అన్వేషించండి
In Pics: ఎన్నికల తర్వాత తొలిసారి కుప్పంకు చంద్రబాబు - ప్రజల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం
Chandrababu in Kuppam: గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంకు వెళ్లారు.

కుప్పంలో చంద్రబాబు నాయుడు
1/21

కుప్పం నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన మంగళవారం జరిగింది.
2/21

ఆయన రాకతోనే ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
3/21

ఈ పర్యటనకు ముందు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించి మధ్యాహ్నం 2.53 గంటలకు కుప్పంకు సీఎం బయలుదేరారు.
4/21

అక్కడ హంద్రీ నీవా కాలువ పనులు గురించి వివరించిన ఎస్ఈ చంద్రబాబుకు వివరించారు.
5/21

సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు.
6/21

రెండు రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది.
7/21

మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
8/21

సీఎం పర్యటనకు ఉండే సెక్యూరిటీకి పూర్తి భిన్నంగా.. చంద్రబాబు టూర్ సాగుతోంది.
9/21

పోలీసులు, ప్రత్యేక భద్రతా సిబ్బంది లేకుండా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.
10/21

బాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన వచ్చిన బస్సు వద్దకు వచ్చి చంద్రబాబుకు అభినందనలు తెలుపుతున్నారు.
11/21

ప్రజలు, కార్యకర్తలతో మమేకం అవుతూ చంద్రబాబు తన పర్యటనను కొనసాగిస్తున్నారు.
12/21

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎనిమిదిసార్లు కుప్పం నుంచి గెలిచానని అన్నారు.
13/21

తాను కుప్పానికి వచ్చినా, రాకున్నా ప్రజలు ఆదరించారని అన్నారు.
14/21

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారని.. అహంకారంతో విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని ప్రజలు మరోసారి నిరూపించారని అన్నారు.
15/21

సీఎం అయిన వెంటనే పోలవరం, అమరావతి వెళ్లానని.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేముందు మీ ఆశీస్సుల కోసమే కుప్పం వచ్చానని చంద్రబాబు అన్నారు.
16/21

రాబోయే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని.. కుప్పాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
17/21

వైసీపీ పాలన పీడ కల అని.. అలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.
18/21

వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ను తిరగరాయబోతున్నామని వెల్లడించారు.
19/21

కుప్పం ప్రశాంతమైన చోటు అని.. ఇక్కడ హింసకు చోటులేదని అన్నారు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే ఆఖరి రోజు.. జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు.
20/21

కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు సిమెంట్ రోడ్లు వేయిస్తామని.. కుప్పంలోని 4 మండల కేంద్రాలను ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
21/21

image 21
Published at : 25 Jun 2024 05:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
జాబ్స్
నల్గొండ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion