Youth Congress vs YS Jagan: వైఎస్ వారసత్వానికి తలవంపులు తీసుకురావొద్దు - జగన్కు కాంగ్రెస్ సలహా - అసలేం జరిగిందంటే?
Youth Congress: జగన్ పై యూత్ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. తండ్రి వారసత్వానికి తలవంపులు తేవొద్దని సూచించింది.

Youth Congress criticizes Jagan : అంతర్జాతీయ వేదికగా జరిగిన ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ చేపట్టిన నిరసనలను జగన్ విమర్శించడం వివాదాస్పదమయింది. ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు భారత్ ప్రతిష్టను మసకబార్చేలా యూత్ కాంగ్రెస్ నేతలు ప్రవర్తించడం అక్షేపణీయమని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాజకీయ విభేదాలు ఏవైనా ఉండవచ్చు కానీ, అంతర్జాతీయ వేదికలపై దేశం ఐక్యంగా కనిపించాలని, భారత్ను ప్రపంచం ముందు చులకన చేయడం ఆమోదయోగ్యం కాదని వైసీపీ స్పష్టం చేసింది.
Yesterday at the AI Summit, the Youth Congress made us all feel ashamed. Where is our politics heading! No one should ever demean our country. Whatever our political differences may be, we should always present a united face to the world.
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026
జగన్ చేసిన ట్వీట్ పై యూత్ కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేసింది. మీ తండ్రి, మా గర్వించదగ్గ నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన జీవితమంతా మతతత్వ, విభజన , రాజీ పడే శక్తులకు వ్యతిరేకంగా పోరాడారని, ప్రస్తుతం మీరు సిబిఐ, ఈడి కేసులను ఎదుర్కొంటున్న విషయం మాకు తెలుసని, అయితే కనీసం మీ తండ్రి ఆశయాలను, ఆయన వారసత్వాన్ని ఇలా బహిరంగంగా దిగజార్చవద్దని ఈ సందర్భంగా కాంగ్రెస్ పేర్కొంది.
Dear Jagan,
— Indian Youth Congress (@IYC) February 21, 2026
Your father, our proud leader Late Shri Y. S. Rajasekhara Reddy (YSR), dedicated his life to fighting communal, divisive & compromised forces.
We understand you are facing CBI/ED cases, but at the very least, do not let your father’s legacy down so openly. https://t.co/awb25qZ1GL
ఈ ట్వీట్ పై అంబటి రాంబాబు స్పందించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు, ఆయన మరణం తర్వాత ఆ కుటుంబాన్ని ఎంతగా వేధించారో దేశమంతా చూసిందని అన్నారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి, ఆయన మరణానంతరం గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. తమ రాజకీయ అవసరాల కోసం చరిత్రను వక్రీకరిస్తూ ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
Dear Congress leaders,
— Ambati Rambabu (@AmbatiRambabu) February 21, 2026
After the demise of Y. S. Rajasekhara Reddy garu, the whole nation witnessed how you treated him and his family. Those events remain deeply etched in public memory.And today, you speak about him and his legacy modifying the history for your convenience.The… https://t.co/49fxybw1t8
రాజకీయ సమీకరణాలతో సంబంధం లేకుండా, జాతీయ ప్రయోజనాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ స్పష్టమైన వైఖరితో ఉందని అంబటి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంట్లో కీలక బిల్లుల విషయంలో తమ పార్టీ దేశ హితానికే మొగ్గు చూపిందని, సంకుచిత రాజకీయాల కోసం స్టాండ్ మార్చుకోలేదని స్పష్టం చేసింది.























