ప్రధాని మోదీకి టీషర్ట్ గిఫ్ట్గా ఇచ్చిన బైడెన్, దానిపై ఇంట్రెస్టింగ్ కొటేషన్
Modi US Visit: ప్రధాని మోదీకి బైడెన్ ఓ స్పెషల్ టీషర్ట్ గిఫ్ట్గా ఇచ్చారు.
![ప్రధాని మోదీకి టీషర్ట్ గిఫ్ట్గా ఇచ్చిన బైడెన్, దానిపై ఇంట్రెస్టింగ్ కొటేషన్ US President Joe Biden gifts special T-shirt to PM Modi with quote on AI - America and India ప్రధాని మోదీకి టీషర్ట్ గిఫ్ట్గా ఇచ్చిన బైడెన్, దానిపై ఇంట్రెస్టింగ్ కొటేషన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/24/8c08595b2213f2fe7f9776cdb59f0d1a1687591451711517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi US Visit:
టీషర్ట్ గిఫ్ట్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. అమెరికా పర్యటన ముగిసిన సందర్భంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ T Shirtని మోదీకి అందజేశారు. హిస్టారికల్ ట్రిప్ అంటూ కితాబునిచ్చారు. ఆ టీషర్ట్పై AI అని రాసుంది. The Future is AI. America-India" అని ప్రింట్ చేసుంది. దీన్ని తీసుకున్న ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లలో భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు బైడెన్. ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు చేస్తూనే మోదీకి టీషర్ట్ని గిఫ్ట్గా ఇచ్చారు. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు.
"గత ఏడేళ్లలో భారత్ అమెరికా మధ్య మైత్రి బలపడింది. ద్వైపాక్షిక బంధాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక టెక్నాలజీ పరంగా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విస్తృతమవుతోంది. ఇదే సమయంలో మరో AI కూడా బలపడుతోంది. అదే అమెరికా-ఇండియా బంధం"
- ప్రధాని మోదీ
AI is the future, be it Artificial Intelligence or America-India! Our nations are stronger together, our planet is better when we work in collaboration. pic.twitter.com/wTEPJ5mcbo
— Narendra Modi (@narendramodi) June 23, 2023
#WATCH | US President Joe Biden gifted a special T-Shirt to PM Narendra Modi with the PM's quote on AI.
— ANI (@ANI) June 23, 2023
"In the past few years, there have been many advances in AI- Artificial Intelligence. At the same time, there has been even more momentous development in another AI-… pic.twitter.com/rx97EHZnMj
NRIలను ఉద్దేశిస్తూ స్పీచ్..
అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు. అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. తన మూడు రోజుల పర్యటనలో లభించిన ప్రేమాభిమానాలకు మీరే కారణం అంటూ కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను మోదీ వివరించారు. భారత్ అమెరికా మధ్య స్నేహ బంధంలో కొత్త ప్రయాణం మొదలైందన్నారు. రోనాల్డ్ రీగన్ సెంటర్కు వచ్చిన భారతీయులంతా ఆ ప్రాంతాన్ని మినీ భారత్లా మార్చేశారని ఆనందం వ్యక్తం చేశారు మోదీ. అందమైన చిత్రాన్ని చూపించిన వారికి ధన్యావాదాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి కూడా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం-యుఎస్ భాగస్వామ్యాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లడంలో ఆయనదే కీలక పాత్ర అన్నారు. రక్షణ ఒప్పందాలు భారత్, అమెరికా సుస్థిరం చేశాయన్నారు. మోదీ. మేం ఒప్పందాలు, అగ్రిమెంట్స్ మాత్రమే చేసుకోవడం లేదు. జీవితాలను, కలలను, లక్ష్యాలను మార్చబోతున్నామని వివరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)