అన్వేషించండి

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?

Microsoft: ఏపీ రాజధాని అమరావతి దగ్గరలో మైక్రోసాఫ్ట్ భూమిని కొనుగోలు చేసింది.దీంతో ఏపీలో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టబోతోందన్న ప్రచారం జరుగుతోంది.

Microsoft India buys 25-acre land parcel near Amaravati : ప్రపంచ దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి దగ్గరలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా ప్రాప్‌స్టాక్ తెలిపింది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మైక్రోసాఫ్ట్ సంస్థ నందిగామ వద్ద పాతిక ఎకరాల భూమిని రూ. 181 కోట్లుపెట్టి కొనుగోలు చేసినట్లుగా జాతీయ మీడియా చెబుతోంది. నందిగామ అమరావతి నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నాట్కో ఫార్మా, టైమ్ క్యాప్ ఫార్మా అనే  కంపెనీలకు భూమి ఉంది. వారి వద్ద నుంచి మైక్రోసాఫ్ట్ భూమి కొనుగోలు చేసినట్లుగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆదారంగా పాప్ స్టాక్ తెలిపింది. 

నందిగామ వద్ద  గత సెప్టెంబర్‌లోనే భూమి కొన్న మైక్రోసాఫ్ట్ ఇండియా               

మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటి వరకూ ఏపీలో పెట్టుబడులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కనీసం ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మైక్రోసాఫ్ట్ సంస్థ అడిగితే ప్రభుత్వమే అమరావతి లేదా విశాఖపట్నంలో భూమి ఇస్తుంది.. తమ ఆఫీసును ఏర్పాటు చేయడానికి రాయితీలు కూడా  ఇస్తుంది. కానీ గత సెప్టెంబర్‌లోనే మైక్రోసాఫ్ట్ సైలెంట్ గా భూమి కొనుగోలు చేసిందన్న విషయం బయటకు వచ్చిది. ఆ స్థలం కొనుగోలు చేయడంలో మైక్రోసాఫ్ట్ వ్యూహం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆ స్థలంలో మైక్రోసాఫ్ట్ ఎలాంటి ఆఫీసులు పెట్టాలనుకుంటోందో కూడా ఎవరికీ తెలియదు.   

Also Read:  ఏపీ యువతకు గూగుల్ నైపుణ్య శిక్షణ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం

విపరీతంగా పలు చోట్ల భూముల్ని కొంటున్న మైక్రో సాఫ్ట్                

అయితే మైక్రో సాఫ్ట్ వ్యూహాత్మకంగా డిమాండ్ పెరుగుతుందని అనుకున్న చోట్ల భూముల్ని కొనుగోలు చేస్తోందని ప్రాప్ స్టాక్ చెబుతోంది. గత రెండేళ్లుగా పలు చోట్ల భూములు కొనుగోలు చేసింది. పుణె లో వెయ్యి కోట్లు పెట్టి 30 ఎకరాలను గత ఏడాది కొనుగోలు చేసింది. గత ఆగస్టులో మరో పదహారు ఎకరాలను రూ. 453 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లుగా స్క్వేర్ యార్డ్స్ సంస్థ తెలిపింది. 2022లో పుణెలో రూ. 328కోట్ల విలువైన కమర్షియల్ ప్లాట్ ను కూడా కొనుగోలు చేసింది.

Also Read: SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు

క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికేనా ?                 

పుణె తర్వాత అమరావతికి సమీపంలోనే మైక్రోసాఫ్ట్ భూమిని కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. భూములపై పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ను సమకూర్చుకుంటుందా లేకపోతే.. ఇంకేదైనా వ్యూహం ఉందా అన్నదానిపై ఇండస్ట్రీ వర్గాలకు ఎలాంటి సమాచారం లేదు. తమ భూముల కొనుగోళ్ల వ్యవహారాలపై మైక్రోసాఫ్ట్ ఇండియా కూడా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget