అన్వేషించండి

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?

Microsoft: ఏపీ రాజధాని అమరావతి దగ్గరలో మైక్రోసాఫ్ట్ భూమిని కొనుగోలు చేసింది.దీంతో ఏపీలో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టబోతోందన్న ప్రచారం జరుగుతోంది.

Microsoft India buys 25-acre land parcel near Amaravati : ప్రపంచ దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి దగ్గరలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా ప్రాప్‌స్టాక్ తెలిపింది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మైక్రోసాఫ్ట్ సంస్థ నందిగామ వద్ద పాతిక ఎకరాల భూమిని రూ. 181 కోట్లుపెట్టి కొనుగోలు చేసినట్లుగా జాతీయ మీడియా చెబుతోంది. నందిగామ అమరావతి నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నాట్కో ఫార్మా, టైమ్ క్యాప్ ఫార్మా అనే  కంపెనీలకు భూమి ఉంది. వారి వద్ద నుంచి మైక్రోసాఫ్ట్ భూమి కొనుగోలు చేసినట్లుగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆదారంగా పాప్ స్టాక్ తెలిపింది. 

నందిగామ వద్ద  గత సెప్టెంబర్‌లోనే భూమి కొన్న మైక్రోసాఫ్ట్ ఇండియా               

మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటి వరకూ ఏపీలో పెట్టుబడులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కనీసం ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మైక్రోసాఫ్ట్ సంస్థ అడిగితే ప్రభుత్వమే అమరావతి లేదా విశాఖపట్నంలో భూమి ఇస్తుంది.. తమ ఆఫీసును ఏర్పాటు చేయడానికి రాయితీలు కూడా  ఇస్తుంది. కానీ గత సెప్టెంబర్‌లోనే మైక్రోసాఫ్ట్ సైలెంట్ గా భూమి కొనుగోలు చేసిందన్న విషయం బయటకు వచ్చిది. ఆ స్థలం కొనుగోలు చేయడంలో మైక్రోసాఫ్ట్ వ్యూహం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆ స్థలంలో మైక్రోసాఫ్ట్ ఎలాంటి ఆఫీసులు పెట్టాలనుకుంటోందో కూడా ఎవరికీ తెలియదు.   

Also Read:  ఏపీ యువతకు గూగుల్ నైపుణ్య శిక్షణ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం

విపరీతంగా పలు చోట్ల భూముల్ని కొంటున్న మైక్రో సాఫ్ట్                

అయితే మైక్రో సాఫ్ట్ వ్యూహాత్మకంగా డిమాండ్ పెరుగుతుందని అనుకున్న చోట్ల భూముల్ని కొనుగోలు చేస్తోందని ప్రాప్ స్టాక్ చెబుతోంది. గత రెండేళ్లుగా పలు చోట్ల భూములు కొనుగోలు చేసింది. పుణె లో వెయ్యి కోట్లు పెట్టి 30 ఎకరాలను గత ఏడాది కొనుగోలు చేసింది. గత ఆగస్టులో మరో పదహారు ఎకరాలను రూ. 453 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లుగా స్క్వేర్ యార్డ్స్ సంస్థ తెలిపింది. 2022లో పుణెలో రూ. 328కోట్ల విలువైన కమర్షియల్ ప్లాట్ ను కూడా కొనుగోలు చేసింది.

Also Read: SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు

క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికేనా ?                 

పుణె తర్వాత అమరావతికి సమీపంలోనే మైక్రోసాఫ్ట్ భూమిని కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. భూములపై పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ను సమకూర్చుకుంటుందా లేకపోతే.. ఇంకేదైనా వ్యూహం ఉందా అన్నదానిపై ఇండస్ట్రీ వర్గాలకు ఎలాంటి సమాచారం లేదు. తమ భూముల కొనుగోళ్ల వ్యవహారాలపై మైక్రోసాఫ్ట్ ఇండియా కూడా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Governor Speech: ఆరు గ్యారంటీ అమలు చేస్తున్నాం, రైతులు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Telangana Governor Speech: ఆరు గ్యారంటీ అమలు చేస్తున్నాం, రైతులు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
KCR At Assembly: అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
Airtel-Starlink Deal: స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌ - నేరుగా మీ ఇంటికే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్!
స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌ - నేరుగా మీ ఇంటికే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్!
Chittoor Gun Fire: చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Governor Speech: ఆరు గ్యారంటీ అమలు చేస్తున్నాం, రైతులు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Telangana Governor Speech: ఆరు గ్యారంటీ అమలు చేస్తున్నాం, రైతులు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
KCR At Assembly: అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
Airtel-Starlink Deal: స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌ - నేరుగా మీ ఇంటికే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్!
స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌ - నేరుగా మీ ఇంటికే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్!
Chittoor Gun Fire: చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Jabardasth Sowmya Rao: అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంటే... తండ్రి మరో మహిళతో - స్టేజిపైనే వెక్కివెక్కి ఏడ్చిన 'జబర్దస్త్' సౌమ్య
అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంటే... తండ్రి మరో మహిళతో - స్టేజిపైనే వెక్కివెక్కి ఏడ్చిన 'జబర్దస్త్' సౌమ్య
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
Borugadda Anil Kumar: హైకోర్టు సీరియస్, రాజమండ్రి జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్
హైకోర్టు సీరియస్, రాజమండ్రి జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్
Embed widget