AP TG CMs Meeting: ముగిసిన సీఎంల భేటీ, విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీల ఏర్పాటుకు నిర్ణయం
Latest Telugu breaking News: ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. దీంతోపాటు ఏపీ, తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
LIVE

Background
'సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు' - భట్టి విక్రమార్క
AP And TG CMs Meeting: సీఎంల భేటీలో అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని.. పదేళ్లుగా పరిష్కారం కాని అంశాలపై చర్చించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలో సీఎస్, ముగ్గురు సభ్యులు ఉంటారని చెప్పారు. సమస్యలు త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించామని అన్నారు. కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో కమిటీ వేస్తామని వెల్లడించారు.
'ఆ 5 గ్రామాలు తెలంగాణకు ఇవ్వండి' - చంద్రబాబు ముందు రేవంత్ డిమాండ్!
AP And TG CMs Meeting: విభజన తర్వాత భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి.. చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, కన్నాయగూడెం పంచాయతీలను ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. అటు, హైదరాబాద్లోని కొన్ని భవనాలను ఏపీ ప్రభుత్వం అడగ్గా.. సీఎం రేవంత్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. కాగా, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు.
చంద్రబాబుకు రేవంత్ డిన్నర్
AP And TG CMs Meeting: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ ప్రజాభవన్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. చర్చల అనంతరం ఇరు రాష్ట్రాల నేతలు విందులో పాల్గొన్నారు. కాగా, భేటీ వివరాలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించనున్నారు.
ప్రజా భవన్ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు
రేవంత్ తో భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు డిన్నర్ చేశారు. డిన్నర్ అయ్యాక ఏపీ సీఎం చంద్రబాబు ప్రజా భవన్ నుంచి వెళ్లిపోయారు.
డిన్నర్ అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించనున్న భట్టి విక్రమార్క
ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్ లో పాల్గొన్న నేతలు, అధికారులు డిన్నర్ చేస్తున్నారు. డిన్నర్ అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

