అన్వేషించండి

Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Rice Smuggling: ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై విచారణకు ఆరుగురు సభ్యులతో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.

SIT On Rice Smuggling In Kakinada: ఏపీలో రేషన్ బియ్యం (Ration Rice) అక్రమ రవాణా ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా వినీత్ బ్రిజ్ లాల్ వ్యవహరిస్తారు. సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, గోవిందరావు, బాలసుందర్ రావు, రత్తయ్య ఇలా బృందంలో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. సిట్‌కు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించిన ప్రభుత్వం.. 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

కాగా, అక్రమ రవాణాపై కాకినాడలో నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా సిట్ విచారణ జరపనుంది. ఈ వ్యవహారంపై మొత్తం 13 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆఫ్రికా దేశాలకు ఎగుమతులపై సిట్ పూర్తి స్థాయి విచారణ చేయనుంది. పీడీఎస్ రైస్‌ను ఎక్స్‌పోర్ట్ డాక్యుమెంట్లలో ఎలా నివేదించారో సిట్ వెలికితీయనుంది. దోషులుగా తేలితే వెంటనే అరెస్ట్ చేసే అధికారాన్ని సైతం సిట్‌కు ప్రభుత్వం ఇచ్చింది.

అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం సంచలనం సృష్టించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల కాకినాడ పోర్టును సందర్శించి అక్రమంగా రేషన్ బియ్యం తరలిపోతున్నట్లు గుర్తించారు. షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడ కేంద్రంగా జరిగిన ఘటనలు, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులపై సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని ఇప్పటికే మంత్రి ప్రకటించారు. బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోందని.. ఇప్పటివరకు కోటీ 20 టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు తమకు సమచారం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1,066 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 729 మందిని అరెస్ట్ చేసి.. 102 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

కాకినాడ నుంచే అధికంగా..

రాష్ట్రం నుంచి 62 వేల టన్నుల బియ్యం అక్రమంగా రవాణా జరిగిందని.. వాటి విలువ సుమారు రూ.240 కోట్లు అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. విశాఖ, కృష్ణపట్నం పోర్టుల కంటే కాకినాడ పోర్టు నుంచే ఎక్కువ మొత్తంలో తరలిపోయాయని.. ఇందులో అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. స్టెల్లా షిప్‌లో అన్ని విభాగాలను కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారని.. బియ్యం అక్రమంగా తరలించే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గత జూన్‌లో కాకినాడలో 28 గోదాములపై దాడులు చేయగా.. 51 లక్షల టన్నుల రేషన్ బియ్యం పట్టుబడ్డాయని చెప్పారు. అప్పటి నుంచీ కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న అక్రమ బియ్యం తరలింపు వ్యవహారంలో స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆ పోర్టు స్మగ్లింగ్ డెన్‌గా మారిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

Also Read: YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget