అన్వేషించండి

NEET Issue: పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ

NEET Controversy: నీట్ వ్యవహారంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని లోక్‌సభలో విపక్షాల డిమాండ్ చేశాయి. ఫలితంగా ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది.

NEET Controversy 2024: నీట్ వ్యవహారం పార్లమెంట్‌ని కుదిపేస్తోంది. లోక్‌సభలో ఈ వివాదంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాసేపు సభలో గందరగోళం నెలకొంది. సభా వేదికగా మోదీ ప్రభుత్వం విద్యార్థులను ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తక్షణమే చర్చ జరగాలని పట్టుబట్టారు. అయితే...రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తరవాత చర్చిద్దామని స్పీకర్ ఓం బిర్లా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ...వెంటనే చర్చ జరగాల్సిందే అని విపక్షాలు తేల్చి చెప్పాయి. ఈ వివాదంపై చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. National Testing Agency (NTA) లోని వైఫల్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని విపక్షాలు చెబుతున్నాయి. ఇప్పటికే విపక్షాలు ఈ వ్యవహారంపై స్పీకర్‌కి 22 నోటీసులిచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విద్యార్థుల భవిష్యత్‌ ఏంటని ప్రశ్నించారు. ప్రశాంతంగా చర్చించాల్సిన అవసరముందని అన్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఈ వివాదం అలజడి సృష్టించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చర్చకు డిమాండ్ చేశారు. రాజ్యసభ కూడా వాయిదా పడుతూ వస్తోంది. 

"నీట్ వ్యవహారంపై చర్చ జరగాల్సిందే. ఇదే విషయాన్ని మేమంతా సమావేశమై నిర్ణయించుకున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి ఇదే నా విజ్ఞప్తి. దయచేసి ఈ వివాదంపై మాట్లాడాలి. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా సభా వేదికగా ఓ ప్రకటన చేయాల్సిన అవసరముంది. ప్రశాంతంగా చర్చ జరగాలి. మేమీ విషయంలో చాలా మర్యాదగానే వ్యవహరించాలని అనుకుంటున్నాం. అంతే గౌరవప్రదంగా ప్రభుత్వం చర్చిస్తే బాగుంటుంది. విద్యార్థులను ఉద్దేశించి పార్లమెంట్ నుంచి ఓ సందేశం ఇవ్వాల్సిన అవసరముంది"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

 రాహుల్‌తో పాటు మరి కొందరు ఎంపీలూ చర్చకు పట్టుబట్టారు. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పేపర్‌ లీక్‌ల కారణంగా దేశంలోని విద్యార్థుల భవిష్యత్‌ నాశనం అవుతోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి మాత్రం ఈ తప్పుల నుంచి దూరంగా పారిపోతున్నారని మండిపడ్డారు. అందుకే సభలో చర్చ జరిపాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై కచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. అయితే...ఈ వివాదంపై చర్చ జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. 

"ఈ వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా వద్ద ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది. కానీ సభా కార్యకలాపాలకు ఇలా అడ్డుతగలడం సరికాదు. కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకూడదు"

- కిరణ్ రిజిజు, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి 

Also Read: Hemant Soren: ఝార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కి ఊరట, ల్యాండ్ స్కామ్ కేసులో బెయిల్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Legend of Durga Bhabhi: విప్లవ వీరుల 'దుర్గా భాబీ'.. భగత్ సింగ్‌ను కాపాడిన వీరనారి దుర్గావతి గురించి తెలుసా..
విప్లవ వీరుల 'దుర్గా భాబీ'.. భగత్ సింగ్‌ను కాపాడిన వీరనారి దుర్గావతి గురించి తెలుసా..
Affordable Cars For Cab: క్యాబ్‌లో పెట్టడానికి అధిక మైలేజీ ఇచ్చే కార్లు ఇవే.. వీటిలో మీకు ఏది బెటర్
క్యాబ్‌లో పెట్టడానికి అధిక మైలేజీ ఇచ్చే కార్లు ఇవే.. వీటిలో మీకు ఏది బెటర్
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
This Week OTT Movies : శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
Embed widget