అన్వేషించండి

AP Inter Supply Exam Date 2025: ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై మంత్రి లోకేష్ ప్రకటన

AP Inter Results 2025 | ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. వచ్చే నెలలో పరీక్షలపై క్లారిటీ ఇచ్చారు.

AP Inter Supply Exam Date 2025: అమరావతి: ఏపీలో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విడుదల చేశారు. ఫలితాలలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇంటర్ సెకండియర్ లో 83 శాతం మంది పాస్ కాగా, ఫస్టియర్ పరీక్షలలో 70 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇదే సమయంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలపై అప్‌డేట్ ఇచ్చారు. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు నిరాశ చెందవద్దని, వచ్చే నెలలో నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని, స్కోర్ చేయడానికి మళ్లీ ప్రిపేర్ అయి మంచి మార్కులతో పాస్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

 

ఎగ్జామ్ ఫీజు, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ వివరాలు

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.  ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజులు చెల్లించాలని సప్లిమెంటరీ విద్యార్థులకు సూచించారు. ఏపీలో ఫస్టియర్ కంటే సెకండియర్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఓవరాల్ గా చూస్తే ఫలితాలలో అమ్మాయిలు పైచేయి సాధించారు. 

ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలలో గత 10 పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఫస్టియర్ లో 70% విద్యార్థులు శాతం పాస్ కాగా, రెండో సంవత్సరంలో 83% మంది ఉత్తీర్ణత సాధించారు.  

ఫస్టియర్ పాస్ పర్సంటేజీ..

4,87,295 మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరుకాగా, 3,42,979 మంది పాసయ్యారు. ఫస్టియర్ ఒకేషనల్‌లో 38,553 మంది పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 23,991 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఓవరాల్ గా చూస్తే 70 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఒకేషనల్ లో అయితే 62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

సెకండియర్ పాస్ పర్సంటేజీ..

ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు 83 శాతం పాస్ అయ్యారు. సెకండియర్ లో 4,22,030 మంది విద్యార్థులు ఎగ్జామ్ హాజరుకాగా, 3,51,521 మంది పాసయ్యారు. ఒకేషనల్ విద్యార్థులలో 33,289 మంది పరీక్ష రాయగా, 25,707 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విద్యార్థులలో 77 శాతం పాస్ అయ్యారని మంత్రి లోకేష్ వెల్లడించారు.

ఫస్టియర్‌లో అమ్మాయిలు 75 శాతం పాస్ కాగా, బాలురు 66 శాతం పాసయ్యారు. ఫస్టియర్ ఒకేషనల్ లో అయితే అమ్మాయిలు 71 శాతం పాస్ కాగా, బాలురు 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
సెకండియర్ లో అమ్మాయిలు 86 శాతం పాస్ కాగా, అబ్బాయిలు 80 శాతం పాసయ్యారు. ఒకేషనల్ లో అమ్మాయిలు 84 శాతం పాస్ కాగా, అబ్బాయిలు 67 శాతం ఉత్తీర్ణత సాధించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
Ishan Kishan Viral Video: టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget