అన్వేషించండి

Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?

Andhra Capital: అమరావతి పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో రెండో దశ భూసమీకరణకు రైతులు ఆక్తి చూపించడం లేదు. ప్రబుత్వం ఏం చేయబోతోంది?

Are Amaravati projects progressing as fast as expected: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణం ప్రస్తుతం కీలక దశలో ఉంది. 2024లో పనులు పునఃప్రారంభమైన తర్వాత దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పురోగతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అమరావతిలో ఐకానిక్ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టు మరియు సచివాలయ టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సాధారణ మౌలిక సదుపాయాల పనుల్లో జాప్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంక్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ లైన్ల వంటి పనులు అంచనా వేసిన దానికంటే నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో అమరావతి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయా  లేదా అన్న సందేహం ప్రారంభమయింది. ఇది రెండో విడత భూసమీకరణ మీద ప్రభావం చూపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

నెమ్మదిగా సాగుతున్న పనులు 

ప్రధాన కాంట్రాక్టు సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 10 నుండి 20 శాతం వరకు మాత్రమే భౌతిక పురోగతిని సాధించాయి. భారీ వర్షాలు, సాంకేతిక కారణాలు  ఈ మందగమనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల అభివృద్ధి విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొదటి విడతలో దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన ప్లాట్లు అందలేదు. ప్లాట్ల వద్ద రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం వంటి కనీస వసతులు లేకపోవడంతో ఆ ప్లాట్లు అమ్మకానికి గానీ, గృహ నిర్మాణాలకు గానీ అనుకూలంగా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 1,300 కోట్లు లేఅవుట్ల అభివృద్ధి కోసం కేటాయించినప్పటికీ, పనులు ఆశించిన వేగంతో జరగకపోవడం రైతుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

రెండో విడత భూసమీకరణపై నీలినీడలు

రాజధానిని మరో 16,000 నుండి 20,000 ఎకరాల మేర విస్తరించాలని ప్రభుత్వం రెండో విడత భూసమీకరణను ప్రారంభించింది. అయితే, మొదటి విడతలో భూములిచ్చిన రైతులకు కలిగిన ప్రయోజనంపై స్పష్టత లేకపోవడంతో, కొత్తగా భూములిచ్చేందుకు రైతులు వెనుకాడుతున్నారు. వైకుంఠపురం, పెదమద్దూరు వంటి గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నా, రైతుల నుంచి  స్పందన తక్కువగా ఉంది.  ముందు పాత పనులు పూర్తి చేయండి.. ఆ తర్వాతే కొత్త భూములు అడగండి అన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగానే రెండో విడత భూసమీకరణ ప్రక్రియ మందగించిందన్న ప్రచారం జరుగుతోంది.

పెట్టుబడుల ఆకర్షణలో సవాళ్లు

అమరావతిలో క్వాంటం వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి భారీ ప్రాజెక్టుల ప్రకటనలు ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం పెట్టుబడిదారులను ఆలోచనలో పడేస్తోంది. రాజధాని ప్రాంతంలో స్థిరాస్తి ధరలు పెరిగినప్పటికీ, వాస్తవంగా నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండిరూ. 15,000 కోట్ల వరకు నిధులు సమీకరించినప్పటికీ, ఆ నిధులను వేగంగా ఖర్చు చేసి పనులు పూర్తి చేయకపోతే ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉంది.  ప్రభుత్వం ప్రస్తుతం నిర్దేశించుకున్న 2027-28 లక్ష్యాలను చేరుకోవాలంటే కేవలం భవనాలపైనే కాకుండా, రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది నిర్మాణ సంస్థలపై పర్యవేక్షణ పెంచి, రెండో విడత భూసమీకరణకు వెళ్లే ముందే మొదటి విడత ఫలితాలను కళ్లముందు చూపాల్సిన అవసరం ఉంది. అప్పుడే రెండో విడతలో భూములుఇచ్చేందుకు రైతులు మరింత ఆసక్తి చూపే అవకాశం ఉంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Chandrababu Speech: టీడీపీ కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు, ఎవ్వరికీ తలొగ్గరు: పార్టీ అధినేత చంద్రబాబు
టీడీపీ కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు, ఎవ్వరికీ తలొగ్గరు: పార్టీ అధినేత చంద్రబాబు
Amaravati Latest News:ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !
ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !
Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
Advertisement

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
Risks of Vaping : వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే
వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే
Vehicle Maintenance Guide: మీ కారు ఈ సంకేతాలు ఇస్తోందా? బ్రేక్ ప్యాడ్స్ నుండి బ్యాటరీ దాకా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
మీ కారు ఈ సంకేతాలు ఇస్తోందా? బ్రేక్ ప్యాడ్స్ నుండి బ్యాటరీ దాకా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
US Iran War: ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
Embed widget