అన్వేషించండి

AP Inter Supply Exam Date 2025: ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై మంత్రి లోకేష్ ప్రకటన

AP Inter Results 2025 | ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. వచ్చే నెలలో పరీక్షలపై క్లారిటీ ఇచ్చారు.

AP Inter Supply Exam Date 2025: అమరావతి: ఏపీలో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విడుదల చేశారు. ఫలితాలలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇంటర్ సెకండియర్ లో 83 శాతం మంది పాస్ కాగా, ఫస్టియర్ పరీక్షలలో 70 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇదే సమయంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలపై అప్‌డేట్ ఇచ్చారు. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు నిరాశ చెందవద్దని, వచ్చే నెలలో నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని, స్కోర్ చేయడానికి మళ్లీ ప్రిపేర్ అయి మంచి మార్కులతో పాస్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

 

ఎగ్జామ్ ఫీజు, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ వివరాలు

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.  ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజులు చెల్లించాలని సప్లిమెంటరీ విద్యార్థులకు సూచించారు. ఏపీలో ఫస్టియర్ కంటే సెకండియర్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఓవరాల్ గా చూస్తే ఫలితాలలో అమ్మాయిలు పైచేయి సాధించారు. 

ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలలో గత 10 పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఫస్టియర్ లో 70% విద్యార్థులు శాతం పాస్ కాగా, రెండో సంవత్సరంలో 83% మంది ఉత్తీర్ణత సాధించారు.  

ఫస్టియర్ పాస్ పర్సంటేజీ..

4,87,295 మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరుకాగా, 3,42,979 మంది పాసయ్యారు. ఫస్టియర్ ఒకేషనల్‌లో 38,553 మంది పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 23,991 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఓవరాల్ గా చూస్తే 70 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఒకేషనల్ లో అయితే 62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

సెకండియర్ పాస్ పర్సంటేజీ..

ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు 83 శాతం పాస్ అయ్యారు. సెకండియర్ లో 4,22,030 మంది విద్యార్థులు ఎగ్జామ్ హాజరుకాగా, 3,51,521 మంది పాసయ్యారు. ఒకేషనల్ విద్యార్థులలో 33,289 మంది పరీక్ష రాయగా, 25,707 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విద్యార్థులలో 77 శాతం పాస్ అయ్యారని మంత్రి లోకేష్ వెల్లడించారు.

ఫస్టియర్‌లో అమ్మాయిలు 75 శాతం పాస్ కాగా, బాలురు 66 శాతం పాసయ్యారు. ఫస్టియర్ ఒకేషనల్ లో అయితే అమ్మాయిలు 71 శాతం పాస్ కాగా, బాలురు 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
సెకండియర్ లో అమ్మాయిలు 86 శాతం పాస్ కాగా, అబ్బాయిలు 80 శాతం పాసయ్యారు. ఒకేషనల్ లో అమ్మాయిలు 84 శాతం పాస్ కాగా, అబ్బాయిలు 67 శాతం ఉత్తీర్ణత సాధించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
UK Student Visa Rules: ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
NEET PG Exam: నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
US Divorce Decree: అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
Railway Projects In AP and Telangana: రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
Vallabhaneni Vamsi: కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
KTR: సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
Kavya Shree: 'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
Epic Review : ఎపిక్ ఓ బ్యూటిఫుల్ జర్నీ - 90s బయోపిక్ సీక్వెల్ కాదు... యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ
ఎపిక్ ఓ బ్యూటిఫుల్ జర్నీ - 90s బయోపిక్ సీక్వెల్ కాదు... యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ
Embed widget