అన్వేషించండి

AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Andhra : ఏపీ లో లిక్కర్ స్కాంపై టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ బంధువు సునీల్ రెడ్డి రూ.2వేలకోట్లను దుబాయ్ తరలించారన్నారు.

Andhra Liquor Scam :  వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరూ ఊహించనంత భారీ లిక్కర్ స్కాం జరిగిందని  లోక్‌సభలో సంచలన విషయాలను  ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా.. జగన్ మద్యం కుంభకోణం అతి పెద్దదన్నారు.   లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కాం చేసిన ఘనత జగన్‌ దని..   జగన్ బంధువు సునీల్‌రెడ్డి ద్వారా దుబాయ్‌కు రూ.2 వేల కోట్లు తరలించారన్నారు. ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్‌రెడ్డి ద్వారా రూ.2 వేల కోట్లు దుబాయ్‌కు మళ్లించారు. Adan, Graysons, Leela, JR Associates, PV Spirits లాంటి 26 కొత్త కంపెనీలు భారీ లాభాలు పొందాయన్నారు. తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి రూ.వేల కోట్లు అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు వెళ్లేలా చేశారని ఆరోపించారు. 

ఈ లిక్కర్ స్కాంపై ఇప్పటికే వీటి అన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఎంక్వయిరీకి ఆదేశించింది. విదేశీ లావాదేవీలు కూడా ఉన్నాయి కాబట్టి, ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ చేయాలని కేంద్రాన్ని కోరారు.  ప్రభుత్వం మద్యనిషేధ వాగ్దానం చేసి, బినామీ డిస్టిలరీల ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిపిందని, APSBCL ను పూర్తిగా ఆధీనంలో పెట్టుకొని, రూ. 2,000 కోట్లు దుబాయ్‌కి మళ్లించారని దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 

వైఎస్ఆర్‌సీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరిగిందని కూటమి పార్టీలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారంలోకి  రాగానే సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అసెంబ్లీలో చంద్రబాబు సీఐడీతో పాటు ఈడీ విచారణుకు కూడా సిఫారసు చేశారు. కనీ వినీ ఎరుగనంత మనీలాండరింగ్ జరిగిందని కూటమి పార్టీలు అంటున్నాయి. ఈ క్రమంలో ఈడీ విచారణ జరిగితేనే డబ్బులు ఎక్కడెక్కడికి తరలిపోయాయో తెలుస్తాయని.. వాటి వెనుక ఉన్నదెవరో వెల్లడవుతుందని అంటున్నారు. సీఐడీ ఇప్పటికే సమగ్ర విచారణ చేసి.. మనీ ఎలా లాండరింగ్ జరిగిందో.. కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 

ఇటీవల తమిళనాడులో లిక్కర్ స్కాం జరిగిందని ఈడీ ప్రకటించారు. వెయ్యి కోట్ల మేర రాజకీయ ప్రముఖులు లంచాలు తీసుకున్నరాని పలు చోట్ల జరిగిన సోదాల తర్వాత ప్రకటించింది. అయితే ఏపీలో జరిగింది ఇంకా అతి పెద్ద స్కామ్ అని.. ఏపీపై ఎందుకు దృష్టి పెట్టరని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో  లావు కృష్ణదేవరాయులు నేరుగా లోక్ సభలో ప్రసంగించడంతో.. ఈ అంశంపై కేంద్రం దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
Akividu issue: చలో ఆకివీడు అంటూ భారీ ప్రచారం - పోలీసుల వార్నింగ్ - ఆదివారం ఏం జరగబోతోంది?
చలో ఆకివీడు అంటూ భారీ ప్రచారం - పోలీసుల వార్నింగ్ - ఆదివారం ఏం జరగబోతోంది?
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Sajjala Ramakrishna Reddy: మావిగన్ ఆలోచన జగన్‌దే - మూడు రాజధానుల్ని అవహేళన చేస్తారా - సజ్జల ఆగ్రహం
మావిగన్ ఆలోచన జగన్‌దే - మూడు రాజధానుల్ని అవహేళన చేస్తారా - సజ్జల ఆగ్రహం

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR Vs GT Result Updates: రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
IPL 2026 DC Vs MI Result Update: ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
Embed widget