అన్వేషించండి

Namrata: అభిమానులకు చేతులెత్తి మొక్కిన మహేష్ బాబు - నమ్రతా ఆసక్తికర కామెంట్స్

Namrata: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో అట్టహాసంగా జరిగింది.

Namrata Shirodkar Thanks To Mahesh Babu Fans:  మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా నిర్వహించారు. చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొని సందడి చేసింది. మహేష్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

మహేష్ అభిమానులకు నమ్రత కృతజ్ఞతలు

ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ బాబు, అభిమానులపై తన ప్రేమను బయటపెట్టుకున్నారు. అభిమానులే తనకు అన్నీ అన్నారు. “పాతికేళ్ల నా సినీ కెరీర్ లో మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఏటా ఆ అభిమానం పెరుగుతూనే ఉంది. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేను. సంక్రాంతి మాకు కలిసి వచ్చిన పండగ. ఈ పండగకు సినిమా విడుదల అయ్యిందంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతుంది. మా నాన్న లేరు. అమ్మ లేరు. ఇప్పటి నుంచి మీరే నాకు అమ్మ, నాన్న.. అన్నీ. మీ ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.  ఈ సందర్భంగా అభిమానులందరికీ చేతులు పైకెత్తి దండం పెట్టారు. మహేష్ బాబుకు ఫ్యాన్స్ కూడా తిరిగి ఆయన మాదిరిగానే దండం పెట్టారు. ఈ ఫోటోలను మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఫ్యాన్స్ అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. మున్ముందు రాబోయే వాటికి ఇది ప్రారంభం మాత్రమేనని తెలిపారు. గుంటూరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరి ప్రేమకు కృజ్ఞతలు తెలిపారు. ఈ ప్రేమ, అభిమానం ఇలాగే ఉండాలని ఆమె కోరకున్నారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

టార్గెట్ హ్యాట్రిక్ హిట్!

ఇక ఇప్పటికే 'అతడు', 'ఖలేజా' సినిమాతో మంచి విజయాలను అందుకున్న మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పుడు 'గుంటూరు కారం' విడుదల కాబోతోంది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో ఎప్పులేని రీతిలో మహేష్ ను త్రివిక్రమ్ ఈ సినిమా చూపించబోతున్నారు.ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మించగా, తమన్‌ తన మార్క్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేయబోతున్నారు. 

Read Also: OMG 2ను సెన్సార్ బోర్డు చంపేసింది, ఆర్థికంగా దెబ్బకొట్టింది, దర్శకుడు అమిత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget