అన్వేషించండి

NEET Issue: పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ

NEET Controversy: నీట్ వ్యవహారంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని లోక్‌సభలో విపక్షాల డిమాండ్ చేశాయి. ఫలితంగా ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది.

NEET Controversy 2024: నీట్ వ్యవహారం పార్లమెంట్‌ని కుదిపేస్తోంది. లోక్‌సభలో ఈ వివాదంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాసేపు సభలో గందరగోళం నెలకొంది. సభా వేదికగా మోదీ ప్రభుత్వం విద్యార్థులను ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తక్షణమే చర్చ జరగాలని పట్టుబట్టారు. అయితే...రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తరవాత చర్చిద్దామని స్పీకర్ ఓం బిర్లా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ...వెంటనే చర్చ జరగాల్సిందే అని విపక్షాలు తేల్చి చెప్పాయి. ఈ వివాదంపై చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. National Testing Agency (NTA) లోని వైఫల్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని విపక్షాలు చెబుతున్నాయి. ఇప్పటికే విపక్షాలు ఈ వ్యవహారంపై స్పీకర్‌కి 22 నోటీసులిచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విద్యార్థుల భవిష్యత్‌ ఏంటని ప్రశ్నించారు. ప్రశాంతంగా చర్చించాల్సిన అవసరముందని అన్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఈ వివాదం అలజడి సృష్టించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చర్చకు డిమాండ్ చేశారు. రాజ్యసభ కూడా వాయిదా పడుతూ వస్తోంది. 

"నీట్ వ్యవహారంపై చర్చ జరగాల్సిందే. ఇదే విషయాన్ని మేమంతా సమావేశమై నిర్ణయించుకున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి ఇదే నా విజ్ఞప్తి. దయచేసి ఈ వివాదంపై మాట్లాడాలి. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా సభా వేదికగా ఓ ప్రకటన చేయాల్సిన అవసరముంది. ప్రశాంతంగా చర్చ జరగాలి. మేమీ విషయంలో చాలా మర్యాదగానే వ్యవహరించాలని అనుకుంటున్నాం. అంతే గౌరవప్రదంగా ప్రభుత్వం చర్చిస్తే బాగుంటుంది. విద్యార్థులను ఉద్దేశించి పార్లమెంట్ నుంచి ఓ సందేశం ఇవ్వాల్సిన అవసరముంది"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

 రాహుల్‌తో పాటు మరి కొందరు ఎంపీలూ చర్చకు పట్టుబట్టారు. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పేపర్‌ లీక్‌ల కారణంగా దేశంలోని విద్యార్థుల భవిష్యత్‌ నాశనం అవుతోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి మాత్రం ఈ తప్పుల నుంచి దూరంగా పారిపోతున్నారని మండిపడ్డారు. అందుకే సభలో చర్చ జరిపాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై కచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. అయితే...ఈ వివాదంపై చర్చ జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. 

"ఈ వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా వద్ద ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది. కానీ సభా కార్యకలాపాలకు ఇలా అడ్డుతగలడం సరికాదు. కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకూడదు"

- కిరణ్ రిజిజు, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి 

Also Read: Hemant Soren: ఝార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కి ఊరట, ల్యాండ్ స్కామ్ కేసులో బెయిల్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Lenin Movie : 'లెనిన్' సరసన వెన్నెలంటి మా 'భారతి' - భాగ్యశ్రీ క్యూట్ లుక్
'లెనిన్' సరసన వెన్నెలంటి మా 'భారతి' - భాగ్యశ్రీ క్యూట్ లుక్
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Embed widget