News
News
వీడియోలు ఆటలు
X

Gurupurima Special: ఆదిగురువు వేదవ్యాసుడే ఎందుకు?

ఆషాఢ శుద్ధ పూర్ణిమని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే. పురాణాల కాలం నుంచి నేటి వరకూ గురువు అనగానే వ్యాసుడిని ఎందుకు పూజిస్తారు?

FOLLOW US: 
Share:

సప్త చిరంజీవుల్లో ఒకడైన వేద వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటూ మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు. ఆయన పుట్టిన రోజైన ఆషాడ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా గుర్తించి…తమ తమ గురువులను పూజించి, వారి ఆశీస్సులు తీసుకుంటారు.


అంతులేని ఆధ్యాత్మిక సంపద అందించిన వ్యాసుడు జన్మించింది ఓ మత్స్య కన్యకి.  మత్స్య గంధి పడవనడుపుకునే దాశరాజుకుమార్తెగా పెరిగింది. ఆమెనే సత్యవతి అని కూడ అంటారు. యుక్త వయస్సు వచ్చాక తండ్రికి సాయంగా  యమునా నదిపై పడవ నడుపుతూ ఉండేది. ఒక రోజు వశిష్ట మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి తీర్ధయాత్రల్లో భాగంగా యమునను దాటవలసి వచ్చింది. ఆ సమయంలో మత్స్య గంధి తండ్రి అప్పుడే చద్దిమూట విప్పుకుని భోజనం కూర్చోవడంతో…మహర్షిని ఆవతలి ఒడ్డుకి తీసుకెళ్లాలని కూతుర్ని పురమాయించాడు. మత్స్యగంధి సేరనంది.  పడవ ఎక్కిన పరాశరమహర్షికి… నదిలో కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమెని చూసి మనసు చలించింది. అదే విషయాన్ని ఆమెతో ప్రస్తావించగా…ఇంతటి మహానుభావులు , కాలజ్ఞానులైన మీరు  ఇలా ఎలా ప్రవర్తించగలరు.. పైగా పగటి పూట సరికాదని మీకు తెలియదా అని అడిగింది. అందుకు సమాధానంగా పరాశర మహర్షి పడవ చుట్టూ ఓ మాయా తిమిరం సృష్టించాడు.


మీ కోరిక తీరిస్తే తన కన్యత్వం భంగమవతుందని…తిరిగి  తండ్రివద్దకు ఎలా వెళ్ళాలని అడిగింది మత్స్యగంధి.
తనతో సంగమించిన తరువాత కూడా ఆమె కన్యత్వం చెడదు అని చెప్పిన పరాశరమహర్షి…ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. తన శరీరం నుంచి వస్తున్న ఈ మస్త్యగంధం తనకు నచ్చలేదని…ఆ చేపల కంపు నుంచి విముక్తి చేయమని కోరింది. వెంటనే ఆ వరమివ్వడమే కాకుండా…ఇకపై ఆమె శరీరం నుంచి గంధపు వాసన ఓ యోజనదూరం వరకూ వ్యాప్తిచెందుతుందని వరమిస్తాడు. అప్పటి నుంచి మత్స్యగంధి…యోజనగంధిగా మారిపోయింది. ఆ తర్వాత అప్పటికప్పుడే వారిద్దరికి జన్మించిన పుత్రుడే వ్యాసుడు.


సూర్యసమాన తేజస్సుతో, సర్వ వేదజ్ఞానంతో జన్మించిన వ్యాసుడు…తపస్సుకి వెళుతున్నా అని తల్లితో చెప్పి… ఎప్పుడు స్మరిస్తే అప్పుడు తప్పక వస్తా అని మాట ఇచ్చి వెళ్లిపోతాడు. చిన్నప్పుడే  ద్వీపంలో వదిలేయడం వల్ల ద్వైపాయనుడు, కృష్ణద్వైపాయనుడు అని వ్యాసుడిని పిలుస్తారు.


మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి భారతకథలో భాగమై ఉన్నాడు. అయినప్పటికీ కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తన దారిన తాను వెళ్లిపోతాడు. వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత యోజనగంధి అయిన సత్యవతి…భీష్ముడి తండ్రి శంతనుడిని వివాహం చేసుకుంటుంది. సత్యవతి తండ్రి దాశరాజు షరతు ప్రకారం భీష్ముడు బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు, విచిత్రవీర్యుడు అకాలమరణం చెందుతారు. ఇక భరతవంశాన్ని నిలిపేందుకు సత్యవతి తన పుత్రుడైన వ్యాసుడిని స్మరిస్తుంది. వ్యాసుడి ద్వారా అంబికకు దృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాశీకి విదురుడిని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.  ఆతర్వాత కూడా భారతంలో ప్రతి మలుపులోనూ వ్యాసుడు ఉంటాడు.


అయితే పురాణాల ప్రకారం, వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహా భారతాన్ని మనకు అందించిన వ్యాసుడు పుట్టినరోజునే గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకోవడం హిందూసంప్రదాయం..

Published at : 20 Jul 2021 06:44 PM (IST) Tags: Vyasa Maharshi Birth yojana ghandi Parasara maharshi veda vyasa vyasa purnima Guru Purnima inspiring story know in details

సంబంధిత కథనాలు

Dwarkadhish Temple in Ratlam: ప్రతి రాత్రి ద్వారకాధీశుని విగ్రహం మాయం.. రత్లాంలోని ఈ ఆలయం గురించి తెలుసా?

Dwarkadhish Temple in Ratlam: ప్రతి రాత్రి ద్వారకాధీశుని విగ్రహం మాయం.. రత్లాంలోని ఈ ఆలయం గురించి తెలుసా?

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

Bhagavad Gita Sloka: గీతాసార‌మంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది

Bhagavad Gita Sloka: గీతాసార‌మంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది

Peepal Tree : రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం

Peepal Tree : రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం

Decoding dreams: కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

Decoding dreams: కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

టాప్ స్టోరీస్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎందులో? టైమింగ్‌, వెన్యూ ఏంటి?

WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎందులో? టైమింగ్‌, వెన్యూ ఏంటి?

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్‌ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్‌ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం