Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana CM: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదాయం తగ్గినా.. అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోకుండా పాలన చేస్తున్నామన్నారు.

Revanth Reddy: ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోలేదు ప్రజలకు అన్ని విషయాలు చెప్పి పరిపాలన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపదలచుకోలేదన్నారు.అందుకే దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామని...ఇసుక, ఇతర విధానాలను స్ట్రీమ్ లైన్ చేస్తూ ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో ఇసుకపై ప్రభుత్వానికి కోటిన్నర ఆదాయం వస్తే… ఇవాళ ఇసుక ఆదాయం మూడున్నర కోట్లకు పెరిగింది . పన్నుల వసూలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. నిరుద్యోగసమస్యను 8.8 నుంచి 6.6 కి వచ్చిందన్నారు. రాజీవ్ యువ వికాసం కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించిన సభలో రేవంత్ మాట్లాడారు.
నిత్యావసర వస్తువుల ఇన్ఫ్లేషన్ లో 1.3 తో దేశంలోనే తెలంగాణ ముందు ఉందని...ఇది తాము చెప్పేది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన గణాంకాలన్నారు. రూ.6000 కోట్లతో 5 లక్షల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని...శాసన సభ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషమన్నారు.అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు.ఈ 15 నెలల్లో 57 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం 50 లక్షల కుటుంబాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగులు చూస్తున్నాం .. 43 లక్షల కుటుంబాలు రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళలకు 1 కోటి 30 లక్షల నాణ్యమైన చీరలు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని 29,500 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం .. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డలకు అప్పగించామని గుర్తు చేశారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ చెప్పారని.. కులగణన నిర్వహించి ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకుంటున్నామని.. కులగణనలో బీసీల లెక్క 56.36 శాతంగా తేలింది.. వారికి 42 శాతం రిజర్వేషన్లు అందించాలన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు బిల్లును కూడా సభ ముందుకు తీసుకొచ్చాం .. దీనిని ఆమోదించుకుని ఎస్సీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
పరిపాలనను ప్రక్షాళన చేస్తూ…పారదర్శక విధానంతో ముందుకు వెళ్తున్నాం .. రాజీవ్ యువ వికాసం ద్వారా రో. 50వేల నుంచి రూ. 4లక్షల వరకు మంజూరు చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించుకున్నాం జూన్ 2 న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా నియోజకవర్గానికి 4 నుంచి 5 వేల మందికి ఉపాధి కలిగించొచ్చని.. నిజమైన నిరుద్యోగులకు ఇది అందాలి.. వారికిది ఉపయోగపడాలని రేవంత్ స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ, టీచర్ల బదిలీలు ఎలాంటి ఆరోపణ లేకుండా పారదర్శకంగా నిర్వహించామని.. పథకాల అమలులో పారదర్శకంగా ఉండాలి.. అప్పుడే ప్రజలకు మెరుగైన పాలన అందించగలుగుతామన్నారు. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాంమని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

