అన్వేషించండి

Viveka Murder Case: వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ! వాట్సాప్‌ కాల్‌ గుట్టు విప్పే పనిలో దర్యాప్తు సంస్థ!

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మళ్లీ విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే నిందితులుగా ఉన్న వారి బంధువులను ప్రశ్నిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత, ఈ కేసు కొత్త టర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు, మళ్లీ విచారణ స్పీడ్ పెంచనున్నారు. శుక్రవారం కడ జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్‌ కేంద్రంగా జరిగిన పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 

రెండేళ్ల తర్వాత సీబీఐ యాక్టివ్‌

వివేకా హత్య జరిగిన చాలా కాలం గడిచినా, ఈ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై కొన్ని కీలక సూచనలు చేసింది. దీంతో సీబీఐ అధికాలు మళ్లీ తమ పనిని మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం పులివెందుల పోలీస్ స్టేషన్‌లో అధికారులు విచారణ చేపట్టారు. రెండేళ్ల తర్వాత అధికారులు ఇంత వేగంగా కదలడం చూస్తుంటే కేసులో కీలకమైన ఆధారాలు లభించాయేమో అన్న అనుమానం కలుగుతుంది. 

నిందితుల బంధువులకు నోటీసులు

ఈ కేసులో గతంలో కొందరు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల వైపు సీబీఐ దృష్టి పెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారి సోదరులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్, భరత్‌ కుమార్ యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్‌కు నోటీసులు ఇచ్చారు. వీరిద్దరి విచారణ రావాలని ఆదేశించగా శుక్రవారం ఉదయమే మహేంద్ర యాదవ్ పులివెందుల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మరోవైపు కిరణ్‌ యాదవ్ కూడా అధికారుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఆ అర్ధరాత్రి వాట్సాప్ కాల్ మిస్టరీ ఏంటీ?

ఈ విచారణలో అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఒక వాట్సాప్ కాల్. వివేకా హత్య జరిగిన తెల్లవారుజామున 1.42 గంటల సమయంలో కిరణ్ యాదవ్‌ ఫోన్ నుంచి ఒక కాల్ వెళ్లినట్టు సీబీఐ గుర్తించింది. అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి ఒక వాట్సాప్ కాల్ చేసారు. సాధారణంగా అందరూ నిద్రపోయే ఆ సమయంలో అది కూడా హత్య జరిగిన రోజే ఇంత అర్థరాత్రి కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. వారిద్ధరి మధ్య ఏం చర్చ జరిగింది, అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది కేవలం సాధారణ కాల్‌ మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా ప్లాన్ ఉందా అని లోతుగా విచారిస్తున్నారు. 

హైదరాబాద్‌ నుంచి పులివెందుల వరకు... 

నిజానికి వీరిద్దరిని సీబీఐ అధికారులు ఈ నెల 20న హైదరాబాద్‌లో ప్రాథమికంగా విచారించారు. అక్కడ వచ్చిన సమాచారం అధారంగా, మరిన్ని వివరాలు సేకరించేందుకు ఇప్పుడు నేరుగా పులివెందులలలో విచారణ జరుపుతున్నారు. గతంలో దొరికిన కాల్ డేటాను ఇప్పుడు వీరు చెబుతున్న సమాచారాన్ని అధికారులు సరిపోల్చి చూస్తున్నారు. వైఎస్‌ వివేక హత్య కేసు మళ్లీ మొదటికి వచ్చిందా లేదా క్లైమాక్స్‌కు చేరుకుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 

Frequently Asked Questions

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ఎందుకు వేగవంతమైంది?

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు ఈ కేసు విచారణను మళ్లీ ప్రారంభించారు. రెండేళ్ల విరామం తర్వాత, అధికారులు ఇప్పుడు వేగంగా కదులుతున్నారు.

సీబీఐ అధికారులు ఎవరికి నోటీసులు ఇచ్చారు?

కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారి కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా సునీల్ యాదవ్, భరత్ కుమార్ యాదవ్ సోదరులకు నోటీసులు జారీ చేశారు.

విచారణలో ముఖ్యమైన అంశం ఏమిటి?

వివేకా హత్య జరిగిన తెల్లవారుజామున కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి అర్జున్ రెడ్డికి వెళ్లిన ఒక వాట్సాప్ కాల్ చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో ఆ కాల్ ఎందుకు వెళ్లింది, వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది అని అధికారులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రాథమిక విచారణ తర్వాత సీబీఐ ఇప్పుడు ఎక్కడ విచారణ చేస్తోంది?

హైదరాబాద్‌లో ప్రాథమిక విచారణ అనంతరం, మరిన్ని వివరాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు ఇప్పుడు నేరుగా పులివెందులలో విచారణ జరుపుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
Advertisement

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
India vs England 2nd Semi Final: ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!
ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Speaker chit chat: వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
ప్రారంభమైన Nissan Gravite 7 సీటర్ కారు డెలివరీ.. ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్, ధర, ఫీచర్ల వివరాలు
ప్రారంభమైన Nissan Gravite 7 సీటర్ కారు డెలివరీ.. ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్, ధర, ఫీచర్ల వివరాలు
Embed widget