అన్వేషించండి

Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?

Andhra Capital: అమరావతి పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో రెండో దశ భూసమీకరణకు రైతులు ఆక్తి చూపించడం లేదు. ప్రబుత్వం ఏం చేయబోతోంది?

Are Amaravati projects progressing as fast as expected: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణం ప్రస్తుతం కీలక దశలో ఉంది. 2024లో పనులు పునఃప్రారంభమైన తర్వాత దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పురోగతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అమరావతిలో ఐకానిక్ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టు మరియు సచివాలయ టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సాధారణ మౌలిక సదుపాయాల పనుల్లో జాప్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంక్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ లైన్ల వంటి పనులు అంచనా వేసిన దానికంటే నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో అమరావతి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయా  లేదా అన్న సందేహం ప్రారంభమయింది. ఇది రెండో విడత భూసమీకరణ మీద ప్రభావం చూపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

నెమ్మదిగా సాగుతున్న పనులు 

ప్రధాన కాంట్రాక్టు సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 10 నుండి 20 శాతం వరకు మాత్రమే భౌతిక పురోగతిని సాధించాయి. భారీ వర్షాలు, సాంకేతిక కారణాలు  ఈ మందగమనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల అభివృద్ధి విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొదటి విడతలో దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన ప్లాట్లు అందలేదు. ప్లాట్ల వద్ద రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం వంటి కనీస వసతులు లేకపోవడంతో ఆ ప్లాట్లు అమ్మకానికి గానీ, గృహ నిర్మాణాలకు గానీ అనుకూలంగా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 1,300 కోట్లు లేఅవుట్ల అభివృద్ధి కోసం కేటాయించినప్పటికీ, పనులు ఆశించిన వేగంతో జరగకపోవడం రైతుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

రెండో విడత భూసమీకరణపై నీలినీడలు

రాజధానిని మరో 16,000 నుండి 20,000 ఎకరాల మేర విస్తరించాలని ప్రభుత్వం రెండో విడత భూసమీకరణను ప్రారంభించింది. అయితే, మొదటి విడతలో భూములిచ్చిన రైతులకు కలిగిన ప్రయోజనంపై స్పష్టత లేకపోవడంతో, కొత్తగా భూములిచ్చేందుకు రైతులు వెనుకాడుతున్నారు. వైకుంఠపురం, పెదమద్దూరు వంటి గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నా, రైతుల నుంచి  స్పందన తక్కువగా ఉంది.  ముందు పాత పనులు పూర్తి చేయండి.. ఆ తర్వాతే కొత్త భూములు అడగండి అన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగానే రెండో విడత భూసమీకరణ ప్రక్రియ మందగించిందన్న ప్రచారం జరుగుతోంది.

పెట్టుబడుల ఆకర్షణలో సవాళ్లు

అమరావతిలో క్వాంటం వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి భారీ ప్రాజెక్టుల ప్రకటనలు ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం పెట్టుబడిదారులను ఆలోచనలో పడేస్తోంది. రాజధాని ప్రాంతంలో స్థిరాస్తి ధరలు పెరిగినప్పటికీ, వాస్తవంగా నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండిరూ. 15,000 కోట్ల వరకు నిధులు సమీకరించినప్పటికీ, ఆ నిధులను వేగంగా ఖర్చు చేసి పనులు పూర్తి చేయకపోతే ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉంది.  ప్రభుత్వం ప్రస్తుతం నిర్దేశించుకున్న 2027-28 లక్ష్యాలను చేరుకోవాలంటే కేవలం భవనాలపైనే కాకుండా, రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది నిర్మాణ సంస్థలపై పర్యవేక్షణ పెంచి, రెండో విడత భూసమీకరణకు వెళ్లే ముందే మొదటి విడత ఫలితాలను కళ్లముందు చూపాల్సిన అవసరం ఉంది. అప్పుడే రెండో విడతలో భూములుఇచ్చేందుకు రైతులు మరింత ఆసక్తి చూపే అవకాశం ఉంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
YS Jagan: మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
Chandrababu Amaravati Review: అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Advertisement

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: హైకోర్టు కీలక ఆదేశాలు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: హైకోర్టు కీలక ఆదేశాలు
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Chandrababu Amaravati Review: అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ మాత్రం వెయిటింగ్
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ వెయిటింగ్
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Embed widget