అన్వేషించండి

CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Review Meeting | ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో మంత్రుల శాఖలు, వాటిని పనితీరు, పెండింగ్ ఫైళ్లపై సమావేశం నిర్వహించి అన్ని విషయాలు సమీక్షిస్తున్నారు.

Andhra Pradesh News | అమ‌రావ‌తి: ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియ‌రెన్సు ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలో మంగళవారం జ‌రిగిన మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా వివిధ శాఖ‌ల్లో  ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియ‌రెన్సు జ‌రుగుతున్న క్ర‌మం గురించి ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రేపటికి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 8 నెలలు పూర్తవుతోంది. మనపై విశ్వాసం ఉంచి, ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు. సాధారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏదో ఒక సవాలు ఉంటుంది. కానీ, అధికార మార్పిడి అనంతరం నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఏపీలో వైసీపీ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు కూటమికి ప్రజలు భారీ మెజార్టీతో అధికారమిచ్చారు.

గవర్నమెంట్ ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియ‌రెన్సులో వేగం పెర‌గాలి. ఫైళ్లు ఎక్క‌డ క్లియ‌ర్ కాకుండా ఆగిపోతున్నాయో దానిపైన కార్య‌ద‌ర్శులు, శాఖ‌ల విభాగాధిప‌తులు స‌మీక్ష చేసుకోవాలి. ఆల‌స్యానికి గ‌ల కార‌ణాలు తెలుసుకుని వాటిని తొల‌గించి ఫైళ్లు వెంటనే ప‌రిష్కారం చేయాల‌ని సూచించారు. ఫైళ్ల‌లో ఆర్థిక‌, ఆర్థికేత‌ర అనే రెండు ర‌కాల ఫైళ్లుంటాయి. ఆర్థికేత‌ర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి ప‌రిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండ‌కూడ‌ద‌ు. ఆర్థిక ప‌ర‌మైన ఫైళ్లు అయితే ఆయా శాఖ‌ల్లోని బ‌డ్జెట్ త‌దిత‌ర అంశాల‌ను పరిశీలించి ఆ ఫైళ్లను సాధ్యమైనంత త్వరగా స‌మీక్షించాలి. కొన్ని శాఖ‌ల్లో కొంత‌మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఆరు నెల‌లు, సంవ‌త్స‌రం వ‌ర‌కు త‌మ వ‌ద్ద ఫైళ్ల‌ను ఉంచుకుంటున్నార‌ని ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని చంద్రబాబు సూచించారు. కొన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో స‌గ‌టున 3 రోజుల్లోనే ఫైళ్లు క్లియ‌రెన్సు అవుతున్నాయ‌ని ఆర్టీజీఎస్ సీఈఓ సీఎం చంద్రబాబుకు తెలిపారు.  మ‌రికొన్ని శాఖ‌ల్లో ఫైళ్లు ఆల‌స్య అవుతున్నాయ‌ని, ఇకనుంచి త్వరగా ఫైళ్లు క్లియర్ చేయాలని మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

1. ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (PMG)
మౌలిక సదుపాయాలు, నిర్మాణ ప్రాజెక్టుల పరిష్కారం, వాటి ప్రస్తుత స్థితిని నిర్ధారించడంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (PMG) కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా ప్రాజెక్ట్ అమలును క్రమబద్ధీకరించడానికి వీలు కలుగుతుంది. PMG ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఇన్వెస్టర్లు ఎంట్రీ ఇచ్చి, తరువాత రెగ్యులర్ ట్రాకింగ్, సమస్య పరిష్కారం, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం వంటి  కీలక అంశాలపై ఇది పనిచేస్తుంది.

2. WhatsApp గవర్నెన్స్ - మన మిత్ర ఇనిషియేటివ్
జనవరి 30న ఏపీ ప్రభుత్వం అధికారికంగా 161 ప్రభుత్వ సేవల ప్రారంభ సెట్‌తో వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. దీని ద్వారా అదనపు సేవలను అందించడానికి ప్లాట్‌ఫామ్‌ను విస్తరించాలని చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సేవలను కూడా చేర్చాలని భక్తులు కోరుతున్నందున, దేవాదాయ నుంచి మరిన్ని సేవలను ఇందులో అందుబాటులోకి తేవాలని ఐటీ మంత్రి నారా లోకేష్ నొక్కి చెప్పారు. సర్టిఫికెట్లు, ప్రభుత్వ పత్రాలను గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లకుండా వాట్సాప్ లో అందిస్తున్నారు. APSRTC బస్ ట్రాకింగ్ ఫీచర్ ను అనుసంధానం చేయనున్నారు. సినిమా టికెట్లతో పాటు ఇతర సర్వీసులపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. సమర్థవంతమైన డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి తేవడంపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు.

Also Read: CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Amaravati capital of AP: జగన్ సీఎం అయితే రాజధానిని మార్చలేరా? - ఖచ్చితంగా మార్చవచ్చు.. ఇవే మార్గాలు!
జగన్ సీఎం అయితే రాజధానిని మార్చలేరా? - ఖచ్చితంగా మార్చవచ్చు.. ఇవే మార్గాలు!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget