అన్వేషించండి

Kids Using Mobile : మీ పిల్లలు ఫోన్ అస్సలు వదలట్లేదా? వారికొచ్చే శారీరక, మానసిక సమస్యలు ఇవే, పేరెంట్స్ జాగ్రత్త

Mobile device use in children : పిల్లలు ఫోన్ వాడడమనేది ఈరోజుల్లో కామన్ అయిపోయింది. మరి ఇది వారి జీవితాన్ని శారీరకంగా, మానసికంగా ఎంతవరకు నెగిటివ్​గా ఇంపాక్ట్ చేస్తుందో ఇప్పుడు చూసేద్దాం. 

Negative impacts of mobile devices on children : మా పిల్లాడు ఫోన్​ లేకపోతే భోజనం చేయడు అండి. మా పిల్లలైతే ఫోన్​లో గేమ్స్ సూపర్​గా ఆడేస్తారు. మాకంటే ఫోన్​ గురించి ఎక్కువ మా పిల్లలకే తెలుసు. ఇలాంటివి చెప్తూ పిల్లలకి ఫోన్​ ఇచ్చి వదిలేస్తున్నారా? అయితే జాగ్రత్త. మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే చేజేతులారా నాశనం చేస్తున్నట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. 

పిల్లలు మారాం చేస్తున్నారనో.. లేదా స్కూల్​ వర్క్ ఉందనో.. లేదా తమని డిస్టర్బ్ చేయకుండా కిడ్స్ సైలెంట్​గా ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తారనో.. చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా తర్వాత ఫోన్ అనేది పిల్లలకి అడెక్షన్​గా మారిపోతుంది. ఈ సమయంలో వారిలో శారీరకంగా, మానసికంగా కొన్ని సమస్యలు మొదలవుతాయి. అవేంటంటే.. 

శారీరక సమస్యలు 

పిల్లల్లో వచ్చే ఒబెసిటీ, అధికబరువుకు ఉన్న ప్రధాన కారణాల్లో మొబైల్ ఒకటి. ఇతర కారణాలవల్ల బరువు పెరిగినా.. ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక సమస్యలకు సెల్​ఫోన్​ కారణంగా చెప్తున్నారు. ఎందుకంటే దానివల్ల ఫిజికల్​ యాక్టివిటీ ఉండదు. శారీరకంగా బలంగా ఉండరు. మెటబాలీజం తగ్గిపోతుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. అలాగే చిన్నవయసులోనే కంటిచూపు మందగిస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తీవ్రమవుతాయి. నిద్ర సమస్యలు పెరుగుతాయి. నిద్ర నాణ్యత తగ్గి మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

మానసిక సమస్యలు 

పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడితో వారిలో యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి. ముభావంగా మారిపోతారు. బ్రెయిన్ యాక్టివ్​గా ఉండదు. అలాగే మొబైల్ చూడడమనేది వ్యసనంగా మారుతుంది. ఇది మానసికంగా కృంగదీస్తుంది. ఇతరులతో కలిసేందుకు, మాట్లాడేందుకు మొగ్గు చూపరు. మొబైల్​లోనే ఎక్కువకాలం గడుపుతారు. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ వారి లైఫ్​ని డిస్ట్రాక్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. 

చదువుపై ప్రభావం.. 

పిల్లలు అధికంగా మొబైల్ ఉపయోగించడం వల్ల చదువుపై కూడా నెగిటివ్ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వారు ఇంక ఏ పనిపై ఫోకస్ చేయలేరు. అలాగే చదువుపై కూడా దృష్టి పెట్టలేరు. ఫోకస్ తగ్గిపోతుంది. చదువుకోసం ఫోన్ ఉపయోగించడం వేరు. కానీ చదువునే మరపించేలా ఫోన్​ని ఉపయోగించకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పిల్లల్లో చదువుకోవాలన్న కోరిక తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోతుంది. మతిమరుపు ఎక్కువ అవుతుంది. దీనివల్ల చదివినా ఎగ్జామ్​లో రాయలేకపోవచ్చు. క్రియేటివిటీ కూడా తగ్గిపోతుంది. స్కిల్స్​ని కూడా వదిలేస్తారు. 

పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లలు మొబైల్ ఎక్కువగా ఉపయోగించకుండా ఉండేలా చూసుకోవడం పేరెంట్స్ బాధ్యతే. వారు ఎంతగా ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తే పిల్లలు అంతగా ఫోన్​కి అడిక్ట్ అయిపోయి మీ మాటలకు నెగిటివ్​గా మారుతారు. మొబైల్ ఉపయోగించడానికి అనుమతి ఇస్తూనే.. దానికి టైమ్​ లిమిట్ పెట్టాలి. రోజులో ఎంత సమయం ఫోన్​ని వాడుకోవచ్చో బౌండరీలు సెట్​ చేయాలి.

ఫోన్​ వాడకాన్ని దూరం చేసేలా పనులు చెప్పడం, స్పోర్ట్స్ ఆడించడం, వాకింగ్, రన్నింగ్ వంటివి చేయించాలి. పిల్లలతో మాట్లాడుతూ వారిని ఎంగేజ్ చేస్తూ, వారికి నచ్చిన టాపిక్స్​ మాట్లాడుతూ ఉండాలి. పిల్లలు ఫోన్​లో కొన్ని యాప్స్, సైట్స్ ఓపెన్ చేయకుండా సెట్టింగ్స్ మార్చాలి. అలాగే పిల్లలు వినియోగిస్తున్న ఫోన్​పై పేరెంట్స్ కచ్చితంగా దృష్టి పెట్టాలి. మొబైల్ అవసరం లేకుండా స్టడీ చేసేలా పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వాలి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget