అన్వేషించండి

How To Live Longer: మరణాన్ని జయించడం ఎలా ? ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ మాటల్లోనే..

మనిషి మరణాన్ని జయించడం సాధ్యమేనా? ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి అనే విషయాలపై నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.

ABP Network Ideas Of India 2025 | ఎన్నో ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్న ఒకటి ఉంది. వందల సంవత్సరాలుగా ఆ విషయంలో విజయం సాధించేందుకు కృషి చేస్తున్నా సక్సెస్ సాధించలేకపోతున్నారు. కానీ సృష్టి రహస్యాలలో అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అదేందంటే.. మనుషులు ఎందుకు చనిపోతారు ? వృద్ధాప్యాన్ని జయించడం సాధ్యం కాదా? మరణాన్ని జయించడం ఎలా...? అనే అంశంపై నోబెల్ బహుమతి గ్రహీత, రాయల్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకీ రామకృష్ణన్ (Venki Ramakrishnan) కీలక విషయాలు తెలిపారు. ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 (Ideas Of India)లో 'ది సైన్స్ ఆఫ్ ఏజింగ్' సెషన్‌లో పాల్గొని సైంటిస్ట్ వెంకీ రామకృష్ణన్  ఎన్నో విలువైన విషయాలు షేర్ చేసుకున్నారు.

మనిషి జీవితకాలం 110- 112 ఏళ్లు

మరణాన్ని జయించడంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎక్కువ కాలం జీవించడం ఎలా అనే అంశాలు తెలిపారు. అది కూడా జీవితాంతం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నోబెల్ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త సూచించారు. వెంకీ రామకృష్ణన్ మాట్లాడుతూ.. సాధారణంగా మానవుల జీవితకాలం 110- 112 ఏళ్లు కాగా, కొన్నేళ్లుగా శతాధిక వయస్సు గల వారి సంఖ్య క్రమంగా పెరగుతోంది. "శతాధిక వయసు వారంటే.. 100 అంతకంటే ఎక్కువ కాలం జీవించడం. గత కొన్నేళ్లుగా వందేళ్లు పైగా జీవించిన వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కోట్ల  మంది ఎనభై ఏళ్లకు చేరుకుంటున్నారు. వారిలో చాలా మంది మరింత కాలం జీవించే అవకాశం ఉంది. 

యాంటీ ఏజింగ్ కోసం భారీగా పెట్టుబడులు

కానీ 110 ఏళ్లకు మించి జీవిస్తున్న వారి సంఖ్య పెరగడం లేదు. అది శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతోంది. జీవశాస్త్రంలో అది సహజ ప్రక్రియ. అయితే ఆరోగ్యంగా వృద్ధాప్యానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతం జన్యువుల్లో వస్తున్న మార్పులు, మనుషుల అలవాట్లు లాంటివి వృద్ధ్యాప్యంపై ప్రభావం చూపుతాయి. ఏళ్లు గడిచేకొద్దీ అవయవాల పనితీరు మందగిస్తుంది. గత 10 ఏళ్లలో వృద్ధాప్యానికి సంబంధించి 3 లక్షలకు రీసెర్చ్ పేపర్లు పుట్టుకొచ్చాయి. యాంటీ ఏజింగ్ ( వృద్ధాప్యం రాకుండా) చూసేందుకు చేస్తున్న పరిశోధనల కోసం 700 సంస్థలు భారీగా ఇస్వెస్ట్ చేశాయని’ వెంకీ రామకృష్ణన్ వెల్లడించారు. 

ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రీసెర్చ్ కంటే కొన్ని ఆరోగ్య అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవితం దోహదం చేస్తుందని కొన్ని చిట్కాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ స్నేహితుల్ని కలిగి ఉండాలి. అందరితో కలుపుగోలుగా ఉండటం ముఖ్యం. ఒంటరిగా ఉండటం, ఒంటరితనంగా ఫీలవడం చేయకూడదు. ఏదో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండి, దాని కోసం తపించే వారు.. ఎలాంటి గోల్స్ లేని వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని సైంటిస్ట్ వెంకీ రామకృష్ణన్ పేర్కొన్నారు. హెల్తీ ఫుడ్ తీసుకోవడంతో పాటు కంటి నిండా నిద్ర, ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయాలని సూచించారు. ఇలాంటి ఆరోగ్య చిట్రాలు నిరంతరం పాటించడం ద్వారా ఒత్తిడి దూరమై ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

Also Read: Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget