అన్వేషించండి

Woman Life Rs. 5 Lakh: మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం

Andhra Pradesh News : అనంతపురంలో జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నకిలీ మందులతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, చికిత్స అందించిన ఆర్ఎంపీ డాక్టర్ రూ.5 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నాడు.

Value of womans life is 5 lakh rupees RMP doctor in Anantapur | అనంతపురం: జ్వరం వచ్చిందని ఆర్.ఎం.పి డాక్టర్ వద్దకు పోతే సూది మందేసి చంపేశారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం భూప సముద్రం గ్రామంలో ఆర్.ఎం.పి వైద్యుడు బోయ చిరంజీవి నిర్వాకం ఇది. బ్రహ్మసముద్రం మండలం రాయలూరి తాండకు చెందిన జ్యోతి బాయ్ అనే 31 ఏళ్ల మహిళకి సాధారణ సీజనల్ వ్యాధి... జ్వరంతో పాటు దగ్గు, జలుబు వచ్చింది. మందు బిల్లా.. సూది మందు వేసుకుంటే అంతా నయమైపోతుంది అనుకున్నారు తండా వాసులు. సూది మందు వేసేవాడు మందు, బిల్ల ఇచ్చేవాడు ఎంబిబిఎస్ డాక్టర్ అనుకునే అమాయకత్వం వారిది. ఈ అమాయకత్వపు ఆలోచనతోనే అరకొర విద్యను అభ్యసంచి ఆర్ఎంపి వైద్యుడిగా అవతారమెత్తిన బోయ చిరంజీవిని ఆశ్రయించింది. 

పేదల డాక్టర్‌గా చలామణి...

పేదల దగ్గర పెద్ద డాక్టర్ గా చలామణి అవుతున్న ఈ RMP చిరంజీవి పేషెంట్ జ్యోతి బాయ్ కి ఇంజెక్షన్ ఇచ్చాడు. గంటల వ్యవధిలో ఆ సూది మందు వికటించింది. జ్యోతి బాయ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బిత్తర పోయిన ఆర్ఎంపి వైద్యుడు చిరంజీవి వెంటనే కళ్యాణదుర్గం ఆర్ డి టి ఆసుపత్రికి పేషెంట్‌ను పంపించాడు. అక్కడ వైద్యులు కూడా చేతులు ఎత్తేశారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఆమెను రిఫర్ చేశారు. రెండు రోజుల ట్రీట్మెంట్ అనంతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ మెరుగైన వైద్యం కోసం కార్పొ"రేట్" ఆసుపత్రికి  వెళ్లాలని సూచించారు. 

నకిలీ మందుల ప్రయోగంతో మహిళ మృతి

బాధిత కుటుంబ సభ్యులు జ్యోతిబాయిని అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  ప్రాణాపాయ స్థితిలో అక్కడికి చేరుకున్న ఆమెను అనుభవజ్ఞులైన వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ జ్యోతిబాయ్ ప్రాణాలను నిలబెట్ట లేకపోయారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. నకిలీ మందులు ఆమెపై ప్రయోగించడం వల్లే జ్యోతి బాయ్ మృతి చెందినట్లు అక్కడి  వైద్యులు నిర్ధారించారు. మెడికల్ మాఫియా... దళిత, గిరిజనులు,బడుగు బలహీన వర్గాల మారుమూల గ్రామాల ప్రజలను టార్గెట్ చేస్తూ తమ తమ కంపెనీల ఔషధ ప్రయోగాలను చేస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పావులుగా మెడికల్ షాపులను వాడుకుంటున్నారన్న సందేహాలు బలపడుతున్నాయి. 

పంచాయతీ పెట్టి మహిళ ప్రాణాలకు వెల కట్టి..

ఈ క్రమంలో బాధిత కుటుంబాలను కాంప్రమైజ్ చేసుకోవడానికి సంబంధిత ఆర్ఎంపి వైద్య బృందం ₹5 లక్షల రూపాయలకు పంచాయతీ పెట్టింది. 2 లక్షల నుంచి ప్రారంభమైన వారి తాయిలం చివరకు ₹5 లక్షలకు చేరింది. ప్రాణానికి ఖరీదు కడుతున్న అంశాన్ని ఆ తాండావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. మందులు సరఫరా చేసిన సంబంధిత మెడికల్ ఏజెన్సీ ని, వారికి అన్ని అనుమతులు ఇచ్చిన అధికారులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబంతో పాటు గిరిజన, బంజారా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.

Also Read:  TDP News: కోటి మంది టీడీపీ కార్యకర్తలకు కీలక సూచన - ఇవి గుర్తు పెట్టుకుంటే కుటుంబానికి రూ. 5 లక్షల ధీమా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Hyderabad Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
Embed widget