అన్వేషించండి

Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణంలో కీలక పరిణామం, హైదరాబాద్ ORRను మించేలా మాస్టర్ ప్లాన్

Amaravati ORR | అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ను మించేలా అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి ప్లాన్ చేశారు.

Amaravati Outer Ring Road News | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు (Amaravati ORR) నిర్మాణం దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి ఓఆర్‌ఆర్‌ భూసేకరణకు సంబంధించి 5 జిల్లాలకు ఐదుగురు జాయింట్ కలెక్టర్లను అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పల్నాడు, గుంటూరు, ఏలూరు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని 23 మండలాల్లో, 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణం జరగనుంది. ఏపీ ప్రభుత్వం 189.9 కిలోమీటర్ల పొడవున ఈ ఓఆర్ఆర్ కు శ్రీకారం చుట్టింది. కాగా, హైదరాబాద్ ఓఆర్ఆర్ పొడవు 158 కిలోమీటర్లు అని తెలిసిందే.

3 ఎలైన్‌మెంట్లను తయారు చేసిన NHAI

ప్రస్తుతం ఉన్న కోల్‌కతా- చెన్నై నేషనల్ హైవే నుంచి అమరావతి ఓఆర్‌ఆర్‌కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు లింక్ రోడ్లు నిర్మించనున్నారు. ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ 189.9 కి.మీ. ఓఆర్‌ఆర్‌కు ఇటీవల ఆమోదం తెలపగా.. విజయవాడ తూర్పు బైపాస్‌ నిర్మాణం అక్కర్లేదని స్పష్టం చేసింది. అందుకు ప్రత్యామ్నాయంగా 2 లింక్‌ రోడ్ల నిర్మాణం చేసుకోవాలని సూచించింది.  హైదరాబాద్‌లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్‌ఆర్‌ (Hyderabad Outer Ring Road)కి లింకు చేసినట్లుగా చెన్నై- కోల్‌కతా నేషనల్ హైవేలో విజయవాడ బైపాస్‌ కోసం కాజ నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర 6 లేన్ల లింక్ రోడ్డు నిర్మించనున్నారు. ఇందుకోసం ఎన్‌హెచ్‌ఏఐ 3 ఎలైన్‌మెంట్లను తయారు చేసి ఏపీ ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్‌ మార్గంలో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ORR వరకు 4 లేన్ల రహదారిని అభివృద్ధి చేయడానికిగానూ 3 ఎలైన్‌మెంట్లు సైతం సిద్ధం చేశారు.

ఓఆర్‌ఆర్‌ భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్లు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నుంచి వెళ్లిన అమరావతి ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులుచేర్పులు, లింక్‌రోడ్ల ఎలైన్‌మెంట్‌ల ప్రపోజల్ కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. అనంతరం ప్రతిపాదిత అలైన్‌మైంట్ వివరాలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపి తుది ఆమోదం పొందాల్సి ఉంటుంది. అమరావతి ఓఆర్‌ఆర్‌ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్‌ జారీ కానున్నాయి. మూడు వారాల గడువుతో అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారితో సమావేశమై వారి సమస్య విని.. వాటిని జేసీ, ఎన్‌హెచ్‌ఏఐ స్థాయిలో చర్చించి పరిష్కారం చూపుతారు.

మరోవైపు జాయింట్‌ మెజర్‌మెంట్‌ సర్వే చేసి, పెగ్‌ మార్కింగ్‌ వేయాలి. అభ్యంతరాలు పరిష్కారమైతే త్రీడీ నోటిఫికేషన్‌ (3D Notification) జారీ చేస్తారు. దాంతో అందులో పేర్కొన్న సర్వే నంబర్లలో ఉన్న భూములు కేంద్రం అధీనంలోకి వెళ్తుంది. తర్వాత 3జి3 నోటిఫికేషన్‌ జారీతో పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీ చేయనున్నారు. ఎవరి పేరిట ఎంత భూమి ఉంది, ఏ నిర్మాణాలున్నాయి అనేది అందులో పేర్కొంటారు. చివరగా భూసేకరణ నిధుల కోసం పూర్తి వివరాలు ఎన్‌హెచ్‌ఏఐకి పంపి.. నగదు రాగానే భూ యజమానులకు చెల్లిస్తారు. దాంతో భూములను ఆధీనంలోకి తీసుకొని, ఎన్‌హెచ్‌ఏఐ పేరిట మ్యుటేషన్‌ చేయనున్నారు. మరోవైపు డీపీఆర్‌ సిద్ధం చేస్తూ, ఇతరత్రా పనులకు అనుమతులను సంబంధిత ఇంజినీర్లు తీసుకుంటారు.

Also Read: Pawan Kalyan Health News: అపోలో హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్, బెడ్ మీద డిప్యూటీ సీఎం ఫొటోలు వైరల్- అసలేం జరిగింది

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget