అన్వేషించండి

Maharashtra Karnataka Border: కర్ణాటకతో సరిహద్దు సమస్యపై మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం

Maharashtra Karnataka Border: కర్ణాటకతో సరిహద్దు సమస్యపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది.

Maharashtra Karnataka Border: కర్ణాటకతో వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న వారికి సంఘీభావం తెలుపుతూ మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ప్రవేశపెట్టారు.

బెలగాం, కార్వార్, నిపానీ, భాల్కీ, బీదర్ నగరాలు సహా కర్ణాటకలోని 865 మరాఠీ మాట్లాడే గ్రామాలను ఎట్టిపరిస్థితుల్లోనూ మహారాష్ట్రలో చేర్చేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు సుప్రీం కోర్టులో జరుగుతాయని తీర్మానాన్ని సీఎం చదివి వినిపించారు.

కేంద్ర హోంమంత్రితో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరాలని శిందే అన్నారు. అలానే సరిహద్దు ప్రాంతాల్లోని మరాఠీ ప్రజల భద్రతకు హామీ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

కర్ణాటక

మరోవైపు సరిహద్దు సమస్యపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేసిన తీర్మానాన్ని కర్ణాటక శాసనసభ కూడా గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. భారతీయ జనతా పార్టీ కర్ణాటకతో పాటు మహారాష్ట్రలో అధికారంలో ఉంది. అక్కడ  శిందే నేతృత్వంలోని శివసేన వర్గంతో పొత్తులో ఉంది.

ఠాక్రే

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్దవ్ ఠాక్రే )వర్గం అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. ఈ అంశంపై అసెంబ్లీలో సోమవారం ఓ డిమాండ్ చేశారు.  కర్ణాటక, మహారాష్ట్ర మధ్య నడుస్తున్న సరిహద్దు వివాదం (Karnataka Maharashtra Row) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భాష, సరిహద్దుకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, మానవత్వానికి సంబంధించిన విషయం అని అన్నారు.

మరాఠీ మాట్లాడే ప్రజలు తరతరాలుగా సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్నారు. వారి దైనందిన జీవితం, భాష, జీవనవిధానం అంతా మరాఠీలకు సంబంధించినది. ఈ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం.. "కర్ణాటక ఆక్రమించుకున్న మహారాష్ట్ర" భూభాగాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి.                                 "
-ఉద్ధవ్ ఠాక్రే, శివసేన

మరోవైపు ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఠాక్రే తప్పుబట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దూకుడుగా వ్యవహరిస్తుంటే మహారాష్ట్ర సీఎం మెతక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు.

సరిహద్దు సమస్య

భాష ఆధారంగా రాష్ట్రాలను విభజించిన తర్వాత 1957లో ఈ సమస్య ప్రారంభమైంది. ఇంతకముందు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావి తమదేనని, ఆ ప్రాంతంలో ఎక్కువ జనాభా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారని మహారాష్ట్ర అంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో 800లకు పైగా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్న గ్రామాలు ఉన్నాయని అంటుంది. భాష ఆధారంగా రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1967లో మహాజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇచ్చిన సరిహద్దులను కర్ణాటక కొనసాగిస్తుంది.

Also Read: Covid Vaccine: హమ్మయ్యా, బూస్టర్‌ డోస్‌గా నాసల్ వ్యాక్సిన్ వచ్చేసింది- ధర ఎంతంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Honeytrap case: అనంతపురం హనీట్రాప్ కేసులో నలుగురు పోలీసులు డిస్మిస్.. మరికొందరిపై సస్పెన్షన్ వేటు
అనంతపురం హనీట్రాప్ కేసులో నలుగురు పోలీసులు డిస్మిస్.. మరికొందరిపై సస్పెన్షన్ వేటు
Who is Dusharla Satyanarayana: అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?
అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?
Kamareddy Crime News: నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
Bengal Assembly Elections: బెంగాల్ ఎన్నికల్లో భారీ ఓటింగ్ - ప్రభుత్వ వ్యతిరేకతేనని బీజేపీ ఆశలు - మమతాబెనర్జీకి కష్టమేనా?
బెంగాల్ ఎన్నికల్లో భారీ ఓటింగ్ - ప్రభుత్వ వ్యతిరేకతేనని బీజేపీ ఆశలు - మమతాబెనర్జీకి కష్టమేనా?

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Who is Dusharla Satyanarayana: అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?
అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?
AP special assembly sessions: మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
Stand-up Comedian Sarat Uday: స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
Kamareddy Crime News: నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
Ashu Reddy Issue : అషు రెడ్డి వివాదంలో షాకింగ్ ట్విస్ట్ - కాల్ మనీ రాకెట్‌తో లింక్?
అషు రెడ్డి వివాదంలో షాకింగ్ ట్విస్ట్ - కాల్ మనీ రాకెట్‌తో లింక్?
Best Summer Foods : వేసవిలో ఎనర్జీ, ఇమ్యూనిటీ పెంచే తెలుగు ఫుడ్స్.. అలసటను దూరం చేసుకునేందుకు ఇవే బెస్ట్
వేసవిలో ఎనర్జీ, ఇమ్యూనిటీ పెంచే తెలుగు ఫుడ్స్.. అలసటను దూరం చేసుకునేందుకు ఇవే బెస్ట్
BRS Foundation Day: సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం
సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం
Angkrish Raghuvanshi Dismissed: అరుదైన రీతిలో అవుటైన రఘువంశీ.. ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి! అసలేమిటి ఈ 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' రూల్?
అరుదైన రీతిలో అవుటైన రఘువంశీ.. ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి! అసలేమిటి ఈ 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' రూల్?
Embed widget