అన్వేషించండి

Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?

Andhra Capital: అమరావతి పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో రెండో దశ భూసమీకరణకు రైతులు ఆక్తి చూపించడం లేదు. ప్రబుత్వం ఏం చేయబోతోంది?

Are Amaravati projects progressing as fast as expected: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణం ప్రస్తుతం కీలక దశలో ఉంది. 2024లో పనులు పునఃప్రారంభమైన తర్వాత దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పురోగతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అమరావతిలో ఐకానిక్ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టు మరియు సచివాలయ టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సాధారణ మౌలిక సదుపాయాల పనుల్లో జాప్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంక్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ లైన్ల వంటి పనులు అంచనా వేసిన దానికంటే నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో అమరావతి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయా  లేదా అన్న సందేహం ప్రారంభమయింది. ఇది రెండో విడత భూసమీకరణ మీద ప్రభావం చూపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

నెమ్మదిగా సాగుతున్న పనులు 

ప్రధాన కాంట్రాక్టు సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 10 నుండి 20 శాతం వరకు మాత్రమే భౌతిక పురోగతిని సాధించాయి. భారీ వర్షాలు, సాంకేతిక కారణాలు  ఈ మందగమనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల అభివృద్ధి విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొదటి విడతలో దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన ప్లాట్లు అందలేదు. ప్లాట్ల వద్ద రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం వంటి కనీస వసతులు లేకపోవడంతో ఆ ప్లాట్లు అమ్మకానికి గానీ, గృహ నిర్మాణాలకు గానీ అనుకూలంగా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 1,300 కోట్లు లేఅవుట్ల అభివృద్ధి కోసం కేటాయించినప్పటికీ, పనులు ఆశించిన వేగంతో జరగకపోవడం రైతుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

రెండో విడత భూసమీకరణపై నీలినీడలు

రాజధానిని మరో 16,000 నుండి 20,000 ఎకరాల మేర విస్తరించాలని ప్రభుత్వం రెండో విడత భూసమీకరణను ప్రారంభించింది. అయితే, మొదటి విడతలో భూములిచ్చిన రైతులకు కలిగిన ప్రయోజనంపై స్పష్టత లేకపోవడంతో, కొత్తగా భూములిచ్చేందుకు రైతులు వెనుకాడుతున్నారు. వైకుంఠపురం, పెదమద్దూరు వంటి గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నా, రైతుల నుంచి  స్పందన తక్కువగా ఉంది.  ముందు పాత పనులు పూర్తి చేయండి.. ఆ తర్వాతే కొత్త భూములు అడగండి అన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగానే రెండో విడత భూసమీకరణ ప్రక్రియ మందగించిందన్న ప్రచారం జరుగుతోంది.

పెట్టుబడుల ఆకర్షణలో సవాళ్లు

అమరావతిలో క్వాంటం వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి భారీ ప్రాజెక్టుల ప్రకటనలు ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం పెట్టుబడిదారులను ఆలోచనలో పడేస్తోంది. రాజధాని ప్రాంతంలో స్థిరాస్తి ధరలు పెరిగినప్పటికీ, వాస్తవంగా నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండిరూ. 15,000 కోట్ల వరకు నిధులు సమీకరించినప్పటికీ, ఆ నిధులను వేగంగా ఖర్చు చేసి పనులు పూర్తి చేయకపోతే ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉంది.  ప్రభుత్వం ప్రస్తుతం నిర్దేశించుకున్న 2027-28 లక్ష్యాలను చేరుకోవాలంటే కేవలం భవనాలపైనే కాకుండా, రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది నిర్మాణ సంస్థలపై పర్యవేక్షణ పెంచి, రెండో విడత భూసమీకరణకు వెళ్లే ముందే మొదటి విడత ఫలితాలను కళ్లముందు చూపాల్సిన అవసరం ఉంది. అప్పుడే రెండో విడతలో భూములుఇచ్చేందుకు రైతులు మరింత ఆసక్తి చూపే అవకాశం ఉంది.   

టాప్ హెడ్ లైన్స్

Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Embed widget