అన్వేషించండి

Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?

Andhra Capital: అమరావతి పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో రెండో దశ భూసమీకరణకు రైతులు ఆక్తి చూపించడం లేదు. ప్రబుత్వం ఏం చేయబోతోంది?

Are Amaravati projects progressing as fast as expected: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణం ప్రస్తుతం కీలక దశలో ఉంది. 2024లో పనులు పునఃప్రారంభమైన తర్వాత దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పురోగతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అమరావతిలో ఐకానిక్ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టు మరియు సచివాలయ టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సాధారణ మౌలిక సదుపాయాల పనుల్లో జాప్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంక్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ లైన్ల వంటి పనులు అంచనా వేసిన దానికంటే నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో అమరావతి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయా  లేదా అన్న సందేహం ప్రారంభమయింది. ఇది రెండో విడత భూసమీకరణ మీద ప్రభావం చూపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

నెమ్మదిగా సాగుతున్న పనులు 

ప్రధాన కాంట్రాక్టు సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 10 నుండి 20 శాతం వరకు మాత్రమే భౌతిక పురోగతిని సాధించాయి. భారీ వర్షాలు, సాంకేతిక కారణాలు  ఈ మందగమనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల అభివృద్ధి విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొదటి విడతలో దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన ప్లాట్లు అందలేదు. ప్లాట్ల వద్ద రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం వంటి కనీస వసతులు లేకపోవడంతో ఆ ప్లాట్లు అమ్మకానికి గానీ, గృహ నిర్మాణాలకు గానీ అనుకూలంగా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 1,300 కోట్లు లేఅవుట్ల అభివృద్ధి కోసం కేటాయించినప్పటికీ, పనులు ఆశించిన వేగంతో జరగకపోవడం రైతుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

రెండో విడత భూసమీకరణపై నీలినీడలు

రాజధానిని మరో 16,000 నుండి 20,000 ఎకరాల మేర విస్తరించాలని ప్రభుత్వం రెండో విడత భూసమీకరణను ప్రారంభించింది. అయితే, మొదటి విడతలో భూములిచ్చిన రైతులకు కలిగిన ప్రయోజనంపై స్పష్టత లేకపోవడంతో, కొత్తగా భూములిచ్చేందుకు రైతులు వెనుకాడుతున్నారు. వైకుంఠపురం, పెదమద్దూరు వంటి గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నా, రైతుల నుంచి  స్పందన తక్కువగా ఉంది.  ముందు పాత పనులు పూర్తి చేయండి.. ఆ తర్వాతే కొత్త భూములు అడగండి అన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగానే రెండో విడత భూసమీకరణ ప్రక్రియ మందగించిందన్న ప్రచారం జరుగుతోంది.

పెట్టుబడుల ఆకర్షణలో సవాళ్లు

అమరావతిలో క్వాంటం వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి భారీ ప్రాజెక్టుల ప్రకటనలు ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం పెట్టుబడిదారులను ఆలోచనలో పడేస్తోంది. రాజధాని ప్రాంతంలో స్థిరాస్తి ధరలు పెరిగినప్పటికీ, వాస్తవంగా నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండిరూ. 15,000 కోట్ల వరకు నిధులు సమీకరించినప్పటికీ, ఆ నిధులను వేగంగా ఖర్చు చేసి పనులు పూర్తి చేయకపోతే ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉంది.  ప్రభుత్వం ప్రస్తుతం నిర్దేశించుకున్న 2027-28 లక్ష్యాలను చేరుకోవాలంటే కేవలం భవనాలపైనే కాకుండా, రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది నిర్మాణ సంస్థలపై పర్యవేక్షణ పెంచి, రెండో విడత భూసమీకరణకు వెళ్లే ముందే మొదటి విడత ఫలితాలను కళ్లముందు చూపాల్సిన అవసరం ఉంది. అప్పుడే రెండో విడతలో భూములుఇచ్చేందుకు రైతులు మరింత ఆసక్తి చూపే అవకాశం ఉంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
Advertisement

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
Fatty Liver : కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Embed widget