్ నిలదీశారు. 

ఎన్నో తరాలుగా నిజాం ప్రభుత్వంలో ప్రజలు అల్లాడిపోయారని.. అలాంటిది సెప్టెంబరు 17న ఇక్కడి ప్రజలకు నిజాం నుంచి విముక్తి కలిగితే దాన్ని విమోచన దినం అనేందుకు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ నిలదీశారు. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలు ఇప్పటి తరానికి, భవిష్యత్ తరానికి తెలవాలని కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversion: అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
Telangana News: మార్చురీలో డెడ్‌బాడీని పీక్కుతిన్న కుక్క.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
మార్చురీలో డెడ్‌బాడీని పీక్కుతిన్న కుక్క.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
Telangana Govt: కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Sabarimala Issue: అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
Iran-Israel War : ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
iPhone 17e Launched: 48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు
48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు
Peddi Song : పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
First class admission: 6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం - కొన్ని రోజులు మినహాయింపు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్
6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం - కొన్ని రోజులు మినహాయింపు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్
Embed widget