అన్వేషించండి

Amaravati Farmers: అమరావతి రైతుల తిరుపతి సభపై ఉత్కంఠ... అనుమతిపై స్పందించని పోలీసులు... హైకోర్టును ఆశ్రయిస్తామంటున్న రైతులు

అమరావతి రైతులు ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.

అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలు, పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుపడుతూనే ఉన్నారు. తాజాగా అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించే సభకు పోలీసుల అనుమతి ఇవ్వలేదు. దీనిపై హైకోర్టుకు వెళ్తామని అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి అంటున్నారు. ఈనెల 17న తిరుపతిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. రైతుల సభకు అనుమతి ఇవ్వాలని కోరితే పోలీసులు స్పందించలేదన్నారు. పైగా ఆంక్షలకు సంబంధించి వివరణ ఇవ్వాలని పోలీసులు ప్రత్యుత్తరం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న వారిపై 42 కేసులు నమోదు అయ్యాయని, దీనిపై వివరణ ఇవ్వాలని ప్రశ్నించినట్లు శివారెడ్డి వెల్లడించారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే రాజకీయ బలంతో కేసులు పెట్టారని తాము ఎలాంటి నిబంధనలు ఉల్లఘించలేదని శివారెడ్డి అన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించండి... మంచి ఆదాయం వచ్చే విధానాలు సూచించండి... వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష

36వ రోజుకు చేరుకున్న మహాపాదయాత్ర

అమరావతి రైతులు చేస్తోన్న మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. రైతులు తమ వెంట తీసుకెళ్తోన్న వెంకటేశ్వరస్వామి రథానికి ప్రతీ గ్రామంలో ప్రజలు పూజలు చేసి, హారతులు పడుతున్నారు. రైతులపై పూలవర్షం కురిపిస్తూ సంఘీభావం తెలియజేస్తున్నారు. ఏకైక అమరావతిని కొనసాగించాలని రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 36వ రోజుకు చేరుకుంది. రైతుల మహాపాదయాత్రలో భాగంగా సోమవారం రైతులు నెల్లూరు జిల్లాలోని వెంగమాంబపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వెంగమాంబపురం నుంచి మాటమడుగు, బంగారుపల్లి మీదుగా రైతుల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. బంగారుపల్లిలో మధ్యాహ్న భోజనం చేశారు. రాత్రికి పాదయాత్ర వెంకటగిరికి చేరనుంది. వెంకటగిరి చేరుకోవడంతో ఈ రోజు పాదయాత్ర ముగియనుంది. రైతుల పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నా మొక్కవోని దీక్షతో అమరావతి ప్రాంత రైతులు ముందుకు సాగుతున్నారు. మహాపాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుందని వెల్లడించారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని రైతులు అంటున్నారు. 

Also Read: లోక్‌సభలో వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ.. మిథున్ రెడ్డి , రఘురామకృష్ణరాజు పరస్పర సవాళ్లు !

Also Read: ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan Strong Warning To Chandra Babu: మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్‌ సంచలన పోస్టు
మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్‌ సంచలన పోస్టు
Rahul Gandhi: రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ?  ఇదిగో అసలు నిజం
రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ? ఇదిగో అసలు నిజం
CM Revanth Reddy: కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, వారం రోజుల్లో నివేదిక అందించాలి: రెసిడెన్షియల్ స్కూల్స్ పనులపై రేవంత్ రెడ్డి
కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, వారం రోజుల్లో నివేదిక అందించాలి: రెసిడెన్షియల్ స్కూల్స్ పనులపై రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rajat Patidar RCB New Captain IPL 2025 | కొత్త కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ | ABP DesamBird Flu in East Godavari Poultry | పెరవలి మండలంలో మృత్యువాత పడుతున్న వేలాది కోళ్లు | ABP DesamPawan kalyan in Kumbakonam Swamimalai Visit | తమిళనాడు ఆలయాలను దర్శించుకుంటున్న డిప్యూటీ సీఎం | ABP DesamEluru Collector Vetriselvi on Bird Flu | కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చిందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan Strong Warning To Chandra Babu: మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్‌ సంచలన పోస్టు
మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్‌ సంచలన పోస్టు
Rahul Gandhi: రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ?  ఇదిగో అసలు నిజం
రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ? ఇదిగో అసలు నిజం
CM Revanth Reddy: కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, వారం రోజుల్లో నివేదిక అందించాలి: రెసిడెన్షియల్ స్కూల్స్ పనులపై రేవంత్ రెడ్డి
కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, వారం రోజుల్లో నివేదిక అందించాలి: రెసిడెన్షియల్ స్కూల్స్ పనులపై రేవంత్ రెడ్డి
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు కోర్టులో భారీ ఊరట
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు కోర్టులో భారీ ఊరట
Laila Movie Review - లైలా రివ్యూ: లేడీ గెటప్ వేస్తే? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా? హిట్టా ఫట్టా?
లైలా రివ్యూ: లేడీ గెటప్ వేస్తే? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా? హిట్టా ఫట్టా?
JioHotstar Subscription Plans: ఐపీఎల్‌ లవర్స్‌కు బిగ్‌షాక్- జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటేనే మ్యాచ్‌ చూసే ఛాన్స్‌- ప్లాన్స్ రేట్లు ఇవే
ఐపీఎల్‌ లవర్స్‌కు బిగ్‌షాక్- జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటేనే మ్యాచ్‌ చూసే ఛాన్స్‌- ప్లాన్స్ రేట్లు ఇవే
Vizag Crime News: పోర్న్ వీడియోల్లోలానే చేద్దామని ఫోర్స్ - ఆత్మహత్య చేసుకున్న భార్య - విశాఖలో ఘోరం
పోర్న్ వీడియోల్లోలానే చేద్దామని ఫోర్స్ - ఆత్మహత్య చేసుకున్న భార్య - విశాఖలో ఘోరం
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.