అన్వేషించండి

KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

Telangana: హెచ్‌సీయూ భూముల్ని తనఖా పెట్టిన విషయంలో కేటీఆర్ సీరియస్ ఆరోపణలు చేశారు. బీజేపీకి చెందిన ఓ ఎంపీ సంస్థకు రూ. 170 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.

KTR made serious allegations:  కంచ గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూముల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా ఐసీఐసీఐ బ్యాంకుకు తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన ప్రెస్మీట్ పెట్టారు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు.  కంచ గచ్చిబౌలిలో  ఉన్న నాలుగు వందల ఎకరాలు అటవీ భూమేనని  సుప్రీంకోర్టు తీర్పు కూడా దాన్నే ధృవీకరించిందన్నారు. 400 ఎకరాలకు టీజీఐఐసీకి యజమాని కానే కాదని.. కానీ తమ తమది కాని భూమిని టీజీఐఐసీ తాకట్టు పెట్టిందన్నారు. అసలు భూములు లేకుండా రుణాలు తీసుకునే వారిని చూశాం కానీ.. ఇలా తనవి కాని భూముల్ని ప్రభుత్వం తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. 

400 ఎకరాల భూమి విలువ 5,239 కోట్లు అని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ చెప్పిందని కేటీఆర్చెప్పారు. కానీ  అదే భూమి విలువ  30 వేల కోట్లు అని రెవెన్యూ శాఖ చెప్పిందన్నారు. భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఆరోపించారు. తమది కాని భూమిని టీజీఐఐసీ ఎలా తాకట్టు పెట్టినా డ్తుందని ప్రశ్నించారు.ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా బ్యాంక్ లోన్ ఇచ్చిందన్నారు.  లిటికేషన్ భూమికి ఐసీఐసీఐ బ్యాంకు ఎలా లోన్ ఇచ్చిందని ప్రశ్నించారు. ఫీల్డ్ విజిట్ చేయకుండానే  బ్రోకరేజీ సంస్థ ఆధారంగా బ్యాంక్ ప్రభుత్వానికి రుణం ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు.  బీజేపీ ఎంపీ సారధ్యంలోనే బ్రోకరేట్‌ కంపెనీ తీసుకొచ్చారు. ఆ ఎంపీకి రేవంత్‌ అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెబుతానన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తున్నామని కేంద్రం, ఆర్బీఐ, సీబీఐ, సెబీ, ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

అప్పు సృష్టించి ఇప్పించినందుకు బ్రోకరేజ్‌ సంస్థగా  ‘ట్రస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ వ్యవహరించిందని కేటీఆర్ తెలిపారు.  ఈ  రాష్ట్ర ప్రభుత్వం  170 కోట్లు చెల్లించిందన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థికమంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం జరిగిందని..  కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటేనే సీవీసీ, సీబీఐ విచారణ జరపాలని కేటీఆర్  డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని..  ఒక బీజేపీ ఎంపీ సహకారంతో ఈ స్కామ్‌కు చేస్తున్నారని  ఆరోపించారు.   కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉన్నట్లే అని స్పష్టం చేశారు.  

తెలంగాణ ప్రభుత్వం మాత్రం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ  కి కేటాయించింది. ఆ భూములను టీజీఐఐసీ ద్వారా తాకట్టు పెట్టించి, 2024 డిసెంబర్‌లో రేవంత్‌ సర్కారు  10,000 కోట్ల అప్పు తెచ్చిందని చెబుతోంది. 

కంచ గచ్చిబౌలి వివాదంపై ఐసీఐసీఐ వివరణ
“మేం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కి (TSIIC) ఎటువంటి మార్టిగేజ్ రుణం అందించలేదు. అలాగే ఈ బాండ్ల జారీకి సంబంధించి టీఎస్ఐఐసీ మా వద్ద ఎలాంటి స్థలాన్ని మార్టిగేజి చేయలేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపునకు సంబంధించి టీఎస్ఐఐసీకి అకౌంటు బ్యాంకుగా మాత్రమే వ్యవహరించాము.” అని ఐసీఐసీఐ తమపై వచ్చిన ఆరోపణలపై కీలక ప్రకటన చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Dairy Farm Scheme: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
GHMC MeeSeva WhatsApp Number: అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
Pawan Kalyan Comments on Tamil Politics: అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం
అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
YSRCP committee restructuring: స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
Dairy Farm Scheme: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
Crime Thriller Series OTT : ట్రెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ - స్టేషన్‌లో కొత్త కానిస్టేబుల్ అనుకున్నారా?
ట్రెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ - స్టేషన్‌లో కొత్త కానిస్టేబుల్ అనుకున్నారా?
Dharamsala Pitch Report: ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
Car Battery Life: కారు బ్యాటరీ త్వరగా పాడవుతుందా? ఈ చిట్కాలతో బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు
కారు బ్యాటరీ త్వరగా పాడవుతుందా? ఈ చిట్కాలతో బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు
Pawan Kalyan on Nageshwar: జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
Embed widget