అన్వేషించండి

ABV VS YSRCP: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ వయా కోడికత్తి కేసు - రాజకీయం మారుతోందిగా !

Andhra Politics: ఏబీ వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్‌సీపీ సవాళ్లు విసురుకుంటున్నారు. కోడికత్తి కేసు కేంద్రంగా ఈ రాజకీయం జరుగుతోంది.

Jagan Kodikatti Case:  2019 ఎన్నికలకు ముందు  విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన   కోడికత్తి దాడి కేసుపై కొత్త  రాజకీయం ప్రారంభమయింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం అమలాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కోడికత్తి శీను కుటుంబాన్ని పరామర్శించారు. శీను తప్పు చేసి ఉండవచ్చు కానీ.. జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్ల ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోయిందన్నారు. 

ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీకి చెందిన పత్రికలో  ఓ కథనం వచ్చింది. జగన్ కోడికత్తి శీను దాడి చేసినప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఏబీవీనే ఉన్నారు. జగన్ పై కోడికత్తి దాడి వెనుక ఆయన ఉన్నారని ఇదే సాక్ష్యమని..  ఆరోపించింది. వైసీపీ నేత  గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా అదే  ప్రకటన చేశారు.  వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు సోషల్ మీడియాలో స్పందించారు. జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసు గురించి, శీనుకు జరిగిన అన్యాయం గురించి, విచారణ గురించి మొత్తం చర్చించడానికి తాను రెడీ అయినా.. అది సాక్షి టీవీలో అయినా సరే సిద్ధమని ప్రకటించారు. 

జగన్  పై కోడికత్తితో జనపల్లి శ్రీనివాసరావు దాడి చేసినప్పుడు కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే అప్పట్లో పోలీసులపై నమ్మకం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని జగన్ , వైసీపీ తరపున హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే కేంద్రం తాము నేషనల్ ఇన్వెస్టిగేషన్  ఏజెన్సీ తో దర్యాప్తు చేయిస్తామని తెలిపింది. దాంతో కేసు ఏపీ పోలీసుల నుంచి ఎన్ఐఏకు బదిలీ అయింది. ఎన్ఐఏ సహజంగా.. జాతీయ భద్రతతో సంబంధం ఉన్న కీలక కేసుల్నే చూస్తూంది. ప్రస్తుతం మోస్ట్  వాంటెడ్ టెర్రరిస్టు తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి తీసుకు వచ్చేలా  ఏళ్ల తరబడి ప్రయత్నించి సక్సెస్ అయిన ఇప్పుడు ప్రశ్నిస్తోంది. అలాంటి ఎన్ఐఏ.. జగన్ పై దాడి కేసును సమగ్రంగా పరిశోధించింది. 

కోడికత్తి శీను దాడి చేయడానికి ఎవరూ పురికొల్పలేదని తేల్చారు. అయితే ఎనఐఏ లాంటి దిగ్గజ సంస్థ దర్యాప్తులో నిజాలు తేలలేదని వైఎస్ఆర్‌సీపీఆరోపిస్తోంది. జగన్ బాధితుడిగా సాక్ష్యం చెప్పడానికి కూడా కోర్టుకు హాజరు కావడం లేదు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లకుపైగా జనపల్లి శ్రీనివాసరావు జైలుకే పరిమితమయ్యారు.  జగన్ వీరాభిమాని అయిన జనపల్లి శీను జగన్ కు భారీ మెజార్టీ రావడానికి.. సానుభూతి వచ్చేలా దాడి చేశానని చెబుతూ వస్తున్నారు. కానీ ఆయనపై వైసీపీ నేతలకు మాత్రం అభిమానం లేదు. ఆయన టీడీపీ కుట్ర కారణంగా దాడి చేశారని నమ్ముతున్నారు.       

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport Inauguration: ఉత్తరాంధ్ర మకుటాయమానం భోగాపురం - జూలై 5న పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం -ఉత్తరాంధ్ర జాతకాన్ని మార్చబోతున్న మెగా ఎయిర్‌పోర్ట్!
ఉత్తరాంధ్ర మకుటాయమానం భోగాపురం - జూలై 5న పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం -ఉత్తరాంధ్ర జాతకాన్ని మార్చబోతున్న మెగా ఎయిర్‌పోర్ట్!
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Embed widget