అన్వేషించండి

NEET Controversy: నీట్‌ని రద్దు చేయాల్సిందే, తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

NEET Controversy 2024: నీట్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే నీట్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది.

Tamil Nadu Resolution Against NEET: నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న క్రమంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. NEET ఎగ్జామ్‌ని బ్యాన్ చేయాలని ఏకగ్రీవ తీర్మానం పాస్ చేసింది. అసెంబ్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. NEETని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. NEET ఎగ్జామ్‌ రాక ముంది 12వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్‌లు ఇచ్చే వాళ్లు. ఆ పాత పద్ధతినే కొనసాగించాల్సిన అవసరముందని స్టాలిన్ వెల్లడించారు. ప్రస్తుతానికి MBBS,BDS అడ్మిషన్‌లు కావాలంటే నీట్ ఎగ్జామ్ రాయడం తప్పనిసరి. కానీ తమిళనాడు మాత్రం ఈ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. అంతకు ముందు పుదుచ్చేరిలోనూ NEETని రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేసింది DMK.ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రపతి పరిధిలో ఉంది. తమిళనాడు ప్రభుత్వం మాత్రం తక్షణమే నీట్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. అధికార డీఎమ్‌కేతో పాటు పలు స్థానిక పార్టీలూ ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. ఇప్పటికే చాలా సార్లు DMK మంత్రులు నీట్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ కనిమొళి అయితే..నీట్ ఎగ్జామ్ నుంచి తమిళనాడును మినహాయించాలన్న వాదనా వినిపించారు. 

"నీట్ ఎగ్జామ్ మాకు అవసరం లేదని మేం చాలా రోజులుగా వాదిస్తూనే ఉన్నాం. ఇప్పుడు లీక్ వ్యవహారంతో ఆ ఎగ్జామ్‌లోని అవకతవకలు బయటపడ్డాయి. విద్యార్థులు ఈ పరీక్ష కారణంగా చాలా నష్టపోతున్నారు. అందుకే మేం దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో తీర్మానించాం. దానిపై రాష్ట్రపతి సంతకం చేయాల్సి ఉంది"

- కనిమొళి, డీఎమ్‌కే ఎంపీ

రాష్ట్రపతి ఈ తీర్మానంపై సంతకం పెట్టకుండా జాప్యం చేస్తే చాలా మంది విద్యార్థుల భవితవ్యం నాశనమైపోతుందని అన్నారు కనిమొళి. మే 5వ తేదీన NEET-UG 2024 Examination జరిగింది. దేశవ్యాప్తంగా 571 సిటీల్లో 4,750 సెంటర్స్‌లో ఈ పరీక్ష నిర్వహించారు. 23 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశాను. అయితే...ఫలితాలే అందరినీ షాక్‌కి గురి చేశాయి. 67 మందికి 720 కి 720 మార్కులు వచ్చాయి. దీనిపైనే విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తరవాత పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. అయితే...నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మార్పులు చేయాల్సిన అవసరముందన్న డిమాండ్ వినిపిస్తోంది. అటు పార్లమెంట్‌లోనూ ఈ వ్యవహారంపై చర్చ జరిగింది. తక్షణమే చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఫలితంగా కాసేపు సభలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్‌లో నీట్‌పై చర్చ జరగాల్సిన అవసరముందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మరి కొందరు విపక్షాల ఎంపీలూ ఇదే డిమాండ్ చేశారు. ఫలితంగా లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ కార్యకలాపాలు సజావుగా సాగలేదు. 

Also Read: NEET Issue: పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
AP, Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
AP, Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
IPL 2025 GT VS RR Result Update: టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
Andhra Pradesh Latest News: 1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Embed widget