అన్వేషించండి

Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Latest News: కేసీఆర్ సెక్యూరిటీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యుల నుంచే ప్రాణ హాని ఉందని ఆరోపించారు.

Telangana Latest News: తెలంగాణ ఉభయ సభల్లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ విధానాలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు సొంత కుటుంబ సభ్యుల నుంచే ప్రాణ హాని ఉందని ఆరోపించారు. ఆయన సభకు రెండురోజులే హాజరైనా ఇప్పటి వరకు లక్షల్లో జీతం తీసుకున్నారని సభకు వివరించారు. 

శాసనసభకు వచ్చి కేసీఆర్‌ లాంటి సీనియర్ వ్యక్తి సలహా ఇస్తే తీసుకునేందుకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నిసార్లు పిలుస్తున్నా ఆయన మాత్రం సభకు రావడం లేదని వాపోయారు. శాసన సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని గతంలో సుప్రీంకోర్టు చెప్పందని రేవంత్ తెలిపారు. 

కొత్త ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతున్నా కేసీఆర్ మాత్రం శాసనసభకు కేవలం రెండే రెండుసార్లు వచ్చారని అన్నారు రేవంత్. కానీ ఎమ్మెల్యేలగా, ప్రతిపక్ష నేతగా ఆయన ఇప్పటి వరకు 57,84,124 రూపాయల జీతం తీసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా కేసీఆర్ పర్యటించడం లేదని ప్రజా సమస్యల గురించి సభలో ప్రస్తావించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ప్రైవేటు కంపెనీ ఉద్యోగులకు కరోనా టైంలో వర్క్‌ఫ్రమ్‌ హోం ఉండేదని ఇప్పుడు వాళ్లకి కూడా ఆ ఫెసిలిటీ లేదని అన్నారు. రాజకీయాల్లో ఈ సౌకర్యం వచ్చిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

ప్రజల సంపదను జీతభత్యాలుగా తీసుకుంటున్న కేసీఆర్ సభకు రాకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేశారని ఆరోపించారు రేవంత్. ఆయన ట్రైనింగ్‌లో వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు రేబిస్ వ్యాక్సిన్ వికటించినట్లుగా ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ చేశారు. వీళ్లు ఇలానే వ్యవహరిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా ఖాయమని హెచ్చరించారు.  

ఈ టైంలో కేసీఆర్ ఫ్యామిలీపై మరో సంచలన ఆరోపణ చేశారు రేవంత్. కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పోలీసు సెక్యూరిటీ మధ్యలో కుటుంబానికి దూరంగా ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని చెప్పుకొచ్చారు.  

కృష్ణానదిపై ప్రాజెక్టుల మొత్తం వివరాలపై తాము చర్చకు సిద్ధమని కేసీఆర్ ఎప్పుడు వచ్చినా తాము రెడీ న్నారు రేవంతత్. ఎవరి హయాంలో ఏ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయో పూర్తి అయ్యాయో ఎవరి వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందో మాట్లాడాదామన్నారు. తన వాదన వీగిపోతే కచ్చితంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ సభ్యులకు క్షమాపణలు చెబుతానని ప్రకటించారు. కాంట్రాక్టర్లకు, స్నేహితుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారని మండిపడ్డారు. ఇవన్నీ బయటపడతాయనే సభకు రాకుండా మొహం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఎక్కడా కులానికి స్టేచర్ ఉండదని రేవంత్ తెలిపారు. పదవికి మాత్రమే స్టేచర్ ఉంటుందన్నారు. ఇకపై ఫామ్‌హౌస్‌లలో డ్రగ్స్ పార్టీలు సాగనివ్వబోమన్నారు. పనిలో పనిగా నిర్మాత కేదార్ మృతిపై కూడా రేవంత్ మాట్లాడారు. నిర్మాత కేదార్ మృతి విషయంలో దుబాయ్‌లో ఏం జరిగిందో కూడా వివరాలు తెప్పించుకుంటున్నామని సభకు తెలిపారు. ఆ నాయకులు సభకు వచ్చిన తర్వాత అన్నీ బయటకు వస్తాయని వివరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Embed widget