అన్వేషించండి

Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు

Earthquake In Myanmar: వరుస భూకంపాలతో మయన్మార్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 13న ఉదయం మయన్మార్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది.

Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మయన్మార్ లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.

ఇటీవల 7కి పైగా తీవ్రతతో భారీ భూకంప సంభవించడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఆ భూకంపంలో 4 వేలకు పైగా మృతిచెందారు. వేలాది మంది గాయపడ్డారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల కింద నాలుగైదు రోజుల తరువాత సైతం కొందరు ప్రాణాలతో బయటపడ్డ వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి పలుచోట్ల భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కిచిక్కుమంటూ గడుపుతున్నారు.

మయన్మార్ ప్రజలకు పీడకల ఆ భూకంపం..

మార్చి 28న మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ భూకంపం తరువాత దాదాపు 100 సార్లకు పైగా మయన్మార్‌ వ్యాప్తంగా భూ ప్రకంపనలు సంభవించాయని ఆ దేశ వాతావరణ శాస్త్ర,  జల శాస్త్ర విభాగం అధికారులు తెలిపారు. కనిష్టంగా రిక్టర్ స్కేలుపై తీవ్రత 2.8 నుండి 7.5 వరకు తీవ్రతతో భూకంపాలు సంభవించాయని మయన్మార్ ప్రభుత్వం చెబుతోంది. సాగింగ్, మండలే, మాగ్వే లాంటి పట్టణాలలో 80 శాతానికి పైగా భవనాలు దెబ్బతిన్నాయి. ఇటీవల సంభవించిన భారీ భూకంపంలో 4 వేలకు పైగా మయన్మార్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడి ఆస్పత్రుల్లో, సహాయక శిబిరాలలో చికిత్స పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా 500,000 కంటే ఎక్కువ మంది ప్రజలు  ఆరోగ్య సంరక్షణ పొందలేకపోతున్నారని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం నివేదించింది. మయన్మార్ లో భారీ విపత్తు అనంతరం భారత్ సహాలు మరికొన్ని దేశాలు ఆ దేశానికి ఆపన్నహస్తం అందించాయి. వారికి ఆహారం, నీళ్లు, మెడికల్ కిట్లు లాంటివి పంపి సహాయం చేశారు.

మయన్మార్‌కు భారత్ ఆపన్నహస్తం.. ఆపరేషన్ బ్రహ్మతో సహకారం

భారతదేశం, యూరోపియన్ యూనియన్, అమెరికా, ఐక్యరాజ్యసమితి, అనేక అంతర్జాతీయ సంస్థలు మయన్మార్‌లో భూకంప బాధితుల కోసం సహాయం చేశాయి. రెస్క్యూ బృందాలను పంపుతూనే, మరోవైపు వారికి ఆహారం, నిత్యావసర సరుకులు పంపారు. భారతదేశం ఆపరేషన్ బ్రహ్మను చేపట్టి, భూకంప బాధితులకు సహాయం కొనసాగించింది. 'నైబర్‌హుడ్ ఫస్ట్', 'యాక్ట్ ఈస్ట్' విధానాలకు అనుగుణంగా మయన్మార్ కు ఆపన్నహస్తం అందించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. భారతదేశం మయన్మార్‌కు టన్నుల కొద్దీ మెడికల్ సామాగ్రి, ఆహారం, నీళ్లు, ఇతర సహాయ సామగ్రిని పంపి తమ వంతు సహకారం అందించింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

China : చైనాలో సంచలనం.. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష - అవినీతిపై చేశారనే !
చైనాలో సంచలనం.. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష - అవినీతిపై చేశారనే !
Aliens Latest News: గ్రహాంతరవాసులు ఉన్నారా? ఏలియన్ ఫైల్స్ విడుదల చేసిన ట్రంప్ ప్రభుత్వం.. సినీ నిర్మాతకు అనుమానాలు
గ్రహాంతరవాసులు ఉన్నారా? ఏలియన్ ఫైల్స్ విడుదల చేసిన ట్రంప్ ప్రభుత్వం.. సినీ నిర్మాతకు అనుమానాలు
Hantavirus: హంటా వైరస్ లెవల్ త్రీలోకి వచ్చేసింది - మళ్లీ మాస్కులు రెడీ చేసుకోవాల్సిందే!
హంటా వైరస్ లెవల్ త్రీలోకి వచ్చేసింది - మళ్లీ మాస్కులు రెడీ చేసుకోవాల్సిందే!
Donald Trump: ఇరాన్‌తో యుద్ధం వేళ డొనాల్డ్ ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. 10 శాతం టారిఫ్ రీఫండ్ చేయాలని కోర్టు తీర్పు
ఇరాన్‌తో యుద్ధం వేళ డొనాల్డ్ ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. 10 శాతం టారిఫ్ రీఫండ్ చేయాలని కోర్టు తీర్పు

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS LSG Result Update: సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Renault Mini Duster: 30 కి.మీ మైలేజ్‌తో వస్తున్న రెనాల్ట్ మినీ డస్టర్ Renault Bridger .. బెస్ట్ ఫీచర్లలో లాంచ్
30 కి.మీ మైలేజ్‌తో వస్తున్న రెనాల్ట్ మినీ డస్టర్ Renault Bridger .. బెస్ట్ ఫీచర్లలో లాంచ్
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
PM Narendra Modi: రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
Embed widget