అన్వేషించండి

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ, ఏకగ్రీవ తీర్మానం చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

Rahul Gandhi: రాహుల్ గాంధీని లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది.

Rahul Gandhi as LoP: రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఏకగ్రీవంగా ఈ పదవికి రాహుల్‌ని ఎన్నుకుంటున్నట్టు ప్రకటించింది. పార్లమెంట్‌లో పార్టీని ఆయనే ముందుండి నడిపిస్తారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. 

"లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. పార్లమెంట్‌లో పార్టీని సరైన విధంగా నడిపే వ్యక్తి రాహుల్ మాత్రమే"

- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 

ఖర్గే ప్రకటిస్తారట..

కీలక నేతలంతా రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానించారని కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివ కుమార్ వెల్లడించారు. అయితే...అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ పేరుని ప్రకటిస్తారని స్పష్టం చేశారు. కీలక నేతలంతా రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానించారని కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివ కుమార్ వెల్లడించారు. అయితే... అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ పేరుని ప్రకటిస్తారని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌కి కొంత జోష్ వచ్చింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి 99 సీట్లు సాధించి ఉనికి నిలబెట్టుకుంది. లోక్‌సభలో రెండో అతి పెద్ద పార్టీగా నిలిచింది. 2014లో అధికారం కోల్పోయిన తరవాత మళ్లీ ఇన్నాళ్లకు కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా దక్కింది. 2014,2019లో కనీసం 10% సీట్‌లు కూడా రాబట్టుకోలేకపోవడం వల్ల ప్రతిపక్షంగా ఉండలేకపోయింది. 

బలం పెంచుకున్న కాంగ్రెస్..

ఇక బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 293 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. 2014 తరవాత మెజార్టీ లేకుండా మిత్రపక్షాలపై ఆధారపడి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇండీ కూటమిలో కాంగ్రెస్‌ అత్యధికంగా 99 స్థానాలు గెలుచుకుంది. మొత్తంగా ప్రతిపక్ష కూటమి 232 స్థానాల్లో విజయం సాధించింది. 2014 తరవాత ప్రతిపక్షాలు ఈ స్థాయిలో రాణించడం ఇదే తొలిసారి. మోదీ హవాలో ఈ సారి కూడా వీళ్లకి ఓటమి తప్పదు అనుకున్నా ఎవరూ ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి ఈ పార్టీలు. ముఖ్యంగా బీజేపీ కంచుకోటగా భావించిన యూపీలోనే దెబ్బ కొట్టాయి. అత్యధిక ఎంపీ స్థానాలు దక్కించుకుంది ఇండీ కూటమి. అటు మహారాష్ట్రలోనూ అదే జరిగింది. ఫలితంగా బీజేపీకి మెజార్టీ తగ్గిపోయింది. 240 స్థానాలకే పరిమితమైంది. అందుకే మిత్రపక్షాలతో కలిసి మెజార్టీ సాధించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 

Also Read: Modi Oath Taking Ceremony: అతిథి దేవోభవ, విభేదాలు పక్కన పెట్టి మాల్దీవ్స్ అధ్యక్షుడికి భారత్ ఘన స్వాగతం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Vanajeevi Ramaiah Passes Away: పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూత- అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూత- అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Highest Paid Directors: భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్... టాప్ 5లో నలుగురు మనోళ్ళే
భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్... టాప్ 5లో నలుగురు మనోళ్ళే
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Vanajeevi Ramaiah Passes Away: పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూత- అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూత- అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Highest Paid Directors: భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్... టాప్ 5లో నలుగురు మనోళ్ళే
భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్... టాప్ 5లో నలుగురు మనోళ్ళే
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
Telugu TV Movies Today: చిరంజీవి ‘శ్రీ మంజునాథ’, బాలయ్య ‘నరసింహా నాయుడు’ to ప్రభాస్ ‘సలార్’, అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 12) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘శ్రీ మంజునాథ’, బాలయ్య ‘నరసింహా నాయుడు’ to ప్రభాస్ ‘సలార్’, అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 12) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
Embed widget